ఏపీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలో భర్తీ కానున్న 11 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి ప్రకటించారు. మొత్తం 14 లో 7 ఓసీలకు, 7 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లకు కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఇదే ఆఖరు కాదని, ఇప్పుడు సర్దుబాటు చేయలేక పోయిన వారికి…
విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మెంటాడ మండలంలోని జక్కువ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలోని కోట పోలినాయుడు అనే వ్యక్తి ఇంట్లో గ్యాస్ లీక్ అవడంతో మంటలు చేలరేగాయి. దీంతో ఒక్కసారి మంటల ఎగిసిపడ్డాడడంతో పక్కనే ఉన్న 20 పూరిళ్ల కు మంటలు వ్యాపించి పూర్తిగా దగ్దమయ్యాయి. అంతేకాకుండా పూరిళ్లలో ఉన్న గ్యాస్ సిలిండర్లు కూడా పేలుతున్నాయి. సిలిండర్ పేలుళ్ల శబ్దాలతో ప్రజలు పరుగులు తీశారు. ఈ ఘటనపై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం…
అమీర్పేట్ మెట్రోస్టేషన్లో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని యువతి అమీర్పేట మెట్రో స్టేషన్ రెండవ అంతస్తు పైనుంచి దూకింది. దీంతో మెట్రో స్టేషన్ రెండో అంతస్తు నుంచి దూకడంతో ఒక్కసారిగా పక్కనే ఉన్న టింబర్ డిపోలో యువతి పడిపోయింది. శబ్దం విన్న స్థానికులు గమనించి వెంటనే యువతి వద్దకు చేరుకున్న పోలీసులకు సమాచారం అందించారు. అంతేకాకుండా 108 వాహనంలో యువతిని ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆత్మహత్యకు యత్నించిన యువతి…
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి శ్రీకారం చుట్టనుంది. ఈ నిర్ణయంతో 11.56 లక్షల కేంద్ర ఉద్యోగులకు లాభం కలుగనుంది. జనవరి 2022 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ (హౌస్ రెంట్ అలవెన్స్) పెంచేందుకు కసరత్తు ప్రారంభించింది. హెచ్ఆర్ఏ పెరుగనుంది. ఐఆర్టీఆఎస్ఏ, ఎన్ఎఫ్ఐఆర్ ఉద్యోగులు డిమాండ్ నేపథ్యంలో హెచ్ఆర్ఏ పెంపుకు కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఎక్స్, వై, జడ్ అంటూ మూడు భాగాలుగా నగరాలను విభజించి, ఎక్స్ భాగానికి రూ.5400, వై భాగానికి…
రాజన్నసిరిసిల్ల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెండ్లికి వెళ్లివస్తున్న ఓ వ్యాన్ బోల్తా కొట్టింది. చందుర్తి మండలం ఎనగంటి గ్రామ శివారులో పెండ్లి వ్యాన్ బోల్తా ఘటన చోటు చేసుకుంది. హన్మాజీపేటలో పెళ్లికి వెళ్లి అనంతరం తిరుగు ప్రయాణం లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరినప్పుడు వ్యాన్ లో 40 మంది ఉన్నట్లు సమాచారం. ఈ…
టీఎస్ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లకు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ పలు ఆదేశాలు జారీ చేశారు. అద్దె బస్సు డ్రైవర్లకు టీఎస్ఆర్టీసీ శిక్షణా కేంద్రాల్లో శిక్షణ తప్పనిసని చేస్తూ చైర్మన్ బాజిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హకీంపేట, వరంగల్లో ఉన్న టీఎస్ఆర్టీసీ శిక్షణాకేంద్రాల్లో శిక్షణ పొందాలన్నారు. అద్దె బస్సుల యజమానులు తమ డ్రైవర్లకు తప్పకుండా శిక్షణ ఇప్పించాలని పేర్కొన్నారు. అద్దె బస్సు డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా, అధిక వేగంగా బస్సులు నడపడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు…
దేశానికి వెన్నెముక రైతన్న.. రైతులకు పెద్దపీట అంటూ ఎన్నికల్లో వాగ్దానం చేయడం …గద్దెనెక్కాక దేశానికే వెన్నెముక అయిన రైతు వెన్నెముక విరిచేయడం రాజకీయ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య. స్వతంత్రం వచ్చిననాటి నుంచి రైతన్న పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన పార్టీలేగాని రైతన్నకు పేరుతెచ్చిన దాఖలాలు లేవు. దేశంలోని ఏ రాష్ట్రంలో చూసినా మట్టిని నమ్ముకున్న రైతులు ఆఖరికి ఆ మట్టిలోనే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని చెప్పడంలో ఆతిశయోక్తి లేదు. గత ఎన్నికల్లో రైతులను సంపన్నులను…
బ్రదర్ ఆఫ్ దేవరకొండ (ఆనంద్ దేవరకొండ).. న్యూ మూవీ ‘పుష్పక విమానం’. దొరసాని సినిమాతో కథనాయకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు ఆనంద్ దేవరకొండ. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సొదరుడైనా కూడా.. తన దైన నటనా శైలితో ముందుకు వెళుతున్నారు. దొరసాని సినిమా తరువాత ఆనంద్ నటించిన సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్.. ఈ సినిమా కరోనా లాక్డౌన్ కారణంగా ఓటీటీలో విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమా ఓటీటీలో మంచి విజయాన్నే సాధించింది.…
ఇంటర్నేషనల్ మార్కెట్లో జరిగే పరిణామాలతో డాలర్ విలువ మారుతూ ఉంటుంది. దాని ప్రభావం వల్ల భారతదేశం, పాకిస్థాన్తో పాటు చాలా దేశాల డబ్బుల విలువలు మారుతుంటాయి. అయితే ప్రతి రోజు అమెరికా ఒక్క డాలర్కి ఇండియన్ రూపీ విలువ ఎంతుందో తెలుసుకోవాలనే అతృత అందిరికీ ఉంటుంది. ప్రస్తుత్తం అమెరికా ఒక్క డాలర్కు విలువ ఇండియాలో రూ.74.42 పైసలు ఉంది. ఇదిలా ఉంటే.. పక్కనే ఉన్న పాకిస్థాన్లో ఎంతుందో తెలుసా.. ఒక్క డాలర్కు ఏకంగా రూ.174.22 పైసలు పలుకుతోంది.…
ప్రపంచ వ్యాప్తంగా అందరినీ భయభ్రాంతులకు గురి చేసిన కరోనా… ఏపీలో తగ్గుముఖం పడుతోంది. తాజాగా 33,362 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 262 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణైంది. అయితే గడిచిన 24 గంటల్లో కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున మరణించినట్లు వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. దీనితో పాటు 229 మంది కరోనా నుంచి కొలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 20,69,614 మందికి కరోనా వైరస్ బారిన పడగా, 20,51,976 మంది కరోనా నుంచి కోలుకున్నారు.…