Pakistan: పాక్ ఆర్మీ, లష్కరే ఉగ్రవాదుల కొత్త కుట్ర.. పీఓకేలో టన్నెల్స్ నిర్మాణం..
- పీఓకేలో పాక్ ఆర్మీ, లష్కరే తోయిబా ఉగ్రవాదులు..
- నియంత్రణ రేఖ కింద సొరంగాలు తవ్వడానికి ప్లాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ భారత్కి వ్యతిరేకంగా కొత్త కుట్రలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘‘ఆపరేషన్ సిందూర్’’తో చావు దెబ్బలు తిన్నా కూడా తన పంథాను మార్చుకోవడం లేదు. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం, పాకిస్తాన్ ఆర్మీ, లష్కరే తోయిబా ఉగ్రవాదులు పాక్ ఆక్రమిక కాశ్మీర్(పీఓకే)లోని నియంత్రణ రేఖను సందర్శించినట్లు తెలుస్తోంది.
Read Also: Asaduddin Owaisi: హిందూ ఓట్ల ఏకీకరణ, విపక్షాల వైఫల్యమే బీజేపీ గెలుపుకు కారణం..
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
“పాకిస్తాన్ సైన్యం మరియు లష్కరే తోయిబా కమాండర్లు పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్లో సమావేశమై ఎల్ఓసిని సందర్శిస్తున్నారు. జిహాదీ ఉగ్రవాదులను సరిహద్దు దాటించడానికి పాకిస్తాన్ ఎల్ఓసి క్రింద సొరంగం కార్యకలాపాలను పెంచుతోందని ఇటీవలి నివేదికలు సూచిస్తున్నాయి” అని న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్ట్ తహా సిద్ధిఖీ ఒక వీడియోను షేర్ చేస్తూ ఎక్స్లో రాశారు. అతను పంచుకున్న క్లిప్లో లష్కరే సహ వ్యవస్థాపకుడు అమీర్ హంజాతో పాటు ఉగ్ర సంస్థకు చెందిన అనేక మంది సభ్యులు ఉన్నారు.
అయితే, హమాస్ తరహాలో పాక్ ఉగ్రవాదులు పీఓకేలో సొరంగాల తవ్వకాన్ని వేగవంతం చేసినట్లు ఇటీవలి నివేదికలు సూచిస్తున్నాయి. దీనిపై బీఎస్ఎఫ్, భారత సైన్యం కూడా అప్రమత్తంగా ఉంది. కొన్ని నివేదిక ప్రకారం, ఆపరేషన్ సిందూర్ ప్రారంభించడానికి ముందు చొరబాటుదారులు లోతైన భూగర్భ సొరంగాలను ఉపయోగిస్తున్నారని తెలిపాయి. చొరబాటుదారుల్ని, ఉగ్రవాదుల్ని భారత్ లోకి పంపించేందుకు వీటిని ఉపయోగించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా, భారత్-పాక్ సంఘర్షణల సమయంలో పాక్ ఆర్మీని ఈ సొరంగాల ద్వారా పంపించడానికి వీటిని తవ్విందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
🔴 🇵🇰 🇮🇳 #ALERT Pakistani military and alleged Lashkar e Taiba commanders meet in Pakistan administered Kashmir and visit the LoC. Recent reports suggest an increase in tunnel activities below the LoC by Pakistan to send jihadi terrorists across border. pic.twitter.com/UwiQzie1FQ
— Taha Siddiqui (@TahaSSiddiqui) May 17, 2025
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!