Ashok Gajapathi Raju: గూగుల్ డేటా సెంటర్కు సింహాచలం భూముల కేటాయింపు.. అశోక్ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashok Gajapathi Raju: సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన భూములను గూగుల్ డేటా సెంటర్కు కేటాయించడంపై గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు స్పందించారు. విశాఖలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, అభివృద్ధి మరియు ఆధ్యాత్మికత మధ్య సమతుల్యత ఉండాలని అభిప్రాయపడ్డారు. అయితే, సింహాచలం భూముల కేటాయింపుపై కీలక వ్యాఖ్యలు చేశారు.. “పెట్టుబడుల వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అది మంచి పరిణామమే. కానీ, అదే సమయంలో భక్తుల మనోభావాలను గౌరవించడం చాలా ముఖ్యం” అని ఆయన పేర్కొన్నారు. దేవుడికి భక్తులు సమర్పించిన భూములు కాబట్టి, వాటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు భక్తుల నమ్మకాలకు లోబడి ఉండాలని హితవు పలికారు. గతంలో ప్రభుత్వ సంస్థలు తీసుకున్న భూములకు సంబంధించిన రికార్డులను కూడా నేటికీ అప్డేట్ చేయలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
Read Also: Vishwak Sen’s CULT Teaser: ‘కల్ట్’ టీజర్తో విశ్వక్ సేన్ ఊచకోత!
Also Read
- Floodlight Collapse: విశాఖ స్టేడియంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. కూలిన ఫ్లడ్ లైట్..
- Godavari Floods: గోదావరి వరదలపై ప్రభుత్వం అలర్ట్.. ప్రభావిత జిల్లాలకు హోంమంత్రి కీలక ఆదేశాలు
- Botsa Satyanarayana: జగన్ పర్యటనను విజయవంతం చేశాం.. కూటమి ప్రభుత్వంపై బొత్స తీవ్ర ఆరోపణలు
- Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
మరోవైపు, ఇటీవల తిరుమల వేంకటేశ్వరస్వామి ఫోటోలతో ఎమ్మెల్సీలు చేసిన ప్రదర్శనపై అశోక్ గజపతిరాజు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “దైవం పట్ల ఎవరు అనుచితంగా ప్రవర్తించినా తప్పే. దేవుడిని రాజకీయాల్లోకి లాగడం బాధాకరం” అని అన్నారు. ప్రసాదాల నాణ్యత విషయంలో పూర్తి బాధ్యత పాలకమండలిదేనని, పారదర్శకత కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక, గత ఏడాది చందనోత్సవం సమయంలో జరిగిన అపశ్రుతులను దృష్టిలో ఉంచుకుని, ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు ఆయన తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు ఉండాలని అధికారులను కోరారు గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!