Ind-Pak: ఎల్వోసీ వెంబడి మళ్లీ వెలసిన ఉగ్ర శిబిరాలు.. నిఘా వర్గాలు గుర్తింపు
- ఎల్వోసీ వెంబడి మళ్లీ వెలసిన ఉగ్ర శిబిరాలు
- నిఘా వర్గాలు గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆపరేషన్ సిందూర్తో పాకిస్థాన్లో ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం అయ్యాయి. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాదుల శిబిరాలను భారత సైన్యం పటాపంచల్ చేశాయి. దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. తోకముడిచి ఉగ్రవాదులంతా పరారయ్యారు. తాజాగా ఉగ్రవాదులంతా తిరిగి వస్తున్నట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి. ధ్వంసమైన ప్రాంతాల్లోనే తిరిగి ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లు, శిక్షణా శిబిరాలను పాకిస్థాన్ పునర్నిర్మిస్తున్నట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. పాకిస్తాన్ సైన్యం, గూఢచారి సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI), ప్రభుత్వం యొక్క పూర్తి మద్దతుతో ఈ ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా గుర్తించింది.
ఇది కూడా చదవండి: Chhattisgarh: ఛత్తీస్గఢ్లో కీలక పరిణామం.. 13 మంది మావోలు లొంగుబాటు
Also Read
- Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
- US-Iran War: 'ట్రంప్ను చంపేస్తాం'.. శవపేటికలో అమెరికా అధ్యక్షుడు..ఇరాన్ ప్రచారం..
- Earthquake: న్యూజిలాండ్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
- JD Vance-Iran: జేడీ వాన్స్కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
నిఘా, దాడుల నుంచి తప్పించుకోవడానికి ఎల్వోసీలోని దట్టమైన అటవీ ప్రాంతంలో హైటెక్ ఉగ్రవాద సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత.. లష్కరే తోయిబా (LeT), జైషే మొహమ్మద్ (JeM), హిజ్బుల్ ముజాహిదీన్, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) వంటి గ్రూపులు పరారయ్యాయి. తిరిగి అవే గ్రూప్లను ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నట్లుగా తెలుస్తోంది. లూని, పుట్వాల్, టిప్పు పోస్ట్, జమిల్ పోస్ట్, ఉమ్రాన్వాలి, చాప్రార్ ఫార్వర్డ్, చోటా చక్, జంగ్లోరా వంటి ప్రాంతాల్లో శిబిరాలు వెలసినట్లుగా గుర్తించాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో తిరిగి నిర్మిస్తున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతాలన్నీ దట్టమైన అడవులు కలిగి ఉంటాయి. డ్రోన్, క్షిపణి దాడుల నుంచి తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులంతా ఈ ప్రాంతాలను ఎంచుకున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Pawankalyan : ‘హరిహర వీరమల్లు’ మేకర్స్ ప్లానింగ్పై పవన్ ఫ్యాన్స్ ఫైర్.. !
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది చనిపోయారు. అనంతరం భారత్.. పాకిస్థాన్పై కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇక మే 7న పాకిస్థాన్పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి. అయితే ఉగ్ర కార్యకలాపాలను నిలువరిస్తామని పాకిస్థాన్ కాళ్ల బేరానికి రావడంతో భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది. తీరా ఇన్ని రోజులకు దాయాది దేశం తన బుద్ధిని పోనిచ్చుకోలేదు. తిరిగి ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ.. భారత్కు వ్యతిరేకంగా ఉగ్ర శిబిరాలను ఏర్పాటు చేయిపిస్తోంది.
తాజావార్తలు
-
Anil Ravipudi: జగపతి బాబుతో కామెడీ సినిమా ప్రకటన.. అనిల్ రావిపూడి ధైర్యమిదే!
-
CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
-
Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
-
UP: ఘజియాబాద్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
-
Kiran Abbavaram: ‘మా తమిళోల్లు మీ సినిమాలు చూడరు..’ ఉన్న విషయం చెప్పిన హీరో కిరణ్ అబ్బవరం
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!