India AI Impact Summit 2026: కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) రంగంలో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంతో ప్రతిష్టాత్మకమైన “ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026” (India AI Impact Summit 2026) నేడు ప్రారంభం కానుంది. ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సదస్సును అధికారికంగా ప్రారంభించనున్నారు.
ఈ సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన వివిధ దేశాల అధినేతలకు, ప్రతినిధులకు ప్రధాని మోదీ నిన్ననే సాదర స్వాగతం పలికారు. వారి గౌరవార్థం ఏర్పాటు చేసిన ప్రత్యేక డిన్నర్ పార్టీలో ప్రధాని పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో ఫ్రాన్స్ అధ్యక్షుడు, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ వంటి ప్రముఖ ప్రపంచ నాయకులు కూడా పాల్గొనబోతున్నారు.
సమ్మిట్ సందర్భంగా ప్రధాని బిజీ షెడ్యూల్ ఇలా ఉండబోతోంది:
* ఉదయం 9:40: భారత్ మండపంలో సమ్మిట్ ప్రారంభం.
* ఉదయం 11:00: ఇండియా AI ఇంపాక్ట్ ఎక్స్పో 2026 సందర్శన. ప్రపంచ నాయకులతో కలిసి వివిధ దేశాల పెవిలియన్లను ప్రధాని వీక్షిస్తారు.
*మధ్యాహ్నం 12:00: ‘లీడర్స్ ప్లీనరీ’ సమావేశం. ఇందులో పాలన, మౌలిక సదుపాయాలు మరియు అంతర్జాతీయ సహకారం వంటి అంశాలపై లోతైన చర్చలు జరగనున్నాయి.
* సాయంత్రం 5:30: దిగ్గజ సంస్థల CEO లతో రౌండ్టేబుల్ సమావేశం. పెట్టుబడులు, పరిశోధన మరియు సరఫరా గొలుసు వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు.
JBL స్పీకర్లు, Snapdragon 7s Gen ప్రాసెసర్ తో Infinix NOTE 60, NOTE 60 Pro లాంచ్.. ఫీచర్స్ ఇవే!
“సర్వజన హితాయ, సర్వజన సుఖాయ” అనే నినాదంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. మొత్తం 7 వర్కింగ్ గ్రూపులుగా విడిపోయి. ఆర్థిక వృద్ధి, సురక్షితమైన AI వినియోగం, సామాజిక సాధికారత, మానవ వనరుల అభివృద్ధి వంటి కీలక రంగాలపై ఈ సదస్సు ఫోకస్ పెట్టనుంది. ఈ సమ్మిట్ ప్రాముఖ్యతను చాటిచెబుతూ ప్రపంచవ్యాప్తంగా సుమారు 500 మందికి పైగా ప్రతినిధులు తరలివచ్చారు. ఇందులో 20కి పైగా దేశాధినేతలు, 60కి పైగా విదేశీ మంత్రులు, 100కు పైగా ప్రభుత్వ ప్రతినిధులు, దాదాపు 100 మంది గ్లోబల్ CEOలు హాజరుకానున్నారు. 150 మంది ప్రముఖ AI పరిశోధకులు ఈ మేధోమథనంలో భాగస్వాములు కానున్నారు.