Mock Drill: రేపు పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో మాక్డ్రిల్.. భారత్ కొత్త ఆపరేషన్కు ప్లాన్ చేస్తోందా?
- పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాలలో రేపు మాక్డ్రిల్
- ఈ నాలుగు రాష్ట్రాలలో మాక్డ్రిల్కు ఆదేశం
- కొత్త ఆపరేషన్కు భారత ఆర్మీ సిద్ధమవుతోందా?
పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాలలో గురువారం సాయంత్రం మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఈ మాక్ డ్రిల్ గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్లలో జరుగుతుంది. పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న ఈ నాలుగు రాష్ట్రాలలో ప్రభుత్వం మాక్ డ్రిల్లను ఆదేశించింది. దీంతో భారత సైన్యం ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటుందా? అనే ప్రశ్న మొదలవుతోంది. వాస్తవానికి.. భారతదేశం, పాకిస్థాన్ మధ్య 3,300 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవైన సరిహద్దు ఉంది. జమ్మూ కశ్మీర్ను ఆనుకుని ఉన్న సరిహద్దును నియంత్రణ రేఖ అంటే ఎల్ఓసీ అంటారు. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లతో సరిహద్దును అంతర్జాతీయ సరిహద్దు (IB) అంటారు.
READ MORE: Central Cabinet Decisions: కీలక నిర్ణయాలు తీసుకున్న కేబినెట్.. ఏవేవంటే..!
Also Read
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
- Renault Bridger: పెట్రోల్ నుంచి CNG, EV వరకు.. భారీ ప్లాన్తో వస్తున్న రెనాల్ట్ బ్రిడ్జర్
కాగా.. పాకిస్థాన్తో ఉద్రిక్తత మధ్య మే 7న దేశంలోని 244 జిల్లాల్లో మాక్ డ్రిల్లు నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. కానీ మే 6-7 రాత్రి, భారతదేశం పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ మెరుపు దాడులు చేసింది. ఆపరేషన్ సిందూర్ కింద, భారత్ చేపట్టిన వైమానిక దాడిలో చాలా మంది ఉగ్రవాదులు మరణించారు. ఈ ఉగ్రస్థవరాలతో పాటు పాకిస్థాన్లో మరో 12 ఉగ్రవాద స్థావరాలు ఉన్నట్లు కేంద్రం వద్ద సమాచారం ఉంది. పీఓకే నుంచి పాకిస్థాన్ లోని ఉగ్రవాద మూలాలను నిర్మూలించడానికి మరేదైనా ఆపరేషన్ జరుగుతోందా? అనే సందేహం మొదలైంది.
READ MORE: Sandeep vs Deepika: స్పిరిట్ పంచాయతీలో తప్పెవరిది? బలైంది ఎవరు?
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ కు చుక్కలు కనిపించాయి. ఆ దేశం మొత్తం భయాందోళనలతో నిండిపోయింది. ఇంతలో, ఆపరేషన్ సిదూర్ లాంటి మరో ఆపరేషన్ ఏదైనా నిర్వహిస్తున్నారా? అనే భయం పాక్ను వెంటాడుతోంది. భారతదేశం ఇప్పటివరకు తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే వైమానిక దాడులు నిర్వహించింది. అటువంటి ఉగ్ర స్థావరాలు పాక్లో మరో 12 ఉగ్రవాద ఉన్నాయి. వాటిని భారత్ లక్ష్యంగా చేసుకుని మరోసారి దాడులకు పాల్పడుతుందా? అనే భయం మొదలైంది.
తాజావార్తలు
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
-
Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
-
GWMC : ఓరుగల్లు బల్దియాకు బాస్ ఎక్కడ.?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!