JK: సరిహద్దులో పాక్ కవ్వింపులు.. డ్రోన్ దాడులను తిప్పికొట్టిన భద్రతా దళాలు
- పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యలు
- సరిహద్దులో పాక్ కవ్వింపులు
- డ్రోన్ దాడులను తిప్పికొట్టిన భద్రతా దళాలు
దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ సమీపంలో బహుళ డ్రోన్ చొరబాటు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. రాజౌరిలోని ఎల్ఓసీ వెంట నౌషెరా సెక్టార్ను కాపలా కాస్తున్న ఆర్మీ దళాలు… గనియా-కల్సియన్ గ్రామంపై డ్రోన్ కదలికను గమనించి వెంటనే లైట్ మెషిన్ గన్లతో కాల్పులు జరిపారు.
ఇది కూడా చదవండి: Mana Shankara Vara Prasad Garu Review : మన శంకర వరప్రసాద్ గారు రివ్యూ.. మెగాస్టార్ హిట్ కొట్టాడా లేదా?
Also Read
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
- Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
- Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
జమ్మూ కాశ్మీర్లోని సాంబా, రాజౌరి, పూంచ్ జిల్లాల్లోని అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ), నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వెంబడి అనేక ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భద్రతా దళాలు అనుమానిత డ్రోన్ల కదలికను గుర్తించాయని అధికారులు తెలిపారు. ఎగిరే వస్తువులన్నీ పాకిస్తాన్ వైపు నుంచి వచ్చాయని.. కొన్ని నిమిషాలు భారత భూభాగంపై సంచరించాయని వెల్లడించారు. అనుమానిత డ్రోన్ కార్యకలాపాలను గమనించిన వెంటనే భద్రతా దళాలు ఆపరేషన్ ప్రారంభించాయని చెప్పారు.
ఇది కూడా చదవండి: Shocking: ప్రేమ కోసం.. లండన్ నుంచి వచ్చి తల్లిని చంపిన కొడుకు..
రాజౌరిలోని నియంత్రణ రేఖ వెంబడి నౌషెరా సెక్టార్ను కాపలా కాస్తున్న సైనిక దళాలు తొలుత సాయంత్రం 6.35 గంటల ప్రాంతంలో గనియా-కల్సియన్ గ్రామంపై డ్రోన్ కదలికను గమనించగానే మీడియం, లైట్ మెషిన్ గన్ల నుంచి కాల్పులు జరిపారని పేర్కొన్నారు. సాయంత్రం 6.35 గంటలకు రాజౌరి జిల్లాలోని టెర్యాత్లోని ఖబ్బర్ గ్రామంలో మరో డ్రోన్ కనిపించిందని.. మెరిసే కాంతితో ఎగిరే వస్తువు కలకోట్లోని ధర్మసల్ గ్రామం వైపు నుంచి వచ్చి భరఖ్ వైపు కదిలిందని అధికారులు తెలిపారు.
ఇక సాంబాలోని రామ్గఢ్ సెక్టార్లోని చక్ బాబ్రాల్ గ్రామంపై సాయంత్రం 7.15 గంటల ప్రాంతంలో డ్రోన్ లాంటి వస్తువు మెరుస్తున్న కాంతితో చాలా నిమిషాలు తిరుగుతున్నట్లు వెల్లడించారు. అలాగే పూంచ్ జిల్లాలోని ఎల్ఓసి వెంబడి ఉన్న తంయిన్ దిశ నుంచి మంకోట్ సెక్టార్లోని టోపా వైపు సాయంత్రం 6.25 గంటలకు మరో డ్రోన్ లాంటి వస్తువు కదులుతున్నట్లు కనిపించిందని తెలిపారు. శుక్రవారం రాత్రి సాంబా జిల్లాలోని ఐబి సమీపంలోని ఘగ్వాల్లోని పలూరా గ్రామంలో పాకిస్థాన్లో తయారైన డ్రోన్ ద్వారా జారవిడిచినట్లు భావిస్తున్న ఆయుధ సముదాయాన్ని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. స్వాధీనం చేసుకున్న వాటిలో రెండు పిస్టల్స్, మూడు మ్యాగజైన్లు, 16 రౌండ్లు, ఒక గ్రెనేడ్ ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ప్రస్తుతం భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి.
గతేడాది మే 7న పాకిస్థాన్పై భారతదేశం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా అనేక పాకిస్థానీ డ్రోన్లను కూల్చేసింది. అప్పటి నుంచి డ్రోన్ల సంచారం తగ్గాయి. మళ్లీ ఇన్ని రోజులు తర్వాత ఒకేసారి పాకిస్థాన్ డ్రోన్ల సంచారం కనిపించాయి. భారత భూభాగంపై ఆయుధాలు, మాదకద్రవ్యాలను విడిచిపెట్టేందుకు ఉగ్రవాద గ్రూపులకు మద్దతుగా పాకిస్థాన్ ఈ డ్రోన్లను ప్రయోగిస్తున్నట్లుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!