వందేభారత్ రసౌలీ స్టేషన్ సమీపం లోకి రాగానే కదులుతున్న రైలుపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. రాళ్లు విసరడం వల్ల రైలు లోని సి6 కోచ్ లోని అద్దం పగిలిపోయింది.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. హజ్రత్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నావెల్టీ సినిమా వెనుక ఉన్న కెనరా బ్యాంక్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే మంటలు భవనం మొత్తం వ్యాపించడంతో.. కొందరు ఉద్యోగులు భవనంపై నుండి దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉన్నాయి. ఇదిలా ఉంటే.. బ్యాంకులో మంటల దాటికి బయటకురాకుండా…
Rajnath Singh: ఉత్తరప్రదేశ్లోని లక్నోలోని గురుద్వారా అలంబాగ్లో శనివారం జరిగిన గురు గ్రంథ్ సాహిబ్ ప్రకాష్ ఉత్సవ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిక్కు సమాజాన్ని ఉద్దేశిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అమోధ్యలో రామమందిరం కోసం దేశంలోని సిక్కు సమాజం ఉద్యమాన్ని ప్రారంభించిందని ఆయన అన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు సిక్కు సమాజం ఎంతో కృషి చేసిందని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు.
KL Rahul Remember bad memories in Lucknow ahead of IND vs ENG Match: లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకనా క్రికెట్ స్టేడియంకు, టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్కు మధ్య మంచి అనుబంధం ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో లక్నో సూపర్ జెయింట్స్కు కెప్టెన్గా రాహుల్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అలానే లక్నో స్టేడియంలో రాహుల్కు చేదు అనుభవం కూడా ఉంది. ఐపీఎల్ 2023 లీగ్ మధ్యలో…
ప్రపంచకప్ 2023లో భారత జట్టు అద్భుతమైన ఫామ్తో దూసుకుపోతోంది. మొత్తం 5 మ్యాచ్లు గెలిచిన రోహిత్ సేనకు తదుపరి సవాలు ఆదివారం ఇంగ్లాండ్తో జరిగే మ్యాచే. ఇంగ్లండ్ 5 మ్యాచుల్లో నాలుగింటిలో ఓడిపోయింది.
Uttar Pradesh: విద్యార్థులు స్కూల్లో నమాజ్ చేయడం ఉత్తర్ ప్రదేశ్ లో వివాదాస్పదం అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, హిందూ సంఘాలు దీనికి అభ్యంతరం తెలపడంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. లక్నోలోని స్కూల్ లో నమాజ్ చేస్తున్న విద్యార్థుల వీడియో వైరల్ కావడంతో, ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చేసింది ప్రభుత్వం. మరో ఇద్దరు ఉపాధ్యాయుల్ని హెచ్చరించి వదిలేసింది.
వరల్డ్ కప్ 2023లో భాగంగా.. ఆస్ట్రేలియా-శ్రీలంక మధ్య మ్యాచ్ ఈ రోజు లక్నోలో జరుగుతుంది. అయితే మ్యాచ్ మధ్యలో భారీ వర్షం, తుపాన్ వచ్చింది. దీంతో గాలిదుమారానికి స్టేడియంలోని ఓ భారీ బోర్డు ఊడి ప్రేక్షకులు కూర్చునే సీట్ల మధ్య పడిపోయింది. అయితే అది ఊడిపడిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన కాలేజీ విద్యార్థినిని ఓ యువకుడు దారుణంగా చంపాడు. తుపాకీతో కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఘటన లక్నోలో జరిగింది.
Roshini App: ‘సర్వేంద్రియానం నయనం ప్రధానం’ అంటారు. మనకు ఉన్న ఇంద్రియాల్లో కళ్లు చాలా ముఖ్యమని భావిస్తారు. అయితే చాలా వరకు కంటి జబ్బుల్ని ముందు దశల్లో గుర్తిస్తే చికిత్స చాలా సులభం ఉంటుంది. ముఖ్యంగా కంటి శుక్లాలను ( క్యాటరాక్ట్) కామన్ గా కనినిపించే కంటి జబ్బు. దీనిని తొలిదశల్లో గుర్తించేందుకు లక్నోకు చెందిన ఓ టీనేజర్ ఏకంగా ఓ యాప్ ని కనిపెట్టాడు.
Stick ladder Walked in Postmortem Room: దెయ్యాలు ఉన్నాయంటే అది భ్రమ అలాంటివి ఏవి ఉండవని చాలా మంది కొట్టిపారేస్తూ ఉంటారు. అయితే ఇంకొద్ది మంది మాత్రం తాము దెయ్యాలని చూశామని, వాటితో మాట్లాడామని చెబుతూ ఉంటారు. అయితే వాటికి సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో వాటిని నిరూపించలేకపోతున్నారు. ఇదిలా వుంటే మనం చాలా సినిమాల్లో ఆత్మలు వాటి దగ్గరలో ఉన్న బొమ్మలోకో, వస్తువుల్లోకో ప్రవేశించడం చూస్తూ ఉంటాం. అమ్మో బొమ్మ, టెడ్డీ లాంటి కొన్ని సినిమాలు…