Harish Rao : రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టారు
- 11 నెలల నుండి మాజీ సర్పంచులకు బిల్లులు రాలేదు
- అనేక అవార్డులు తెలంగాణ సర్పంచులకు వచ్చాయి
- సర్పంచులు నేడు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టారని, 11 నెలల నుండి మాజీ సర్పంచులకు బిల్లులు రాలేదన్నారు మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. సీఎం,పంచాయతీ రాజ్ శాఖా మంత్రికి వినతిపత్రం ఇవ్వాలని సర్పంచులు భావిస్తే దొంగల్లా అరెస్టు చేశారన్నారు హరీష్ రావు. మాజీ సర్పంచులను పోలీసులు అవమానించారని, తెలంగాణ సర్పంచులు దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. అనేక అవార్డులు తెలంగాణ సర్పంచులకు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో సర్పంచులకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, సర్పంచులు నేడు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని హరీష్ రావు మండిపడ్డారు. కేంద్రం నుండి గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం దారి మళ్ళిస్తోందని, తెలంగాణకు రాహుల్ గాంధీ వస్తున్నారని, రాహుల్ గాంధీ అశోక్ నగర్ కు రావాలన్నారు హరీష్ రావు. ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ అశోక్ నగర్ కు వచ్చారని, జీవో 29 ను రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారన్నారు. గ్రామ పంచాయతీలను రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేశారని, ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయా లేదా రాహుల్ గాంధీ రివ్యూ చేయాలన్నారు హరీష్ రావు.
CM Chandrababu: రాష్ట్రంలో నూతన క్రీడా విధానంపై సీఎం చంద్రబాబు సమీక్ష
Also Read
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ 'మియా భాయ్' సక్సెస్ స్టోరీ!
- Tirupati: రూ.3 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తా.. డేటింగ్ యాప్ పరిచయం కాస్తా.!
అన్ని వర్గాలను మోసం చేశారని హరీష్ రావు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు చేసిన సర్పంచులను విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. పెద్ద,పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారని, సర్పంచులకు బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. గ్రామాలను అభివృద్ధి చేసిన శిక్ష ఎందుకు, గ్రామ పంచాయతీకు ఆర్ధిక సంఘం నిధులు వచ్చాయన్నారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫ్రీజింగ్ ఎత్తివేయాలని, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో రెండు వేల కోట్లు బకాయిలు వుంటే బిఆర్ఎస్ అధికారంలోకి రాగానే చెల్లించామన్నారు. బీఆర్ఎస్ పదేళ్లల్లో 4 లక్షల 26 వేల కోట్లు అప్పు చేశామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కాకుండానే 85 వేల కోట్లు అప్పు చేసిందన్నారు. కాంగ్రెస్ వచ్చాక సంక్షేమ పథకాలు బంద్ పెట్టిందని, పోలీసులకు సరెండర్ లీవ్ బంద్ చేశారని ఆయన వ్యాఖ్యానించారు. టీజీఎస్పీ పోలీసులు రోడ్ల మీదకు వచ్చారని ఆయన అన్నారు.
Uttarakhand: 36కు చేరిన అల్మోరా ప్రమాద ఘటన మృతుల సంఖ్య.. పీఎం, సీఎం సంతాపం
తాజావార్తలు
-
Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
-
US LPG Supplier to India: భారత్కు 67% LPG అమెరికా నుంచే.. అతిపెద్ద సరఫరాదారుగా యూఎస్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
DC OTT Release: థియేటర్లలో ‘డీసీ’ హంగామా.. అప్పుడే ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్!
-
Producer Naga Vamsi: నిర్మాతల మధ్య గొడవలు ఎందుకు వస్తాయో చెప్పిన నాగవంశీ.. ఆ రోజులు పోయాయంటూ కామెంట్స్!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!