Harish Rao : రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టారు
- 11 నెలల నుండి మాజీ సర్పంచులకు బిల్లులు రాలేదు
- అనేక అవార్డులు తెలంగాణ సర్పంచులకు వచ్చాయి
- సర్పంచులు నేడు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది
Harish Rao : రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టారని, 11 నెలల నుండి మాజీ సర్పంచులకు బిల్లులు రాలేదన్నారు మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. సీఎం,పంచాయతీ రాజ్ శాఖా మంత్రికి వినతిపత్రం ఇవ్వాలని సర్పంచులు భావిస్తే దొంగల్లా అరెస్టు చేశారన్నారు హరీష్ రావు. మాజీ సర్పంచులను పోలీసులు అవమానించారని, తెలంగాణ సర్పంచులు దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. అనేక అవార్డులు తెలంగాణ సర్పంచులకు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో సర్పంచులకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, సర్పంచులు నేడు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని హరీష్ రావు మండిపడ్డారు. కేంద్రం నుండి గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం దారి మళ్ళిస్తోందని, తెలంగాణకు రాహుల్ గాంధీ వస్తున్నారని, రాహుల్ గాంధీ అశోక్ నగర్ కు రావాలన్నారు హరీష్ రావు. ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ అశోక్ నగర్ కు వచ్చారని, జీవో 29 ను రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారన్నారు. గ్రామ పంచాయతీలను రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేశారని, ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయా లేదా రాహుల్ గాంధీ రివ్యూ చేయాలన్నారు హరీష్ రావు.
CM Chandrababu: రాష్ట్రంలో నూతన క్రీడా విధానంపై సీఎం చంద్రబాబు సమీక్ష
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
అన్ని వర్గాలను మోసం చేశారని హరీష్ రావు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు చేసిన సర్పంచులను విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. పెద్ద,పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారని, సర్పంచులకు బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. గ్రామాలను అభివృద్ధి చేసిన శిక్ష ఎందుకు, గ్రామ పంచాయతీకు ఆర్ధిక సంఘం నిధులు వచ్చాయన్నారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫ్రీజింగ్ ఎత్తివేయాలని, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో రెండు వేల కోట్లు బకాయిలు వుంటే బిఆర్ఎస్ అధికారంలోకి రాగానే చెల్లించామన్నారు. బీఆర్ఎస్ పదేళ్లల్లో 4 లక్షల 26 వేల కోట్లు అప్పు చేశామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కాకుండానే 85 వేల కోట్లు అప్పు చేసిందన్నారు. కాంగ్రెస్ వచ్చాక సంక్షేమ పథకాలు బంద్ పెట్టిందని, పోలీసులకు సరెండర్ లీవ్ బంద్ చేశారని ఆయన వ్యాఖ్యానించారు. టీజీఎస్పీ పోలీసులు రోడ్ల మీదకు వచ్చారని ఆయన అన్నారు.
Uttarakhand: 36కు చేరిన అల్మోరా ప్రమాద ఘటన మృతుల సంఖ్య.. పీఎం, సీఎం సంతాపం
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!