కరోనా మహమ్మారి విజృంభన రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. కాలేజీల్లో, ఆఫీసుల్లో, పాఠశాలల్లో ఆఖరికి ఆసుపత్రుల్లోని వైద్యులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇలా ఎక్కడా చూసినా కరోనా రక్కసి రెక్కలు చాస్తోంది. అయితే థర్డ్ వేవ్ను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను తీవ్రతరం చేస్తున్నాయి. అయినప్పటికీ కరోనా కేసులు తీవ్రంగా నమోదవుతున్నాయి. తాజాగా ఐఐటీ హైదరాబాద్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఐఐటీ హైదరాబాద్లోని విద్యార్థులకు…
రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చే కుట్ర బీజేపీ ప్రభుత్వం చేస్తోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం పచ్చి రైతు వ్యతిరేకి అని ఆయన అన్నారు. దేశంలో రైతులను బీజేపీ బతకనిచ్చేలా లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఎరువుల ధరలు పెంచుతూ.. రైతుల ఆదాయం పెంచుతామన్న కేంద్రం ఖర్చులు రెట్టింపు చేసిందని కేసీఆర్ విమర్శించారు. ఎరువుల ధరలు తగ్గించేంతవరకు పోరాటం చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. కరెంట్ మోటర్లతో బిల్లులు వసూలు చేయడం, ధాన్యం కొనకుండా ఎరువుల…
సందు దొరికితే చాలు.. సైబర్ నేరగాళ్లు ఇదే అదునుగా భావించి డబ్బులు దండుకుంటున్నారు. సైబర్ నేరాలపై అవగాహన లేని కొందరు ఆన్లైన్లో కస్టమర్ కేర్ నంబర్లను సర్చ్ చేస్తూ.. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారు. అయితే తాజాగా హైదరాబాద్లోని బోయిన్పల్లికి చెందిన వెంకట లక్ష్మీ అనే మహిళకు ఎస్బీఐలో అకౌంట్ ఉంది. ఈ నేపథ్యంలో ఆమె ఎస్బీఐ యోనో యాప్ను వినియోగిస్తుంటుంది. అయితే ఇటీవల ఆమె ఫోన్లో ఎస్బీఐ యోనో యాప్ పనిచేయకపోవడంతో కస్టమర్ కేర్ను సంప్రదించింది.…
హైదరాబాదులో కోట్ల రూపాయల భూమిని ఇచ్చి ఇరవై అయిదు కోట్ల రూపాయల వ్యయంతో గిరిజన కొమురంభీమ్ భవనాన్ని నిర్మిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బుధవారం ఆమె నిర్మల్ జిల్లాలో మాట్లాడుతూ.. గిరిజన బిడ్డలు కోరుకున్న గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసామని, గిరిజనులు, పేదలను ఇన్ని రోజులు ఓట్ల సాధనాలుగానే చూశారని ఆమె వ్యాఖ్యానించారు. ఉద్యమ కాలంలో అరవై అయిదు సీట్లు ఇస్తే, అనంతరం జరిగిన ఎన్నికల్లో ఎనభై అయిదు సీట్లను కట్టబెట్టే…
మరోసారి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, ఈ విషయములో కేంద్రం సీరియస్గా ఉందన్నారు. కేసీఆర్పై కేంద్ర ప్రభుత్వం చర్యలకు సిద్దమైందని, ఎప్పుడైనా కేసీఆర్ జైలుకి వెళ్ళొచ్చన్నారు. అంతేకాకుండా ఈ విషయం కేసీఆర్ కు తెల్సి పోయిందని, అందుకే కమ్యూనిస్టుల తోను, ఇతర పార్టీల నేతల తో భేటీ అవుతున్నాడని విమర్శించారు. తేజస్వి యాదవ్ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా పసుగ్రాసం కుంభకోణం కేసులో జైలుకు వెళ్లి…
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని ప్రశాంతి ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శివాని అనే గర్భిణీని వైద్యం కోసం చౌటుప్పల్లోని ప్రశాంతి ప్రైవేటు ఆసుప్రతికి కుటుంబ సభ్యలు తీసుకువచ్చారు. అయితే వైద్యం వికటించి ఐదు నెలల గర్భిణీ శివాని మృతి చెందింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ.. ఆస్పత్రి ముందు మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో ఆసుపత్రి ఫర్నీచర్ ధ్వంసం చేసారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఘటనపై కేసు…
టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిననాటి నుంచి వీసీ సజ్జనార్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. టీఎస్ఆర్టీసీలో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ట్విట్టర్ వేదికగా వెల్లడిస్తున్న ప్రయాణికుల సమస్యలు క్షణాల్లోనే తీర్చతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా ఓ యువతి అర్థరాత్రి టీఎస్ఆర్టీసీ, ఎండీ సజ్జనార్ను ట్యాగ్ చేస్తూ ట్విట్ చేసింది. దీంతో సజ్జనార్ వెంటనే స్పందించారు. అయితే అర్ధరాత్రి సమయాలలో ఆర్టీసీ బస్సులలో మహిళల సౌకర్యం కోసం (వాష్ రూమ్స్) బస్సులను పెట్రోల్ పంప్లలో 10 నిమిషాలు…
గుంటూరు జిల్లాలో నేడు ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యానగర్లో ఐటీసీ సంస్థ నిర్మించిన గ్రాండ్ స్టార్ హోటల్ను ప్రారంభించనున్నారు. ఉదయం 10.45 గంటలకు ముఖ్యమంత్రి హెలికాఫ్టర్ ద్వారా గుంటూరు చేరుకుంటారు. పోలీస్ మైదానంలో హెలిప్యాడ్ వద్ద దిగి.. అక్కడినుంచి రోడ్డు మార్గం ద్వారా హోటల్కు బయలుదేరి 11గంటలకు హోటల్ ను ప్రారంభిస్తారు. ప్రారంభ కార్యక్రమంలో 45 నిమిషాల పాటు పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి హెలికాఫ్టర్ ద్వారా తాడేపల్లిలోని తన నివాసానికి…
మాదకద్రవ్యాల స్మగ్లింగ్పై పోలీసులు, కస్టమ్స్ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాదకద్రవ్యాల రవాణాపై అడుగడుగునా తనిఖీల చేస్తున్నారు. అనుమానం వచ్చిన వారిన అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే తాజాగా ఢిల్లీ ఎయిర్పోర్టులో భారీగా హెరాయిన్ పట్టుబడింది. ఉగాండాకు చెందిన మహిళ ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకుంది. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు ఆమె వెంట తీసుకువచ్చిన లగేజి బ్యాగ్ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీంతో 107 క్యాప్సల్స్లో హెరాయిన్ నింపి బట్టల మధ్యలో…
గుంటూరు జిల్లాలో కారు ప్రమాదం చోటు చేసుకుంది. సాగర్ కాలువలోకి ఓ కారు దూసుకెళ్లింది. అయితే ప్రమాదానికి గురైన కారులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చినాన్న కుమారుడు మదన్ మోహన్రెడ్డితో పాటు ఆయన భార్య, కుమార్తెలు ఉన్నారు. కారు కాలువలోకి దూసుకెళ్లడంతో మోహన్రెడ్డి భార్త, కుమార్తెలు ఘటన స్థలంలోనే మరణించారు. కారు కాలువలోకి దూసకెళ్లడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి సహాయక చర్యలు చేపట్టారు. కాలువలోని నీటిలో మునిగిన కారును తీసేలోపే మోహన్రెడ్డి భార్య, కుమార్తెలు…