Home
Latest News
Latest News News
-
పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదు : మంత్రి ఆదిపుమూలపు
ఏపీలో పీఆర్సీపై స్పష్టత నెలకొనడం లేదు. ఇటీవల సీఎం జగన్ ప్రకటించిన 11వ పీఆర్సీపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేసారు. మరోమారు సమ్మెకు పూనుకున్నారు. దీంతో ఏపీలో మరోసారి పీఆర్సీపై ఉత్కంఠ నెలకొంది. సీఎం ప్రకటించిన పీఆర్సీ ఉద్యోగులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు వాపోతున్నారు. అయితే దీనిపై స్పందించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పీఆర్సీకి అంగీకరించారాని అయన అన్నారు. మళ్లీ ఇప్పుడు ఉద్యోగ… -
‘వారు 6 నెలల తర్వాత కోవిడ్ వ్యాక్సిన్ శక్తిని కోల్పోతారట’
ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (AIG) చేత హైదరాబాద్లో కోవిడ్ వ్యాక్సిన్లు పొందిన 1,636 మంది ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలపై ఒక సంచలనాత్మక దీర్ఘకాలిక అధ్యయనం, వయస్సుతో పాటు, కోవిడ్కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తి స్థాయిలు కూడా క్షీణిస్తాయని సూచించింది. “మా అధ్యయన ఫలితాలు ఇతర ప్రపంచ అధ్యయనాలతో సమానంగా ఉన్నాయి. ఇక్కడ దాదాపు 30 శాతం మంది వ్యక్తులు 6 నెలల తర్వాత రక్షిత రోగనిరోధక శక్తి స్థాయిల కంటే యాంటీబాడీ స్థాయిలను కలిగి ఉన్నారని… -
‘జనవరి 23 వరకు గరిష్టస్థాయికి థర్డ్ వేవ్’
భారతదేశంలో కోవిడ్19 మహమ్మారి థర్డ్వేవ్ జనవరి 23 వరకు గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని, రోజువారీ కేసులు నాలుగు లక్షల మార్కు కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కాన్పూర్ శాస్త్రవేత్త తెలిపారు. ఢిల్లీ, ముంబై మరియు కోల్కతా గత ఏడు రోజుల్లో కేసుల సంఖ్య ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకున్నాయని ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్, సూత్ర కోవిడ్ మోడల్తో అనుబంధించబడిన పరిశోధకులలో ఒకరైన మనీంద్ర అగర్వాల్ అన్నారు. మహమ్మారి ప్రారంభం… -
కర్ణాటకలో కరోనా బీభత్సం.. కొత్తగా 40,499 కేసులు..
కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కర్ణాటకలో కరోనా మహమ్మారి తగ్గేదేలే అంటోంది. తాజాగా కర్ణాటకలో 40,499 కరోనా కేసులు రాగా, 21 మంది కరోనాతో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 23,209 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా 2,67,650 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గుజరాత్లో 20,966 కొత్త కరోనా కేసులు రాగా, 9,828 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 12 మంది… -
సుజన్రాజు కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుంది : సోమువీర్రాజు
కర్నూలు జిల్లాలోని నంద్యాలలో సుజన్రాజు కుటుంబ సభ్యులను ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు పరామర్శించారు. సుజన్ రాజు కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని, ఆత్మకూరు ఘటన పై నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సోమువీర్రాజు అన్నారు. హిందూ మనోభావాలు గౌరవించే విధంగా ప్రభుత్వ, పోలీసు ల చర్య ఉండాలని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేది రాజకీయ పార్టీ ద్వారా ఏర్పడిన ప్రభుత్వం కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో పోలీసు యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం పునాదులలాంటివన్నారు. పోలీసు, రెవెన్యూ రెండు వ్యవస్థలు గాడి… -
కోవిడ్ బాధితుల కోసం మళ్లీ రంగంలోకి ఎన్టీఆర్ ట్రస్ట్..
కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఒమిక్రాన్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఏపీలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగతూ వస్తున్నాయి. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో పెరుగుతున్నాయి. అయితే గతంలో ఫస్ట్, సెకండ్ వేవ్లలో ఎన్టీఆర్ ట్రస్ట్ కోవిడ్ బాధితులకు సేవలందించింది. ఎంతో మంది కోవిడ్ సోకినవారికి ఉచితంగ మందులు అందించింది. ప్రస్తుతం మళ్లీ కరోనా రక్కసి కోరలు చాస్తున్న క్రమంలో కోవిడ్ బాధితుల కోసం మళ్లీ ఎన్టీఆర్… -
తెలుగు మీడియంపై క్లారిటీ ఇచ్చిన వినోద్ కుమార్
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం అమలుతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ అన్నారు. తెలుగు మీడియం పాఠశాలలు మూతపడతాయనే భయాన్ని పోగొట్టి, తెలుగు మాతృభాష అయినందున ఇంగ్లీషు మీడియం పాఠశాలలకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. యథావిధిగా తెలుగు మీడియం కొనసాగుతుందని ఆయన తెలిపారు. బుధవారం మినిస్టర్స్ క్వార్టర్లో తనను కలిసిన ఎస్సీ, ఎస్టీ మేధావుల ఫోరం ప్రతినిధులతో వినోద్కుమార్ మాట్లాడుతూ.. సాగునీరు, విద్యుత్ రంగాలను అభివృద్దికి… -
తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : మంత్రి ఆదిమూలపు
కరోనా రక్కసి కోరలు చాస్తోంది. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో క్రమక్రమంగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఏపీలో సైతం కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే తెలంగాణ కరోనా ఉధృతి దృష్ట్యాల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అయితే ఏపీలో మాత్రం విద్యాసంస్థలు నడుస్తూనే ఉన్నాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారినపడుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ప్రతి… -
పీఆర్సీ వల్ల జీతాలు పెరగాలి కానీ ఇలా మోసం చేస్తారా : బండి శ్రీనివాసరావు
ఏపీలో పీఆర్సీపై రగడ సాగుతోంది. ఇటీవల సీఎం జగన్ ప్రకటించిన 11 పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాస రావు మాట్లాడుతూ.. రెండో రోజు ముఖ్యమంత్రితో చర్చలు జరుగలేదని, ఆ రోజు మాకు మాట్లాడే అవకాశం రాలేదన్నారు. ముఖ్యమంత్రి పీఆర్సీపై తన ప్రకటన చేసి వెళ్ళి పోయారని, ప్రభుత్వంతో మాకు ఎటువంటి ఒప్పందం లేదని, మేము ఎక్కడా సంతకాలు పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు. పీఆర్సీ… -
దేశంలోనే తొలి గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్.. హైదరాబాద్లో
హైదరాబాద్లోని రాయదుర్గంలో తెలంగాణ స్టేట్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ (టీఎస్ట్రాన్స్కో) ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి గ్యాస్ ఇన్సులేటెడ్ 400 కేవీ సబ్ స్టేషన్ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు త్వరలో ప్రారంభించనున్నారు. హైదరాబాద్ వంటి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చేందుకు అభివృద్ధి చేస్తున్న విద్యుత్ నెట్వర్క్లో భాగంగా ఈ సబ్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, టీఎస్ట్రాన్స్కో, టీఎస్ జెన్కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్రావు, టీఎస్…
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..