Home
Latest News
Latest News News
-
బీజేపీ నేతలు డ్రామాలు చేస్తున్నారు : మంత్రి నిరంజన్రెడ్డి
తెలంగాణ రాష్ట్రం ధాన్యం కొనుగోలు విషయంలో అగ్గి రాజుకుంటోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ల మధ్య ధాన్యం కొనుగోళ్లలో రాజకీయం వేడెక్కింది. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేతలు డ్రామాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పంటలు పండించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం నీళ్లు, కరెంటు ఇస్తూంటే.. ఇప్పడొచ్చి బీజేపీ నేతలు వరి కొనుగోలు చేయాలంటూ కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లడం హాస్యస్పదం అన్నారు. అంతేకాకుండా రైతుల సమస్యల… -
నటిపై లైంగిక దాడి జరగలేదు : బంజారాహిల్స్ పోలీసులు
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కేబీఆర్ పార్క్లో నటి చౌరాసియాపై దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నటి చౌరాసియాపై లైంగిక దాడి జరిగిందని వార్తలు రావడంతో బంజారాహిల్స్ పోలీసులు స్పందించారు. నటి చౌరాసియా పై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని, కేవలం సెల్ఫోన్ దొంగలించడం కోసమే ఆమెపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేశాడని వారు వెల్లడించారు. సీసీ కెమెరాల్లో దృశ్యాలు… -
తెలంగాణకు వర్ష సూచన.. అప్రమత్తమైన టీసర్కార్..
దక్షిణ అండమాన్ సముదంలో అల్పపీడనం ఏర్పడడంతో ఏపీ, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, కోస్టల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర వాతావరణ శాఖ ఆయా రాష్ట్రాలు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. రానున్న వర్షాల ప్రభావం ధాన్యం కొనుగోళ్లపై పడకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. ధాన్యాన్ని వర్షాల నుంచి రక్షించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. 4,039 ధాన్యం కోనుగోలు కేంద్రాలలో యుద్ధప్రతిపాదికనగా వర్షం… -
తూర్పు గోదావరి జిల్లాలో దారుణం..
తూర్పు గోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని నలుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం ఐ.పోలవరం పాలకాలువ వద్ద ఎదరురెదురుగా వస్తున్న రెండు బైక్లు ఢీకొన్నాయి. దీంతో రెండు బైక్లపై ఉన్న నలుగురు కింద పడగా.. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలవడంతో గమనించిన స్థానికులు వెంటనే ఆసుప్రతికి తరలించారు. ఆ వ్యక్తి కూడా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులు జాగారంపల్లికి… -
ప్రగతి భవన్ చేరుకున్న కేసీఆర్.. ఎమ్మెల్సీ అభ్యర్థులపై చర్చ..
తెలంగాణలో ఎమ్మెల్యే, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ తమ ఎమ్మెల్యే అభ్యర్థులపై కసరత్తు మొదలుపెట్టింది. ఈ క్రమంలో ప్రగతి భవన్కు సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకోనున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనపై చర్చించి ఈ రోజు రాత్రికి లేదా రేపు ఉదయం ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటాలో ఆరు, గవర్నర్ కోటా లో ఒకటి… -
ఆర్టీసీ ఎసీ బస్సులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం..
ఓ ఆర్టీసీలో బస్సులో మంటలు చెలరాగాయి. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్, ప్రయాణికులు వెంటనే బస్సు నుండి దిగిపోయారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్లోని మియాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ గరుడ ఎసీ బస్సు భద్రాచలం వైపు వెళుతోంది. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా వైరాకు చేరుకునేసరికి బస్సులో మంటలు చెలరేగాయి. అయితే మంటలను గమనించిన డ్రైవర్, ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి దిగిపోయి ప్రాణాలు రక్షించుకున్నారు. అయితే ప్రమాదం చోటు… -
కోర్టుల నిర్ణయాలకు సామాజిక ప్రభావం ఎక్కువ : సీజేఐ ఎన్వీ రమణ
నేషనల్ లీగల్ సర్వీసెస్ అధారిటీ (నల్సా) ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ అవగాహన ప్రచార కార్యక్రమానికి సుప్రీంకోర్డు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు, హైకోర్టులు అత్యంత స్వతంత్రంగా పనిచేయాలని సూచించారు. అంతేకాకుండా తీర్పులు సులభంగా అర్థమయ్యేలా, స్పష్టమైన భాషలో ఉండాలని, న్యాయమూర్తులు సాధరణ భాషలో తీర్పు రాయాలని ఆయన అన్నారు. కోర్టుల నిర్ణయాలకు సామాజికంగా ఎక్కువ ప్రభావం ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అట్టడుగు స్థాయిలో… -
ముగిసిన దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశం..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో తిరుపతి తాజ్మహల్ హోటల్లో జరిగిన దక్షిణాది రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి ఏపీ సీఎం జగన్ అధ్యక్షత వహించారు. అంతేకాకుండా ఈ సమావేశానికి తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్, హోం మంత్రి మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్ కుమార్ లతో పాటు ఇత రాష్ట్రాల మంత్రులు, అధికారులు హజరయ్యారు. ఆయా రాష్టాల సమస్యలు, విజ్ఞప్తులను అమిత్ షా విన్నారు. ఏపీకి సంబంధించి ఏడు కీలక అంశాలను జగన్… -
గడ్చిరోలి ఎన్కౌంటర్ : మావోయిస్టుల వస్తువులు ఇవే…
గడ్చిరోలి ఎన్కౌంటర్లో 26 మంది మావోయిస్టులు మరణించారు. వీరిలో ఆరుగురు మహిళలు కూడా ఉన్నారు. అయితే ఘటన స్థలం నుంచి భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు మిళింద్ కూడా ఉండటం గమనార్హం. మృతుడు మిళింద్పై రూ.50లక్షల రివార్డు ఉంది. ఎన్ కౌంటర్లో మరణించిన మావోయిస్టులకు సంబంధించిన ఆయుధాలను, వస్తువులను పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలు ఎన్టీవీ ఎక్స్క్యూజివ్గా.. -
అలర్ట్ : 6 రోజుల పాటు రాత్రివేళ రైల్వే రిజర్వేషన్ బంద్..
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల కోసం ఓ విషయాన్ని ప్రకటించింది. 6 రోజుల పాటు రాత్రి పూట రిజర్వేషన్ సౌకర్యం లేదని దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. రాత్రి 11.30 గంటల నుంచి ఉదయం 5.30 గంటల వరకు రిజర్వేషన్ ఉండదని స్పష్టం చేసింది. నేటి రాత్రి నుంచి 20వ తేదీ వరకు సేవలకు అంతరాయం కలుగుతుందని ఇది ప్రయాణికులు గమనించాలని కోరింది. అంతేకాకుండా కరెంట్ బుకింగ్, టికెట్ల రద్దు సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. రైల్వే డేటా…
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!