వైద్య, ఆరోగ్యశాఖపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2పై సమావేశంలో చర్చించారు. ఆరోగ్యశ్రీని ఎలా వినియోగించుకోవాలనేదానిపై ముమ్మరంగా ప్రచారం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు వైద్యచికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
తిరుమలలో మరో డ్రోన్ కలకలం రేపింది. తిరుమల మొదటి ఘాట్రోడ్డులోని 53వ మలుపు వద్ద నిబంధనలకు విరుద్దంగా డ్రోన్ కెమెరా సాయంతో అసోంకు చెందిన ఆర్మీ కమాండర్, అతని భార్య కలిసి తిరుమల కొండలను వీడియో తీశారు.
గుంటూరు రైల్వేస్టేషన్లో మూడు రైళ్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. నరసాపురం నుంచి హుబ్లీకి, గుంటూరు నుంచి విశాఖకు, రేణిగుంట నుంచి నంద్యాలకు మూడు రైళ్లను కేంద్రమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మూడు రైళ్లను ప్రారంభించామని, నంద్యాల నుంచి రేణిగుంట రైలు తిరుమల భక్తులకు ఎంతో ప్రయోజనంగా ఉంటుందని తెలిపారు
ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన కేశినేని నానిపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేశినేని నాని అవినీతి పరుడు.. నిరూపించడానికి మేం సిద్ధం ఆయన వ్యాఖ్యానించారు. కేశినేని నాని బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పెంత..?.. తిరిగి చెల్లించింది ఎంత..?.. తాను తీసుకున్న బ్యాంకుల అప్పుల వివరాలు కేశినేని నాని వెల్లడించగలరా..? అంటూ బుద్దా వెంకన్న సవాల్ విసిరారు.
టాలివుడ్ సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా sగురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు స్టార్ హీరోల అందరి సరసన జతకట్టింది.. యువకుడు సినిమాతో అరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ ఆ తర్వాత ఖుషీ సినిమాతో బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది.. ఆ తర్వాత ఒక్కో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంటూ వస్తుంది.. ఎన్నో సినిమాల్లో నటించింది.. ఇప్పుడు వదిన, అక్క పాత్రల్లో నటిస్తుంది.. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్…
భారత్తో వివాదం ముదిరిన తర్వాత మాల్దీవులకు వచ్చే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గింది. భారత్ లోనే వందలాది మంది తమ పర్యటనలను క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో పాటు మేక్ మై ట్రిప్, ఈజ్ మై ట్రిప్ మాల్దీవుల బుకింగ్లను రద్దు చేశాయి.
ఈ *401# నెంబర్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని టెలికామ్ శాఖ ఓ హెచ్చరిక జారీ చేసింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ విషయంలో అలర్ట్ గా ఉండాలని చెప్పింది.
మున్సిపల్ ఉద్యోగాల కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బృందం ఇవాళ పశ్చిమ బెంగాల్లోని వివిధ ప్రాంతాల్లో సోదాలు చేస్తుంది. మంత్రి సుజిత్ బోస్కు సంబంధించిన ఇళ్లతో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తపస్ రాయ్, మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్కు సంబంధించిన ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సమయం వచ్చేసింది.. ఈరోజు భారీ అంచనాల నడుమ గుంటూరు కారం సినిమా విడుదలైంది.. పన్నెండేళ్ల తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ సినిమా చేస్తుండటంతో ‘గుంటూరు కారం’ మీద అంచనాలు ఏర్పడ్డాయి. ‘కుర్చీ మడత పెట్టి…’ సాంగ్ సినిమాకు కావాల్సిన ప్రచారాన్ని తీసుకొచ్చింది. మహేష్ బాబు మాస్ అవతార్, డ్యాన్సుల్లో ఎనర్జీ చూసి జనాలు థియేటర్లకు క్యూ కట్టారు.. సినిమా మొదటి షో…
సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబో అంటే ఫ్యాన్స్లో ఏ రేంజ్లో అంచనాలు ఉంటాయో అందరికీ తెలుసు.. ఈ కాంబోలో వచ్చిన సినిమాలు జనాలను ఆకట్టుకున్నాయి.. దాంతో ఇప్పుడు రిలీజ్ అయిన సినిమా పై కూడా అంచనాలు రెట్టింపు అయ్యాయి.. గత కొద్ది రోజులుగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం హంగామా చేస్తున్నారు.. ఈరోజు ఎట్టకేలకు విడుదల అయ్యింది.. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్తో సినిమాపై ఎక్స్పెటేషన్స్ పెరిగిపోయాయి. కుర్చీ మడతపెట్టి.. అనే సాంగ్…