దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజుకు 3 లక్షల కేసులు నమోదవుతున్నాయి. అటు ఏపీలోనూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. బుధవారం 10వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర స్థాయి కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను తక్షణమే పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్ అధ్యక్షతన పలువురు ఐఏఎస్ అధికారుల బృందంతో దీన్ని ఏర్పాటు చేసింది. Read Also: గృహ హింస కేసులో కన్నా…
నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా నేటితో 50 రోజులు పూర్తి చేసుకుంది. డిసెంబర్ 2న విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ కొన్ని సెంటర్లలో హౌస్ఫుల్ కలెక్షన్లతో నడుస్తోంది. ఓటీటీలు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ఓ మూవీ 50 రోజులు పూర్తి చేసుకుందంటే గొప్ప విషయమనే చెప్పాలి. అది కూడా కరోనా వైరస్ బెంబేలెత్తిస్తున్న సమయంలో అఖండ మూవీ గ్రాండ్ సక్సెస్ కావడం సినీ పరిశ్రమకు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. Read Also: టాలీవుడ్లో మరో విషాదం..…
గృహహింస కేసులో ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు శ్రీలక్ష్మీ కీర్తికి కోటి రూపాయల పరిహారం చెల్లించాలని విజయవాడలోని ఒకటో చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా నెలకు యాభై వేల రూపాయలను భరణంగా చెల్లించాలని కన్నా కుమారుడిని న్యాయమూర్తి ఆదేశించారు. కోర్టు ఖర్చుల కింద రూ.వెయ్యి ఇవ్వాలంటూ న్యాయస్థానం తీర్పును ఇచ్చింది. శ్రీలక్ష్మీ కీర్తి పాపకు అనారోగ్యంగా ఉండడంతో వైద్యానికి శ్రీలక్ష్మీ ఖర్చు చేసిన రూ.50వేలు కూడా తిరిగి చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు.…
టాలీవుడ్ సినీ నటుడు కొంచాడ శ్రీనివాస్ (47) అనారోగ్యంతో బుధవారం మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొంచాడ శ్రీనివాస్ కన్నుమూశాడు. అతడు సుమారు 40కి పైగా సినిమాలు, 10కిపైగా టీవీ సీరియళ్లలో నటించాడు. గతంలో షూటింగ్ సమయంలో పడిపోవడంతో శ్రీనివాస్కు ఛాతీపై దెబ్బ తగిలిందని, తర్వాత గుండె సమస్యలు వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. Read Also: మూతి మీద ముద్దు… టాలీవుడ్ లో ముద్దుల హోరు కాగా…
అగ్రరాజ్యం అమెరికాలో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. ఏటీ అండ్ టీ, వెరిజాన్ టెలికాం దిగ్గజ సంస్థలు 5జీ సేవలను ప్రారంభించాయి. ఈ క్రమంలో కొన్ని అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ విమాన సర్వీసులను రద్దు చేశాయి. అమెరికా నుంచి వెళ్లాల్సిన లేదా రావాల్సిన 538 విమానాలు 5జీ సేవల ప్రారంభం వల్ల రద్దు కానున్నాయని తెలుస్తోంది. రద్దయిన విమాన సర్వీసులలో ఎమిరేట్స్, ఎయిరిండియా, ఏఎన్ఏ, జపాన్ ఎయిర్లైన్స్కు సంబంధించినవి ఉన్నాయి. 5జీ సర్వీసుల్లో ఉపయోగించే ఫ్రీక్వెన్సీ విమానాల్లోని…
వెస్టిండీస్లో అండర్-19 ప్రపంచకప్ కోసం పర్యటిస్తున్న భారత జట్టులో కరోనా కలకలం రేగింది. టీమిండియా కెప్టెన్ యశ్ ధుల్తో పాటు వైస్ కెప్టెన్ షేక్ రషీద్ కరోనా బారిన పడ్డారు. వీరితో క్లోజ్ కాంటాక్టులో ఉన్న బౌలర్ ఆరాధ్య యాదవ్తో పాటు వసు వత్స్, మానవ్ ప్రకాశ్, సిద్ధార్థ్ యాదవ్లకు కూడా కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో వీరంతా వరల్డ్ కప్ నుంచి వారు నిష్ర్కమించారు. ఐదుగురు ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో ప్రస్తుతం భారతజట్టుకు 11…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల కరువు భత్యం (డీఏ)ను పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు మూడు విడతల డీఏ బకాయిలకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్థిక శాఖ బుధవారం రాత్రి జారీ చేసింది. దీంతో ఉద్యోగుల మూలవేతనంలో 7.28 శాతంగా ఉండే డీఏ 17.29 శాతానికి పెరగనుంది. దీంతో పెండింగ్లో ఉన్న మూడు డీఏలకు బదులుగా ఈ కొత్త లెక్క వర్తించనుంది. పెరిగిన డీఏ…
★ నేడు ఏపీ వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి ఫ్యాప్టో పిలుపు.. కొత్త పీఆర్సీకి నిరసనగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో నేడు కలెక్టరేట్ల ముట్టడి.. ఫ్యాప్టో తలపెట్టిన నిరసనలకు ఐక్యవేదిక సంపూర్ణ మద్దతు.. డివిజన్ కేంద్రాల్లో ఆందోళనలకు పిలుపునిచ్చిన జాక్టో.. భోజన విరామ సమయాల్లో సచివాలయ ఉద్యోగుల ఆందోళన.. సమ్మెకు వెళ్లాలని ఉద్యోగుల నిర్ణయం★ అమరావతి: ఉండవల్లి హోం ఐసోలేషన్లో ఉంటూ నియోజకవర్గాల వారీగా ఆన్లైన్లో సమీక్ష చేయనున్న టీడీపీ అధినేత చంద్రబాబు★ కరోనా నియంత్రణపై నేడు తెలంగాణ మంత్రుల…
ప్రస్తుతం దేశంలో కరోనా థర్డ్ వేవ్ నడుస్తోంది. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా దాదాపు 3 లక్షల కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. గత రెండేళ్లుగా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కరోనా ఎప్పటికీ నాశనం అవుతుందోనని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా ఎప్పటికి అంతమవుతుందో అన్న అంశంపై ఐసీఎంఆర్ అధికారి స్పందించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది మార్చి 11 నాటికి కరోనా కథ ముగిసిపోతుందని ఐసీఎంఆర్ ఎపిడెమాలజిస్ట్ చీఫ్ డా.సమీరన్ పాండా వెల్లడించారు. Read…
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అటు ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు బీభత్సమైన రీతిలో నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమాన రాకపోకలపై విధించిన నిషేధాన్ని మరోసారి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి నెలాఖరు వరకు షెడ్యూల్డ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ప్యాసింజర్ సర్వీసులపై నిషేధం ఉంటుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) బుధవారం వెల్లడించింది. Read…