కిషన్ రెడ్డి తెలంగాణ కి ఏం ఇచ్చారో చెప్పండని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రయోజనాల కోసం కిషన్ రెడ్డి టూరిజం నుండి ఏం తెచ్చావు చూపించాలన్నారు.
మాజీ సర్పంచులకు పెండింగ్లో ఉన్న బిల్లులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలి అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పష్టంగా డిమాండ్ చేశారు. సర్పంచుల సంఘం పలు నెలలుగా పోరాడుతూ ఉన్న పెండింగ్ బిల్లుల మంజూరుపై ప్రెస్ ద్వారా స్పందిస్తూ, వారు చేపట్టిన చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి పోలీసులు వ్యతిరేకంగా స్పందించి, అనేక ప్రాంతాలలో మాజీ సర్పంచులను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.
రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టారని, 11 నెలల నుండి మాజీ సర్పంచులకు బిల్లులు రాలేదన్నారు మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. సీఎం,పంచాయతీ రాజ్ శాఖా మంత్రికి వినతిపత్రం ఇవ్వాలని సర్పంచులు భావిస్తే దొంగల్లా అరెస్టు చేశారన్నారు హరీష్ రావు.
ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల పలు సమీక్షలను నిర్వహించారు. సోమవారం మేధావులతో సమావేశమై అభిప్రాయాలను స్వీకరించారు. మంగళవారం సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి ఇంటి నుండి వివరాలను సేకరించడంపై దృష్టి పెట్టాలని డిప్యూటీ సీఎం సూచించారు.