Tirumala: తిరుమలలో మరోసారి డ్రోన్ కలకలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: తిరుమలలో మరో డ్రోన్ కలకలం రేపింది. తిరుమల మొదటి ఘాట్రోడ్డులోని 53వ మలుపు వద్ద నిబంధనలకు విరుద్దంగా డ్రోన్ కెమెరా సాయంతో అసోంకు చెందిన ఆర్మీ కమాండర్, అతని భార్య కలిసి తిరుమల కొండలను వీడియో తీశారు. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్రోడ్డులోని మోకాళ్ల పర్వతం వద్ద వారి వ్యక్తిగత డ్రోన్తో చిత్రీకరించారు. ఈ క్రమంలో కొందరు ప్రయాణికులు వారిని సెల్ఫోన్లలో చిత్రీకరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Read Also: Union Minister Kishan Reddy: మూడు రైళ్లను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Also Read
భద్రతా కారణాల నేపథ్యంలో తిరుమలలో ఎటువంటి డ్రోన్లను ఉపయోగించేందుకు అనుమతి లేదు. కొండపైకి వచ్చే వాహనాలను అలిపిరి చెక్పోస్ట్ వద్ద చెక్ చేసిన తర్వాతే తిరుమలకు అనుమతిస్తారు. కానీ అధికారుల కళ్లు కప్పి ఇద్దరు డ్రోన్ కెమెరాను తీసుకురావడం, దానితో వీడియోలు తీయడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన విజిలెన్స్ అధికారులు ఆర్మీ కమాండర్, అతని భార్యను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. డ్రోన్ కెమెరా స్వాధీనం చేసుకుని అధికారులు విచారణ చేపట్టారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!