ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ నేడు, రేపు తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే.. అయితే ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పర్యటనపై విమర్శరాస్త్రాలు సంధించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. దీంతో.. తనదైన స్టైల్లో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ట్విట్ కౌంటర్ ఇచ్చారు. ‘శ్రీమతి కవిత గారూ…. రాహుల్ గాంధీని ప్రశ్నించే ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి.. మోదీ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు.. మీరు ఎక్కడ ఉన్నారు? మీ తండ్రి మోడీ…
ఇంటర్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మాస్కుధారణ తప్పనిసరి అని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా శుక్రవారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాల్లో క్లీన్ అండ్ గ్రీన్తోపాటు శానిటైజేషన్ కార్యక్రమాలు పరీక్షలు పూర్తయ్యే వరకు కొనసాగే విధంగా చర్యలు చేపట్టింది విద్యాశాఖ. విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా సిట్టింగ్ ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ.. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలున్న వారికి ప్రత్యేకంగా ఐసోలేషన్ గదులు ఏర్పాటు…
ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది. ఎన్ని కఠిన శిక్షలు వేసినా.. చట్టాలు చేసినా.. కామాంధులు మాత్రం మారడం లేదు.. అన్య పుణ్యం తెలియని చిన్నారులపై మృగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ దుండగుడు.. అనకాపల్లి జిల్లాలో రాత్రి 2 గంటల సమయంలో అక్కాచెల్లెలు బహిర్భూమికి వెళ్లారు. దీంతో.. బయటకు వచ్చిన సమయంలో బాలికను లాక్కెళ్లి ఓ దుండగుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఎవరో చెల్లిని ఎత్తుకుపోయారని తల్లిదండ్రులకు బాలిక వచ్చి చెప్పింది. దీంతో హుటాహుటినా…
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన మినెట్ టూ మినెట్ షెడ్యూల్ విడుదలైంది. సాయంత్రం 4:50కి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రాహుల్ గాంధీ చేరుకుంటారు. 5:10కి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా వరంగల్ బయలుదేరుతారు.. 5:45కు వరంగల్ గాబ్రియెల్ స్కూల్ కు చేరుకుంటారు.. 6:05 వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో…
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే.. రాహుల్ గాంధీ టూర్ వ్యవహారం అంతా ఉస్మానియా యూనివర్సీటీ చుట్టే తిరుగుతోంది. అయితే తాజాగా ప్రభుత్వ విప్ బాల్క్ సుమన్ రాహుల్ టూర్పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ విభజన చట్టం హామీలను ఎందుకు అమలు చేయడం లేదో జేపీ నడ్డా సమాధానము చెప్పాలన్నారు. ఎన్నికల ముందు బీజేపీ ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో నడ్డా జవాబు చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు. జేపీ నడ్డా…
పెద్ద చదువులు మనిషి చరిత్రను, కుటుంబ చరిత్రను, సామాజిక వర్గ చరిత్రను, రాష్ట్ర చరిత్రను, దేశ చరిత్రను మారుస్తుందని సీఎం జగన్ అన్నారు. నేడు సీఎం జగన్ 10.85 లక్షల మంది పిల్లలకు విద్యాదీవెన ద్వారా వారి తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. చదువులు అన్నవి పిల్లలకు మనం ఇచ్చే ఆస్తులు అన్నారు. చదువును ఎవ్వరూ కూడా దొంగతనం చేయలేని ఆస్తి అని, మన తలరాతను మార్చే శక్తి…
రేపల్లె ఘటన బాధితురాలిని ఒంగోలు రిమ్స్ లో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పరామర్శించారు. బాధితురాలికి టీడీపీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు కనుమరుగయ్యాయన్నారు. అవగాహన లేని వ్యక్తి సీఎం కావడంతో ఇలాంటి పరిస్థితి ఉందని, రాష్ట్రంలో మహిళలు పట్టపగలు కూడా తిరగలేని పరిస్థితి దాపురించిందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేని కారణంగానే రేపల్లె లాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయన్నారు. బాధితురాలు…
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్వంతగా పార్టీ పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఆయన ఓ కీలక ప్రకటన చేశారు. ఢిల్లీలో నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాలూ, నితీష్ పరిపాలనలో బీహార్ అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా మిగిలిపోయింది. రాబోయే పది, పదిహేను ఏళ్లలో బీహార్ “ప్రగతిశీల రాష్ట్రంగా” ఎదగాలంటే ఇప్పుడున్న దారిలో వెళితే సాధ్యం కాదు. కొత్త ఆలోచన, కొత్త ప్రయత్నం ద్వారానే ఇది సాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు.…
గుజరాత్లోని గిర్(GIR) జాతీయ వన్యప్రాణుల అభయారణ్యం సందర్శన అద్భుతమైన అనుభవమని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పులపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అధ్యయన పర్యటనలో భాగంగా జైరామ్ రమేష్ అధ్యక్షతన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గుజరాత్లోని గిర్ నేషనల్ పార్క్ను సందర్శించారు. నేషనల్ పార్క్ వద్ద విశ్రాంతి తీసుకుంటున్న సింహం ఫోటోలను ఎంపీ సంతోష్ కుమార్ తన కెమెరాలో బంధించారు. నేషనల్ పార్క్ సందర్శనలో మంత్రముగ్ధులను…
వేసవి కాలం ప్రారంభం నుంచి భానుడి ప్రతాపానికి ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఉదయం నుంచే సూర్యుడు విరుచుకుపడుతుండడంతో మునుపెన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే తెలంగాణపై ఉపరితల ద్రోణి ఏర్పడడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నిన్న వేకువ జామున తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసాయి. దీంతో ఎండ తీవ్రత నుంచి ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. కానీ.. రైతులకు ఆపార నష్టం వాటిల్లింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట.. కళ్లముందే నీటి పాలైంది. తెలంగాణలో…