India- Maldives Row: మాల్దీవులకు తగ్గిన పర్యాటకుల సంఖ్య.. ఇబ్బందుల్లో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lakshadweep: భారత ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవుల మంత్రుల అభ్యంతరకర వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ కామెంట్స్ పై భారత్ నిరసన వ్యక్తం చేయగా.. ఇతర దేశాలు కూడా భారత్కు మద్దతు తెలిపాయి. ఇదిలా ఉంటే, భారత ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు కూడా మాల్దీవులపై తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాల్దీవులను సందర్శించే బదులు లక్షద్వీప్కు వెళ్లాలని ప్రజలు చర్చించుకుంటున్నారు. దీంతో పాటు మాల్దీవులను బహిష్కరించడం కూడా ట్రెండింగ్ అవుతుంది. అనేక విదేశీ టూర్ బుకింగ్ ఏజెన్సీలు కూడా మాల్దీవుల ప్యాకేజీలను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి.
Read Also: Nifty At Alltime High : ఉత్సాహంగా ఐటీ షేర్లు.. ఆల్ టైం హైని టచ్ చేసిన నిఫ్టీ
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ఇక, భారత్తో వివాదం ముదిరిన తర్వాత మాల్దీవులకు వచ్చే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గింది. భారత్ లోనే వందలాది మంది తమ పర్యటనలను క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో పాటు మేక్ మై ట్రిప్, ఈజ్ మై ట్రిప్ మాల్దీవుల బుకింగ్లను రద్దు చేశాయి. అయితే, మాల్దీవులకు భారతదేశం రెండవ అతిపెద్ద పర్యాటక మార్కెట్.. భారతీయ పర్యాటకులు పెద్ద సంఖ్యలో మాల్దీవులను సందర్శిస్తారు. ఇటీవలి కాలంలో మాల్దీవులకు పర్యాటకుల రాకపోకలకు భారతదేశం స్థిరమైన సహకారాన్ని అందిస్తోంది. ఇది అత్యంత ఇష్టమైన హాలిడే గమ్యస్థానాలలో ఒకటిగా నిలిచింది.
Read Also: YV Subba Reddy: 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యం.. అందుకే మార్పులు..
కానీ, మాల్దీవుల పర్యాటక మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. అధికారిక డేటా ప్రకారం 2023 మొదటి 11 నెలల్లో మాల్దీవులకు వచ్చే పర్యాటకులలో భారతదేశం రెండవ అతిపెద్ద వనరుగా నిలిచింది. ఈ కాలంలో 1, 83,371 మంది పర్యాటకులు మాల్దీవులను సందర్శించారు. భారతదేశం నుంచి పర్యాటకులు మాల్దీవులకు వెళ్లకపోవడం ఆ దేశానికి పెద్ద నష్టం వాటిల్లింది. ఇటీవల, పెద్ద సంఖ్యలో భారతీయులు మాల్దీవులను బహిష్కరించి.. లక్షద్వీప్కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!