సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఎక్కడెక్కడో ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం వెళ్లిన వారు తిరిగి తమ సొంతూరు చేరుకుంటారు. సంక్రాంతి పండుగ రోజున బంధుమిత్రులతో ఎంతో ఆనందంగా గడుపుతుంటారు. ఈ నేపథ్యంలో సొంతూరు వెళ్లావారితో హైదరాబాద్లోని అన్ని ఆర్టీసీ బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. ఎక్కడా చూసిన ప్రయాణికుల రద్దీగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కనిపిస్తున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ భారీ ఉంది. ఆర్టీసీ, ప్రైవేటు బస్సులతో పాటు సొంత వాహనాల్లో జనాలు సొంతూళ్లకు బయలు దేరారు.
దీంతో విజయవాడ రూట్లో పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. రైల్వే స్టేషన్లు కూడా ప్రయాణీకులతో నిండిపోయాయి. ఆంధ్రతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే వారితో రైల్వే స్టేషన్లు కళకళలాడుతున్నాయి. కోవిడ్ ఉధృతి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయాణం సమయంలోనూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా ఆర్టీసీ బస్సులో మాస్క్ లేకుండా ప్రయాణిస్తున్న ప్రయాణికులకు రూ.50 ఫైన్ వేస్తున్నారు అధికారులు.