India- Maldives Row: మాల్దీవులకు తగ్గిన పర్యాటకుల సంఖ్య.. ఇబ్బందుల్లో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lakshadweep: భారత ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవుల మంత్రుల అభ్యంతరకర వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ కామెంట్స్ పై భారత్ నిరసన వ్యక్తం చేయగా.. ఇతర దేశాలు కూడా భారత్కు మద్దతు తెలిపాయి. ఇదిలా ఉంటే, భారత ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు కూడా మాల్దీవులపై తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాల్దీవులను సందర్శించే బదులు లక్షద్వీప్కు వెళ్లాలని ప్రజలు చర్చించుకుంటున్నారు. దీంతో పాటు మాల్దీవులను బహిష్కరించడం కూడా ట్రెండింగ్ అవుతుంది. అనేక విదేశీ టూర్ బుకింగ్ ఏజెన్సీలు కూడా మాల్దీవుల ప్యాకేజీలను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి.
Read Also: Nifty At Alltime High : ఉత్సాహంగా ఐటీ షేర్లు.. ఆల్ టైం హైని టచ్ చేసిన నిఫ్టీ
Also Read
- Pawan Kalyan: ప్రెస్మీట్కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
- CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
- Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!
- TTD Record: రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం.. టీటీడీ చరిత్రలోనే అరుదైన రికార్డు!
ఇక, భారత్తో వివాదం ముదిరిన తర్వాత మాల్దీవులకు వచ్చే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గింది. భారత్ లోనే వందలాది మంది తమ పర్యటనలను క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో పాటు మేక్ మై ట్రిప్, ఈజ్ మై ట్రిప్ మాల్దీవుల బుకింగ్లను రద్దు చేశాయి. అయితే, మాల్దీవులకు భారతదేశం రెండవ అతిపెద్ద పర్యాటక మార్కెట్.. భారతీయ పర్యాటకులు పెద్ద సంఖ్యలో మాల్దీవులను సందర్శిస్తారు. ఇటీవలి కాలంలో మాల్దీవులకు పర్యాటకుల రాకపోకలకు భారతదేశం స్థిరమైన సహకారాన్ని అందిస్తోంది. ఇది అత్యంత ఇష్టమైన హాలిడే గమ్యస్థానాలలో ఒకటిగా నిలిచింది.
Read Also: YV Subba Reddy: 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యం.. అందుకే మార్పులు..
కానీ, మాల్దీవుల పర్యాటక మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. అధికారిక డేటా ప్రకారం 2023 మొదటి 11 నెలల్లో మాల్దీవులకు వచ్చే పర్యాటకులలో భారతదేశం రెండవ అతిపెద్ద వనరుగా నిలిచింది. ఈ కాలంలో 1, 83,371 మంది పర్యాటకులు మాల్దీవులను సందర్శించారు. భారతదేశం నుంచి పర్యాటకులు మాల్దీవులకు వెళ్లకపోవడం ఆ దేశానికి పెద్ద నష్టం వాటిల్లింది. ఇటీవల, పెద్ద సంఖ్యలో భారతీయులు మాల్దీవులను బహిష్కరించి.. లక్షద్వీప్కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Housing Loan: అలెర్ట్..అలెర్ట్.. హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొంటున్నారా? ఆర్థిక నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
-
Pawan Kalyan: ప్రెస్మీట్కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
-
Hellfire Missile Explained: అమెరికా సీక్రెట్ వెపన్.. టార్గెట్ ఫిక్స్ చేసి కొడితే శత్రు నౌకల గుండెలు పేలాల్సిందే!
-
Airtel: రూ.99కే ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ ప్లే ప్రీమియం.. 20కి పైగా OTT యాప్లకు యాక్సెస్
-
Venkatesh Iyer: ట్రోలింగ్ నన్ను ప్రభావితం చేసింది.. ఆ మ్యాచ్ నా కెరీర్లో కీలక మలుపు!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!