R. Krishnaiah : పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్ రెండు రోజుల్లో విడుదల చేయాలి
- పెండింగ్ లో ఉన్న 4 వేల కోట్ల ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలను రెండు రోజుల్లో విడుదల చేయాలి
- లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు.. విద్యా శాఖ కార్యాలయాల ముట్టడి చేస్తాం
- కాలేజీ కోర్సులు చదివే విద్యార్థుల పూర్తి ఫీజులు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి : ఆర్. కృష్ణయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెండింగ్ లో ఉన్న 4 వేల కోట్ల ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలను రెండు రోజుల్లో విడుదల చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు , విద్యా శాఖ కార్యాలయాల ముట్టడి చేస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం నేత వేముల రామకృష్ణ అధ్యక్షతన హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో విద్యార్థుల ఫీజు రియంబర్స్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించారు. కాలేజీ కోర్సులు చదివే విద్యార్థుల పూర్తి ఫీజులు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని, విద్యార్థులకు స్కాలర్ షిప్ ఏడాదికి రూ.5,500 నుండి 20 వేలకు పెంచాలని డిమాండ్ చేసారు.
Also Read
Karnataka High Court: మసీదు లోపల ‘‘జై శ్రీరాం’’ నినాదాలు చేయడం మత భావాలను దెబ్బతీయదు..
ఫీజుల బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాలేజీ యజమాన్యాలు కోర్సు పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ఉన్నత కోర్సుల్లో సీట్లు వచ్చినా.. చదవలేక పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలపై మొదటి ప్రాధాన్యతగా బడ్జెట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
AP Skill Development Case: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఈడీ దూకుడు
తాజావార్తలు
-
Soft Mysore Pak Recipe : ఇంట్లోనే హోటల్ స్టైల్ సాఫ్ట్ మైసూర్ పాక్.. పక్కా కొలతలతో ఇలా చేసుకోండి.!
-
Crispy Ragi Vada: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి! రాగి పిండితో సింపుల్గా కరకరలాడే వడలు
-
Tamil Nadu: హమ్మయ్య.. ఉత్కంఠకు తెర.. విజయ్కు వీసీకే మద్దతు
-
Ragi Sweet Bondalu : రుచికి తోడు ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి బోండాలు.. పిల్లలు మళ్లీ మళ్లీ అడుగుతారు.!
-
Dacoit : నెంబర్ 1 ట్రెండింగ్లో దూసుకెళ్తున్న అడివి శేష్ ‘డెకాయిట్’