Harish Rao : రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టారు
- 11 నెలల నుండి మాజీ సర్పంచులకు బిల్లులు రాలేదు
- అనేక అవార్డులు తెలంగాణ సర్పంచులకు వచ్చాయి
- సర్పంచులు నేడు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టారని, 11 నెలల నుండి మాజీ సర్పంచులకు బిల్లులు రాలేదన్నారు మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. సీఎం,పంచాయతీ రాజ్ శాఖా మంత్రికి వినతిపత్రం ఇవ్వాలని సర్పంచులు భావిస్తే దొంగల్లా అరెస్టు చేశారన్నారు హరీష్ రావు. మాజీ సర్పంచులను పోలీసులు అవమానించారని, తెలంగాణ సర్పంచులు దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. అనేక అవార్డులు తెలంగాణ సర్పంచులకు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో సర్పంచులకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, సర్పంచులు నేడు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని హరీష్ రావు మండిపడ్డారు. కేంద్రం నుండి గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం దారి మళ్ళిస్తోందని, తెలంగాణకు రాహుల్ గాంధీ వస్తున్నారని, రాహుల్ గాంధీ అశోక్ నగర్ కు రావాలన్నారు హరీష్ రావు. ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ అశోక్ నగర్ కు వచ్చారని, జీవో 29 ను రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారన్నారు. గ్రామ పంచాయతీలను రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేశారని, ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయా లేదా రాహుల్ గాంధీ రివ్యూ చేయాలన్నారు హరీష్ రావు.
CM Chandrababu: రాష్ట్రంలో నూతన క్రీడా విధానంపై సీఎం చంద్రబాబు సమీక్ష
Also Read
- Virat Kohli: SRH మ్యాచ్కు ముందు కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఈ స్థితికి కారణం వారే అంటూ..
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- Bank Licence Cancelled: ఆ బ్యాంక్కు బిగ్ షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. లైసెన్స్ రద్దు.. ఖాతాదారుల పరిస్థితి ఏంటి..?
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
అన్ని వర్గాలను మోసం చేశారని హరీష్ రావు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు చేసిన సర్పంచులను విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. పెద్ద,పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారని, సర్పంచులకు బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. గ్రామాలను అభివృద్ధి చేసిన శిక్ష ఎందుకు, గ్రామ పంచాయతీకు ఆర్ధిక సంఘం నిధులు వచ్చాయన్నారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫ్రీజింగ్ ఎత్తివేయాలని, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో రెండు వేల కోట్లు బకాయిలు వుంటే బిఆర్ఎస్ అధికారంలోకి రాగానే చెల్లించామన్నారు. బీఆర్ఎస్ పదేళ్లల్లో 4 లక్షల 26 వేల కోట్లు అప్పు చేశామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కాకుండానే 85 వేల కోట్లు అప్పు చేసిందన్నారు. కాంగ్రెస్ వచ్చాక సంక్షేమ పథకాలు బంద్ పెట్టిందని, పోలీసులకు సరెండర్ లీవ్ బంద్ చేశారని ఆయన వ్యాఖ్యానించారు. టీజీఎస్పీ పోలీసులు రోడ్ల మీదకు వచ్చారని ఆయన అన్నారు.
Uttarakhand: 36కు చేరిన అల్మోరా ప్రమాద ఘటన మృతుల సంఖ్య.. పీఎం, సీఎం సంతాపం
తాజావార్తలు
-
Virat Kohli: SRH మ్యాచ్కు ముందు కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఈ స్థితికి కారణం వారే అంటూ..
-
Peddi: ‘పెద్ది’కి లైన్ క్లియర్.. పర్సంటేజ్ విధానంపై గుడ్ న్యూస్
-
Hyderabad Water Board : ఏసీబీ దాడుల్లో షాక్.. బయటపడ్డ కోట్ల సామ్రాజ్యం.!
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
-
Cheesy Chicken Sandwich Recipe: నోరూరించే చీజీ ‘చికెన్ శాండ్విచ్’.. బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ కోసం ఐదు నిమిషాల్లో ఇలా చేసుకోండి!
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!