Pakistan: పాక్ ఆర్మీ, లష్కరే ఉగ్రవాదుల కొత్త కుట్ర.. పీఓకేలో టన్నెల్స్ నిర్మాణం..
- పీఓకేలో పాక్ ఆర్మీ, లష్కరే తోయిబా ఉగ్రవాదులు..
- నియంత్రణ రేఖ కింద సొరంగాలు తవ్వడానికి ప్లాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ భారత్కి వ్యతిరేకంగా కొత్త కుట్రలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘‘ఆపరేషన్ సిందూర్’’తో చావు దెబ్బలు తిన్నా కూడా తన పంథాను మార్చుకోవడం లేదు. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం, పాకిస్తాన్ ఆర్మీ, లష్కరే తోయిబా ఉగ్రవాదులు పాక్ ఆక్రమిక కాశ్మీర్(పీఓకే)లోని నియంత్రణ రేఖను సందర్శించినట్లు తెలుస్తోంది.
Read Also: Asaduddin Owaisi: హిందూ ఓట్ల ఏకీకరణ, విపక్షాల వైఫల్యమే బీజేపీ గెలుపుకు కారణం..
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
“పాకిస్తాన్ సైన్యం మరియు లష్కరే తోయిబా కమాండర్లు పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్లో సమావేశమై ఎల్ఓసిని సందర్శిస్తున్నారు. జిహాదీ ఉగ్రవాదులను సరిహద్దు దాటించడానికి పాకిస్తాన్ ఎల్ఓసి క్రింద సొరంగం కార్యకలాపాలను పెంచుతోందని ఇటీవలి నివేదికలు సూచిస్తున్నాయి” అని న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్ట్ తహా సిద్ధిఖీ ఒక వీడియోను షేర్ చేస్తూ ఎక్స్లో రాశారు. అతను పంచుకున్న క్లిప్లో లష్కరే సహ వ్యవస్థాపకుడు అమీర్ హంజాతో పాటు ఉగ్ర సంస్థకు చెందిన అనేక మంది సభ్యులు ఉన్నారు.
అయితే, హమాస్ తరహాలో పాక్ ఉగ్రవాదులు పీఓకేలో సొరంగాల తవ్వకాన్ని వేగవంతం చేసినట్లు ఇటీవలి నివేదికలు సూచిస్తున్నాయి. దీనిపై బీఎస్ఎఫ్, భారత సైన్యం కూడా అప్రమత్తంగా ఉంది. కొన్ని నివేదిక ప్రకారం, ఆపరేషన్ సిందూర్ ప్రారంభించడానికి ముందు చొరబాటుదారులు లోతైన భూగర్భ సొరంగాలను ఉపయోగిస్తున్నారని తెలిపాయి. చొరబాటుదారుల్ని, ఉగ్రవాదుల్ని భారత్ లోకి పంపించేందుకు వీటిని ఉపయోగించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా, భారత్-పాక్ సంఘర్షణల సమయంలో పాక్ ఆర్మీని ఈ సొరంగాల ద్వారా పంపించడానికి వీటిని తవ్విందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
🔴 🇵🇰 🇮🇳 #ALERT Pakistani military and alleged Lashkar e Taiba commanders meet in Pakistan administered Kashmir and visit the LoC. Recent reports suggest an increase in tunnel activities below the LoC by Pakistan to send jihadi terrorists across border. pic.twitter.com/UwiQzie1FQ
— Taha Siddiqui (@TahaSSiddiqui) May 17, 2025
తాజావార్తలు
-
Shubman Gill: “మేం గెలవడానికి అస్సలు అర్హులం కాదు”.. సొంత జట్టుపై కెప్టెన్ గిల్ తీవ్ర ఆగ్రహం..
-
Rajinikanth-Kamal Haasan: రజినీ – కమల్ మల్టీస్టారర్ నుంచి త్రిష ఔట్..?
-
Finn Allen: 10 సిక్సర్లు, 4 ఫోర్లు.. అభిషేక్, వైభవ్ల ప్రత్యేక బ్యాట్స్మెన్ల జాబితాలో ఫిన్ అలెన్..
-
Astrology: మే 17 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..