జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. దేగ్వార్ సెక్టార్లోని ఎల్ఓసీ సమీపంలో ఉగ్రవాదుల అనుమానాస్పద కార్యకలాపాల గురించి సమాచారం అందిందని భద్రతా దళాలు తెలిపాయి. ఆ తర్వాత భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించారు. ఈ సమయంలో, ఉగ్రవాదులు భద్రతా దళాల బృందంపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఉగ్రమూకలపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను హతమయ్యారు. Also…
ఆపరేషన్ సిందూర్తో పాకిస్థాన్లో ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం అయ్యాయి. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాదుల శిబిరాలను భారత సైన్యం పటాపంచల్ చేశాయి. దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. తోకముడిచి ఉగ్రవాదులంతా పరారయ్యారు.
పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాలలో గురువారం సాయంత్రం మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఈ మాక్ డ్రిల్ గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్లలో జరుగుతుంది. పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న ఈ నాలుగు రాష్ట్రాలలో ప్రభుత్వం మాక్ డ్రిల్లను ఆదేశించింది. దీంతో భారత సైన్యం ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటుందా?
Pakistan: పాకిస్తాన్ భారత్కి వ్యతిరేకంగా కొత్త కుట్రలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘‘ఆపరేషన్ సిందూర్’’తో చావు దెబ్బలు తిన్నా కూడా తన పంథాను మార్చుకోవడం లేదు. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం, పాకిస్తాన్ ఆర్మీ, లష్కరే తోయిబా ఉగ్రవాదులు పాక్ ఆక్రమిక కాశ్మీర్(పీఓకే)లోని నియంత్రణ రేఖను సందర్శించినట్లు తెలుస్తోంది.
India Pak War : సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రేపు జరగనున్న భారత్-పాకిస్థాన్ ల తొలి సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం సరిహద్దుల్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొన్నప్పటికీ, ఇరు దేశాల మధ్య జరగనున్న “తొలి శాంతి చర్చలు” ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇరు దేశాల “మిలిటరీ ఆపరేషన్స్” డైరెక్టర్ జనరల్స్ స్థాయిలో ఈ చర్చలు జరగనున్నాయి. అయితే, ఈ చర్చలు ప్రస్తుతానికి కేవలం కాల్పుల విరమణకు మాత్రమే పరిమితం…
Attaullah Tarar : సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందని భారత్ ఆరోపించిన కొద్ది గంటల్లోనే, పాక్ ఈ ఆరోపణలను ఖండించింది. భారత సాయుధ బలగాలు కఠినంగా ప్రతిస్పందిస్తాయని హెచ్చరించిన అనంతరం, పాకిస్థాన్ సమాచార, ప్రసార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ స్పందిస్తూ—”పాకిస్థాన్ ఎలాంటి కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడలేదు, అలాంటి ఆలోచన కూడా చేయదు” అని స్పష్టం చేశారు. “ప్రజలు విజయోత్సవాల్లో మునిగి ఉన్న ఈ సమయంలో అలాంటి చర్యలకు తావే లేదు. పాకిస్థాన్ వైపు…
సరిహద్దుల్లో నగ్రోటా వద్ద చొరబాటుకు పాక్ యత్నించింది. పాక్ చొరబాటుదారులపై భారత రక్షణ దళం కాల్పులు జరిపింది. చొరబాటు దారులు సైతం కాల్పులు జరపగా.. ఓ ఇండియన్ ఆర్మీ జవాను గాయపడ్డారు. ప్రస్తుతం రక్షణా దళాలు చొరబాటుదారుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ విషయాన్ని భారత సైన్యం వైట్ నైట్ కార్ప్స్ ట్వీట్ ద్వారా తెలియజేసింది.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత.. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ ఉద్రిక్తతను పరిష్కరించడానికి అమెరికా మధ్యవర్తిత్వంలో ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాయి. అయితే.. కాల్పుల విరమణ ప్రకటించిన నాలుగు గంటల తర్వాత.. పాకిస్థాన్ సైన్యం మళ్లీ భారత్లోని పలు ప్రాంతాల్లో దాడులకు దిగినట్లు తెలుస్తోంది. తాజాగా జమ్మూ కశ్మీర్లో పాక్ డ్రోన్ దాడులకు తెగబడుతున్నట్లు సమాచారం.
నిన్న రాత్రి, పాకిస్తాన్ నియంత్రణ రేఖ (LoC) మరియు అంతర్జాతీయ సరిహద్దులు (IB) వెంబడి వివిధ ప్రదేశాలకు డ్రోన్లను పంపడానికి పాక్ విఫలయత్నం చేసింది.. ఉధంపూర్, సాంబా, జమ్మూ, అఖ్నూర్, నగ్రోటా మరియు పఠాన్కోట్ ప్రాంతాలలో పాక్ చర్యలకు భారత్ తిప్పికొట్టింది.. భారత ఆర్మీ వైమానిక రక్షణ విభాగాలు ఉపయోగించి.. పెద్ద ఎత్తున కౌంటర్-డ్రోన్ ఆపరేషన్లో 50కి పైగా పాక్ డ్రోన్లను విజయవంతంగా తటస్థీకరించింది..
జమ్మూ కశ్మీర్లోని సాంబాలో ఒక పెద్ద చొరబాటు ప్రయత్నాన్ని బీఎస్ఎఫ్ భగ్నం చేసింది. ఎల్ఓసీలోని కొన్ని ప్రాంతాల్లో పాకిస్థాన్ వైపు నుంచి పెద్ద ఎత్తు కాల్పులు జరుగుతున్నాయి. భారత ఆర్మీ తగిన సమాధానం ఇస్తోంది. అయితే.. భారత్లో అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఆర్మీని పాక్ అడ్డుకుంది. అర్ధరాత్రి జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ (LOC) దగ్గర పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఆ ప్రాంతమంతా చీకటి అలుముకుంది.