భద్రాద్రి జిల్లాలోని మణుగూరులో జరిగిన సమీక్ష సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. అధికారులు దొరల పాలనలో ఉన్నామనేది మర్చిపోండి. ప్రజా పాలనలో ఉన్నాం. దొరల పాలనలో ఉన్నామనుకుంటే ఈ ప్రభుత్వం ఉపేక్షించదన్నారు. రాష్ట్రంలో 1251 నియోజకవర్గాల్లో కార్పోరేటర్ల తలతన్నెల ఇంటిగ్రేటెడ్ పాఠశాల శంకుస్థాపనలు చేశామని, అర్హులైన రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పామన్నారు. గత ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాలలో 13,500 కోట్లు రెండు…
రాష్ట్రంలోని ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్య పూర్తి చేసిన ప్రతిఒక్కరికీ ఉద్యోగం లభించే విధంగా పాఠ్యప్రణాళికను ప్రక్షాళన చేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... తమ హయాంలో ఐటీఐ, పాలిటెక్నిక్ చదివిన ప్రతి విద్యార్థికి ఉద్యోగం రావాలన్నది తమ లక్ష్యమని చెప్పారు.
పెండింగ్ లో ఉన్న 4 వేల కోట్ల ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలను రెండు రోజుల్లో విడుదల చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు , విద్యా శాఖ కార్యాలయాల ముట్టడి చేస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం నేత వేముల రామకృష్ణ అధ్యక్షతన హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో విద్యార్థుల ఫీజు రియంబర్స్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల రాష్ట్ర…
తెలంగాణ రాష్ట్రంలో దుర్గమూల్యాలకు సమర్థంగా స్పందించేందుకు ‘తెలంగాణ రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్’ (టీజీడీఆర్ఎఫ్) ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఫోర్స్లో సుమారు 2000 మంది సభ్యులుంటారు. మంగళవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, , డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఈ ప్రతిపాదనలపై చర్చించారు. సమాచారంలో ఇటీవల రాష్ట్రంలో జరిగిన వరదలు , లోతట్టు…
ఎర్రమంజిల్ లోని పంచాయతీ రాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో ఇటీవల నియామక పత్రాలు అందుకున్న AEE లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క హాజరయ్యారు. శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి మంత్రి సీతక్క ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. నూతనంగా నియమితులైన AEEలకు అభినందనలు తెలిపారు. అందరూ నిబద్ధతతో అంకితభావంతో ప్రజలకు సేవలు…
అన్ని వృత్తుల్లో గొప్ప వృత్తి వైద్య వృత్తి అని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ఈ శాఖ బాధ్యత చేపట్టి 10 నెలలు… ఎంతో అధ్యయనం చేశాను… ఇంకా చేయాల్సింది చాలా ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. జూనియర్ డాక్టర్లు సమ్మెకు వెళ్తాము అని చెప్పారని, మాకు ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఉన్నాయని చెప్పారన్నారు. అయితే.. నేను సీఎంతో మాట్లాడి వెంటనే 200 కోట్లు నిధులు విడుదల చేయించామన్నారు. హాస్టల్స్, ఇతర…
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో, ప్రభుత్వం పది నెలల పాటు అద్దె చెల్లించకపోవడంతో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కు తాళం వేసిన దుస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి హరీష్ రావుప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఆయన మాట్లాడుతూ, ఈ సంఘటన కాంగ్రెస్ పాలనలో గురుకులాల నిర్వహణ అగాధ స్థితికి చేరుకుందనడానికి మరో ఉదాహరణగా చెప్పవచ్చు. హరీష్ రావుచేసిన ఈ వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఎక్స్ వేదికపై కఠినమైన కౌంటర్ ఇచ్చారు. “గత పదేళ్ల మీ బీఆర్ఎస్…
దేశ రక్షణ విషయంలో బీఆర్ఎస్ పార్టీ , కేసీఆర్ కుటుంబం బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణకు ప్రత్యేకంగా గర్వకారణమైన నేవీ రాడార్ స్టేషన్ పై కూడా రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ రాడార్ స్టేషన్కు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే జీవోలు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అది ఎంత గొప్ప ప్రాజెక్టో, అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నేతలు ఒక విధంగా మాట్లాడినా, ప్రతిపక్షంలో…