Home
Latest Telugu News
Latest Telugu News News
-
Fuel Price: వాహనదారులకు శుభవార్త.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు..
రోజురోజుకు ఇంధన ధరలు పెరగిపోతుండడంతో వాహనాదారులపై పెనుభారం పడుతోంది. అయితే పలు నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. నేడు హైదరాబాద్లో పెట్రోల్ లీటర్ ధర రూ.119.49 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.105.49 వద్ద స్థిరంగా ఉన్నాయి. అయితే.. ఇక వరంగల్లో పెట్రోల్ ధర 18 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.119 కాగా, 17 పైసలు తగ్గడంతో డీజిల్ లీటర్ ధర రూ.105.02 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో 15 పైసలు తగ్గడంతో… -
TSPSC Alert : గ్రూప్-1 అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల గ్రూప్-1 ఉద్యోగల భర్తీ కొరకు నోటిఫికేషన్ను విడుదల చేసిన విషయం తెలసిందే. అయితే తాజాగా.. గ్రూప్-1 ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థులకు కీలక సూచనలు జారీ చేసింది. గ్రూప్-1 రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ www.tspsc.gov.inని సందర్శించి, సూచించిన ప్రొఫార్మాలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అంతేకాకుండా దరఖాస్తు ఫారమ్లో భాగంగా ఓటీఆర్ (OTR) నుండి డేటా తీసుకోబడుతుంది కాబట్టి, ఇంకా తమ ఓటీఆర్ను… -
Breaking : కన్న బిడ్డమీద కనికరం లేదా.. ఎందుకిలా చేశావ్..
కొందరు కొందరు చేసే పనులకు.. వారు ఏం ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నారో అర్థం కాదు. నవమాసాలు మోసి కన్న తల్లి, భుజాలపై ఎత్తుకుని ఆడించాల్సిన తండ్రి.. వీళ్లే ఆ బిడ్డ పాలిట యమకింకరులైతే.. అప్పుడే పుట్టి ఈ లోకంలోకి వచ్చిన ఆ నవజాత శిశువు పరిస్థితి ఏంటో ఓ సారి ఆలోచించాలి. అలాంటి ఘటనే జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. వారం రోజుల పసికందు అనారోగ్యంతో ఉండడంతో.. స్మశానానికి చేర్చాడు ఓ తండ్రి.. అయితే శిశువులో… -
Breaking News : ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత
ఉస్మానియూ యూనివర్సీటీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ను ఎన్ఎస్యూఐ విద్యార్థులు ముట్టడించారు. ఏఐసీసీ నేత రాహుల్గాంధీ సభకు అనుమతివ్వాలని డిమాండ్ చేస్తూ.. బిల్డింగ్ గేట్లు ఎక్కి లోపలికి విద్యార్థులు దూసుకెళ్లారు. అంతేకాకుండా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అద్దాలను విద్యార్థులు ధ్వంసం చేశారు. దీంతో 17 మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా పోలీసుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ.. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ సహా విద్యార్థులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. వారిని రిమాండ్కు… -
Minister Mallareddy : కేసీఆర్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారు
Telangana Minister of Labour and Employment Mallareddy Addressed at May Day Celebrations at Ravidra Bharati. హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వం తరుపున మేడే వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 70 ఏళ్ల నుంచి కార్మికులకు స్వాతంత్ర్యం రాలేదని, కార్మికుల ఓట్లను అనేకమంది దండుకున్నారు కానీ మిమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత కేసీఆర్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారని ఆయన… -
May Day : నేడే… మే డే… ప్రజాపక్షం నిలచిన ఎర్రజెండాలు!
కార్మిక, కర్షక, శ్రామికుల దినోత్సవంగా మే 1వ తేదీ నిలచింది. ప్రపంచంలోని అనేక దేశాల్లో మే డేని నిర్వహిస్తున్నారు. విప్లవ దినోత్సవంగానూ కొందరు మే డేను అభివర్ణిస్తారు. ఏది ఏమైనా ప్రపంచ కార్మిక దినోత్సవంగా మే 1వ తేదీ జేజేలు అందుకుంటోంది. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో పని గంటల తగ్గింపు కోసం 1837లో పోరాటం సాగింది. దాంతో అమెరికా అంతటా రోజుకు పది గంటలు పని గంటలుగా శాసనం చేశారు. ఆ స్ఫూర్తితోనే ఆ తరువాత 1862లో మన… -
Dil Raju: తిరుమల శ్రీవారి కోసం ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయ ధాన్యం!
ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజుకు తిరుమల వేంకటేశ్వర స్వామి అంటే అపార నమ్మకం. అందుకే తన స్వగ్రామంలో ఆయన వేంకటేశ్వరస్వామి కోవెలను నిర్మించారు. అలానే తాను నిర్మించిన ప్రతి చిత్రం విడుదల కాగానే తిరుమల వెళ్ళి తలనీలాలు సమర్పించి, స్వామిని దర్శించుకుని రావడమన్నది ‘దిల్’ రాజు కు కొన్నేళ్ళుగా ఉన్న అలవాటు. తాజాగా ఆయన అన్న నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం కూడా మొదలు పెట్టారు. ఇలా ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ధాన్యాన్ని ‘మా… -
AATA : ఆటా మహాసభలకు మంత్రి ఎర్రబెల్లి..
అమెరికా తెలుగు సంఘం (ఆటా) వాషింగ్టన్డీసిలో జూలై 1 నుంచి 3వ తేదీ వరకు నిర్వహించనున్న 17వ ఆటా మహసభలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే.. అమెరికాలోని వాషింగ్ టన్ డీసీలో జూలై 1 నుంచి 3వ తేదీ వరకు నిర్వహించనున్న ఆటా 17వ మహా సభలు- యూత్ కన్వెన్షన్ కు అతిథిగా రావాల్సిందిగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని ఆ సంఘం ప్రతినిధులు జయంత్ చల్లా,… -
BJP Sai Ganesh: నిశ్చితార్థమైన యువతి ఆత్మహత్యాయత్నం..
ఈనెల 14న ఆత్మహత్య చేసుకున్న సాయి గణేష్ వివాహం చేసుకోవలసిన విజయ అనే అమ్మాయి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. బీజేపీ నాయకుడు సాయి గణేష్-విజయల వివాహం మే 4 తారీఖున జరగవలసి ఉంది. అయితే పోలీసుల వేధింపుల వల్ల సాయి గణేష్ ఈనెల 14వ తేదీన త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆత్మహత్య యత్నం చేసుకోగా 16వ తేదీన మృతి చెందాడు. ఈ సంఘటనపై ఇప్పటికే అధికార పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.… -
KCR on National Politics : జాతీయ రాజకీయాలలో కేసీఆర్ తెలంగాణ ప్రయోగం!
Telangana Chief Minister K.Chandra Shekar Rao Are Going to National Politcis. జాతీయ రాజకీయాల పట్ల తన తాజా ఆలోచనలను టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పార్టీ ప్లీనరీ సందర్భంగా శ్రేణులతో పంచుకున్నారు. ఢిల్లీ పాలిటిక్స్పై ఆయన మాటలు గతంలో కంటే ఇప్పుడు కాస్త భిన్నంగా ఉన్నాయి. సందర్భం వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్, బీజేపీ యేతర ఫ్రంట్ గురించి మాట్లాడే ఆయన ఈసారి దాని గురించి ప్రస్తావించలేదు. పైగా ఫ్రంట్…
తాజావార్తలు
-
ఇండియాలో EMI కల్చర్ ఎలా మొదలైందో తెలుసా? భారతదేశాన్ని మార్చిన ఆ వ్యక్తి ఇతనే!
-
Metro Express: కరీంనగర్లో ‘సిటీ మెట్రో ఎక్స్ప్రెస్’ బస్సులు ప్రారంభం.. ఈ రూట్లల్లో అందుబాటులోకి..
-
Sai Krishna Lockup Death Case: సీఐ నాగరాజుపై సుదీర్ఘ విచారణ.. ప్రశ్నల వర్షం కురిపించిన SIT..
-
YS Jagan: సీదిరి అప్పలరాజు కుటుంబంపై కక్ష సాధింపు.. ప్రమాదాన్ని కుట్రగా మార్చారు.!
-
IMD Alert: 19 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ
ట్రెండింగ్
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!