Breaking News : ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత
ఉస్మానియూ యూనివర్సీటీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ను ఎన్ఎస్యూఐ విద్యార్థులు ముట్టడించారు. ఏఐసీసీ నేత రాహుల్గాంధీ సభకు అనుమతివ్వాలని డిమాండ్ చేస్తూ.. బిల్డింగ్ గేట్లు ఎక్కి లోపలికి విద్యార్థులు దూసుకెళ్లారు. అంతేకాకుండా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అద్దాలను విద్యార్థులు ధ్వంసం చేశారు. దీంతో 17 మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా పోలీసుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ.. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ సహా విద్యార్థులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.
వారిని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. అరెస్టైన ఎన్ఐసీయూ విద్యార్థులను పరామర్శిచేందుకు వెళ్లిన ఎమ్మెల్యే జగ్గారెడ్డిని సైతం పోలీసులు నిర్భందించారు. అయితే.. ఈనెల 6,7 తేదీల్లో తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ ఓయూలో పర్యటించేందుకు వీసీ అనుమతులు కోరగా.. అందుకు ఆయన నిరాకరించారు. దీంతో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతివ్వాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యూఐ విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు.
Also Read
తాజావార్తలు
-
M. S. Subbulakshmi biopic. : M. S. సుబ్బలక్ష్మి బయోపిక్ నుండి సాయి పల్లవి ఔట్
-
Abhishek Sharma: అభిషేక్ శర్మకు చేదు అనుభవం.. హద్దు మీరిన లేడీ ఫ్యాన్, వీడియో వైరల్!
-
Delhi: టేకాఫ్ సమయంలో ఇంజిన్లో మంటలు.. విమానంలోని ఆరుగురికి గాయాలు.!
-
Self-Enumeration: తెలంగాణలో నేటి నుంచి సెల్ఫ్-ఎన్యుమరేషన్ ప్రారంభం..!
-
Rakasa : ‘రాకాస’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!