Shabbir Ali : గత పదేళ్ల లో మీరేం చేశారో గుర్తుకు తెచ్చుకోండి
- మళ్ళీ ఇప్పుడు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు
- 48 మంది ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులు చేసింది మీరు
- తలసాని టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ప్రమాణం చేయించారు
- అప్పుడు గుర్తు లేదా.. సిగ్గులేకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారు
- మా పార్టీ ఇప్పటి వరకు ఎప్పుడు అలా చేయలేదు : షబ్బీర్ అలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. బీఆర్ఎస్ పనికట్టుకుని బురద జల్లే పనిలో పడ్డారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీకి కొంత సమయం ఇచ్చే వాళ్ళమని, కానీ కేటీఆర్.. హరీష్ లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ కనిపించడం లేదు.. ప్రతిపక్ష నాయకుడు ఎవరు అనేది అర్దం అవ్వడం లేదని ఆయన అన్నారు. గత పదేళ్ల లో మీరేం చేశారో గుర్తుకు తెచ్చుకోండని, నేను ప్రతిపక్ష నేతగా ఉంటే.. నా వెంట ఉన్న ఆరుగురు ఎమ్మెల్సీలు లాక్కున్నారన్నారు. గంట సమయం ఇవ్వకుండా నా సెక్యూరిటీ.. బుల్లెట్ ప్రూఫ్ తీసేశారని, మళ్ళీ ఇప్పుడు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారన్నారు షబ్బీర్ అలీ. 48 మంది ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులు చేసింది మీరు అని, తలసాని టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ప్రమాణం చేయించారన్నారు. అప్పుడు గుర్తు లేదా.. సిగ్గులేకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.
Balakrishna : హీరోయిన్లకి మించిన అందం.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా బాలయ్య కుమార్తెలు
మా పార్టీ ఇప్పటి వరకు ఎప్పుడు అలా చేయలేదని ఆయన అన్నారు. బీఆర్ఎస్ హయంలో మైనార్టీలకు ఏం చేశారు, మైనార్టీలకు మెడికల్ కాలేజి ఇచ్చారా..? అని ఆయన ప్రశ్నించారు. ఇందిరమ్మ కమిటీలతో ఇండ్లు ఇచ్చేందుకు జీఓ ఇచ్చారని, సోషల్ మీడియా లో ఇందిరమ్మ కమిటీల పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారం చేసే వాళ్లకు సిగ్గు శరం ఉండాలని, పిచ్చి మాటలు మాట్లాడకండన్నారు. మైనార్టీల కోసం183 సీట్ల లా కాలేజి ఇచ్చామని, 2 ఫార్మసీ కాలేజీలు ఇచ్చామన్నారు. కేసీఆర్ కాలేజీలు మూసేశారు.. మేము తెరిపించే పనిలో ఉన్నామన్నారు. కేటీఆర్.. హరీష్ లకు డీఎస్సీ ఎలా వేయాలి..? తెలుసా మీకు.. గ్రూప్ పరీక్షలు ఎలా పెట్టాలి అనేది తెలుసా..? మేము డీఎస్సీ..గ్రూప్స్ ఎలాంటి వివాదం లేకుండా వేస్తున్నాం..మీ కంటికి కనిపించడం లేదా..? అని షబ్బీర్ అలీ అన్నారు.
Also Read
- నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
- Thursday Horoscope: ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందే.. లేదా తిప్పలు తప్పవ్..!
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
అంతేకాకుండా..’తెలంగాణ నీ లూటీ చేసిన దొంగలు బీఆర్ఎస్ వాళ్ళు, దొంగల గురించి ఏం మాట్లాడాలి. గురుకులాల కి లాక్ లు వేయడం కరెక్ట్ కాదు. మూడేళ్లు కేసీఆర్ ఇవ్వలేదు బకాయిలు. బీఆర్ఎస్ నేతలు.. వెంటపెట్టుకుని తాళాలు వేయించారు. కాంగ్రెస్ నీ బదానం చేసే పనిలో బీఆర్ఎస్ ఉంది. మోడీకి రేవంత్.. నేను భయపడము, ఈడీ విచారణకు ఇద్దరం వెళ్లినం.. మమ్మల్ని వదిలేయలేదు. మీరు వెళ్ళారా ఈడీకి, కోడి గుడ్డుకు ఇచ్చే పైసలు కూడా కేసీఆర్ పెండింగ్ పెట్టిండు, మూడేళ్లు గా బిల్లులు ఇవ్వకుండా ఆపింది కేసీఆర్. మూసీపై ఇంకా డీపీఆర్ కాలేదు, మీలాగా డీపీఆర్ లేకుండా ప్రాజెక్టులు కట్టం. డీపీఆర్ కాకుండా పని చేస్తే.. మేమే మా ప్రభుత్వాన్ని అడుగుతాం’ అని షబ్బీర్ అలీ అన్నారు.
Annamaya District: గుప్త నిధుల కోసమా..? మరేదైనా కారణమా.. అభయాంజనేయ స్వామి ఆలయం కూల్చివేత
తాజావార్తలు
-
Karuppu Release : ఆర్థిక ఇబ్బందుల కారణంగా ‘కరుప్పు’ రిలీజ్ వాయిదా.. టికెట్ డబ్బులు వాపస్
-
నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
-
Sarah Taylor: చారిత్రక నిర్ణయం.. పురుషుల జట్టుకు తొలి మహిళా కోచ్ గా సారా టేలర్..
-
Thursday Horoscope: ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందే.. లేదా తిప్పలు తప్పవ్..!
-
Israeli base in Iraq: ప్రపంచ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు.. ఇరాక్లో ఇజ్రాయెల్ రహస్య స్థాపరం..!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!