Home
Latest News
Latest News News
-
Breaking News: సికింద్రాబాద్ వద్ద మళ్లీ ఉద్రిక్తత..
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్రిపథ్ స్కీంపై దేశ్యాప్తంగా నిరసన జ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళన కారులు వింధ్వంసం సృష్టించిన విషయం తెలిసింది. అయితే ఇప్పటికీ ఆందోళన కారులు రైల్వే స్టేషన్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనల నేపథ్యంలో ఇప్పటికే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే శాఖ రద్దు చేసింది. అయితే రైల్వే స్టేషన్ను పూర్తిగా పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఆర్మీ అభ్యర్థులను పోలీసులు అదుపులోకి… -
Renuka Chowdhury F2F : నాక్కూడా పోలీసులు సారీ చెప్పాలి
నేషనల్ హెరాల్డ్ పత్రిక వ్యవహారంలో సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు తెలుపుతున్నాయి. అయితే తెలంగాణ రాజధాని హైదరాబాద్లో నిరసనలు తారాస్థాయికి చేరాయి. రాజ్భవన్ ముట్టడికి టీ కాంగ్రెస్ పిలుపునివ్వడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుక చౌదరి ఈ ఆందోళనలల్లో ఓ ఎస్సై కాలర్ పట్టుకున్నారు. ఈ ఘటన వివాదస్పదం తావిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీవీతో… -
Land Issue : భూమి కోసం కర్రలతో ఫైటింగ్
ఖమ్మం జిల్లా కేంద్రంలో భూముల విలువలు పెరగటంతో దాని కోసం దాడి ప్రతి దాడులు కొనసాగుతున్నాయి. నగరానికి ఆనుకుని ఉన్న పుట్ట కోట గ్రామంలో 12 ఎకరాల భూమిపై రెండు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ భూమికి సంబంధించి కోర్టు పరిధిలో వివాదం కొనసాగుతుండగా దీనికి సంబంధించి హైదరాబాద్ కు సంబంధించిన వాళ్ళు భూమిని కొనుగోలు చేశామని భూమి వద్దకు వచ్చారు. దీంతో స్థానికంగా ఉన్న కొంతమంది వారిమీదికి దాడికి పాల్పడ్డారు. కట్ చేస్తే…. తమ… -
Killed with Tractor : పాత కక్షలు.. ట్రాక్టర్తో ఢీ కొట్టి హత్య..
రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో నేవూరి నరసయ్య (42) అనే వ్యక్తిని ట్రాక్టర్ తో ఢీ కొట్టి హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. గత కొద్దిరోజులుగా పాత కక్షల నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి హత్య కు పాల్పడినట్లుగా మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసుల అదుపులో అనుమానితుడు కిషన్ ఉన్నాడని తెలుసుకున్న బంధువులు… స్టేషన్ పై దాడి చేశారు. అంతేకాకుండా.. అడ్డొచ్చిన పోలీసులను కూడా మృతుడి బంధువులు చితకబాదారు. దీంతో ఒక్కసారి… -
Cyberabad Traffic : సైబరాబాద్ ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్గా శ్రీనివాస్ రావు
సైబరాబాద్ ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్గా టీ.శ్రీనివాస్రావు ఐపీఎస్ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2016 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన టీ శ్రీనివాస్రావు ప్రస్తుతం సీఐడీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ఆయనను సైబరాబాద్ ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. అయితే టీ శ్రీనివాస్రావు మూడున్నర ఏళ్ల పాటు గవర్నర్ నరసింహన్కు ఏడీసీగా పని చేశారు. ఇదిలా ఉంటే… హైదరాబాద్ పరిధిలో భారీగా పోలీసు సిబ్బందిని బదిలీ… -
Breaking : ఈ నెలాఖరులోపు 10వ తరగతి ఫలితాలు
గత నెల మే 23 నుంచి జూన్ 1వ తేదీ వరకు తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ముందుగా అనుకున్నట్లుగా 20 రోజులలోనే పదో తరగతి ఫలితాలను విడుదల చేసేందుకు నిర్ణయాలు తీసుకున్నారు అధికారులు. కానీ.. ఈ నెలాఖరు లోపు 10 వ తరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పటికే పేపర్ కరెక్షన్ పూర్తయ్యింది. ఇప్పుడు.. పోస్ట్ వాల్యూయేషన్ ప్రాసెస్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటు..… -
Virata Parvam: సరళ ఫ్యామిలీని కలిసి ఎమోషనల్ అయిన సాయి పల్లవి
రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరాట పర్వం. జూన్ 17 న ఈ సినిమా రిలీజ్ కానుండడంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని వేగవంతం చేసింది. ఇక నిన్ననే వరంగల్ లో విరాటపర్వం ఆత్మీయ వేడుక ఘనంగా జరుపుకున్న విషయం విదితమే.. ఈ వేడుకలో ఈ సినిమాలోని వెన్నెల పాత్ర.. వరంగల్ లో నివసించే సరళ అనే యువతి జీవితం ఆధారంగా తెరక్కించారని చెప్పారు. దీంతో ఈరోజు విరాటపర్వం… -
Ante Sundaraniki: సినిమా అట్టర్ ప్లాప్.. నాని సమాధానం అల్టిమేట్
న్యాచురల్ స్టార్ నాని, నజ్రియా జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అంటే సుందరానికీ. భారీ అంచనాల మధ్య జూన్ 10 న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకొని అభిమానులను నిరాశపరిచింది. నాని నటన బావున్నా ల్యాగ్ ఎక్కువ ఉందని, కొన్ని సీస్ ను కట్ చేస్తే బావుంటుందని అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇక ఇవేమి పట్టించుకోకుండా చిత్ర బృందం తమ సినిమా సూపర్ హిట్ అంటూ సక్సెస్ సెలబ్రేషన్స్… -
Corona Updates : తెలంగాణలో కొత్తగా 126 కరోనా కేసులు..
తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మరోసారి 100కు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. క్రమంగా కొత్త కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్యా పెరుగుతోంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటడం ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 13,015 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 126 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా హైదరాబాద్ లో 75 కేసులు వచ్చాయి. ఒక్కరోజు వ్యవధిలో… -
Keerthy Suresh: కీర్తి సురేష్ పోస్ట్ వెడ్డింగ్ షూట్.. హాజరైన స్టార్ హీరోయిన్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం వెడ్డింగ్ వైబ్స్ ను ఎంజాయ్ చేస్తోంది.. పోస్ట్ వెడ్డింగ్ షూట్ లో స్నేహితులతో కలిసి రచ్చ చేస్తోంది.. ఏంటీ కీర్తి అప్పుడే పెళ్లి చేసుకోబోతుందా..? వరుడు ఎవరు..? ఎక్కడ పెళ్లి..? ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేయకండి.. టైటిల్ ను చూసి కంగారుపడకండి.. ఎందుకంటే ఇది కీర్తి పెళ్లి కాదు.. ఆమె ఫ్రెండ్ పెళ్లి.. ‘సర్కారువారి పాట’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సక్సెస్…
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!