Harish Rao : రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టారు
- 11 నెలల నుండి మాజీ సర్పంచులకు బిల్లులు రాలేదు
- అనేక అవార్డులు తెలంగాణ సర్పంచులకు వచ్చాయి
- సర్పంచులు నేడు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టారని, 11 నెలల నుండి మాజీ సర్పంచులకు బిల్లులు రాలేదన్నారు మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. సీఎం,పంచాయతీ రాజ్ శాఖా మంత్రికి వినతిపత్రం ఇవ్వాలని సర్పంచులు భావిస్తే దొంగల్లా అరెస్టు చేశారన్నారు హరీష్ రావు. మాజీ సర్పంచులను పోలీసులు అవమానించారని, తెలంగాణ సర్పంచులు దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. అనేక అవార్డులు తెలంగాణ సర్పంచులకు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో సర్పంచులకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, సర్పంచులు నేడు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని హరీష్ రావు మండిపడ్డారు. కేంద్రం నుండి గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం దారి మళ్ళిస్తోందని, తెలంగాణకు రాహుల్ గాంధీ వస్తున్నారని, రాహుల్ గాంధీ అశోక్ నగర్ కు రావాలన్నారు హరీష్ రావు. ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ అశోక్ నగర్ కు వచ్చారని, జీవో 29 ను రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారన్నారు. గ్రామ పంచాయతీలను రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేశారని, ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయా లేదా రాహుల్ గాంధీ రివ్యూ చేయాలన్నారు హరీష్ రావు.
CM Chandrababu: రాష్ట్రంలో నూతన క్రీడా విధానంపై సీఎం చంద్రబాబు సమీక్ష
Also Read
- OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
- OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
- RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
అన్ని వర్గాలను మోసం చేశారని హరీష్ రావు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు చేసిన సర్పంచులను విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. పెద్ద,పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారని, సర్పంచులకు బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. గ్రామాలను అభివృద్ధి చేసిన శిక్ష ఎందుకు, గ్రామ పంచాయతీకు ఆర్ధిక సంఘం నిధులు వచ్చాయన్నారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫ్రీజింగ్ ఎత్తివేయాలని, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో రెండు వేల కోట్లు బకాయిలు వుంటే బిఆర్ఎస్ అధికారంలోకి రాగానే చెల్లించామన్నారు. బీఆర్ఎస్ పదేళ్లల్లో 4 లక్షల 26 వేల కోట్లు అప్పు చేశామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కాకుండానే 85 వేల కోట్లు అప్పు చేసిందన్నారు. కాంగ్రెస్ వచ్చాక సంక్షేమ పథకాలు బంద్ పెట్టిందని, పోలీసులకు సరెండర్ లీవ్ బంద్ చేశారని ఆయన వ్యాఖ్యానించారు. టీజీఎస్పీ పోలీసులు రోడ్ల మీదకు వచ్చారని ఆయన అన్నారు.
Uttarakhand: 36కు చేరిన అల్మోరా ప్రమాద ఘటన మృతుల సంఖ్య.. పీఎం, సీఎం సంతాపం
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!