కర్నూలు జిల్లాలోని నంద్యాలలో సుజన్రాజు కుటుంబ సభ్యులను ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు పరామర్శించారు. సుజన్ రాజు కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని, ఆత్మకూరు ఘటన పై నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సోమువీర్రాజు అన్నారు. హిందూ మనోభావాలు గౌరవించే విధంగా ప్రభుత్వ, పోలీసు ల చర్య ఉండాలని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేది రాజకీయ పార్టీ ద్వారా ఏర్పడిన ప్రభుత్వం కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో పోలీసు యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం పునాదులలాంటివన్నారు. పోలీసు, రెవెన్యూ రెండు వ్యవస్థలు గాడి…
కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఒమిక్రాన్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఏపీలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగతూ వస్తున్నాయి. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో పెరుగుతున్నాయి. అయితే గతంలో ఫస్ట్, సెకండ్ వేవ్లలో ఎన్టీఆర్ ట్రస్ట్ కోవిడ్ బాధితులకు సేవలందించింది. ఎంతో మంది కోవిడ్ సోకినవారికి ఉచితంగ మందులు అందించింది. ప్రస్తుతం మళ్లీ కరోనా రక్కసి కోరలు చాస్తున్న క్రమంలో కోవిడ్ బాధితుల కోసం మళ్లీ ఎన్టీఆర్…
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం అమలుతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ అన్నారు. తెలుగు మీడియం పాఠశాలలు మూతపడతాయనే భయాన్ని పోగొట్టి, తెలుగు మాతృభాష అయినందున ఇంగ్లీషు మీడియం పాఠశాలలకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. యథావిధిగా తెలుగు మీడియం కొనసాగుతుందని ఆయన తెలిపారు. బుధవారం మినిస్టర్స్ క్వార్టర్లో తనను కలిసిన ఎస్సీ, ఎస్టీ మేధావుల ఫోరం ప్రతినిధులతో వినోద్కుమార్ మాట్లాడుతూ.. సాగునీరు, విద్యుత్ రంగాలను అభివృద్దికి…
కరోనా రక్కసి కోరలు చాస్తోంది. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో క్రమక్రమంగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఏపీలో సైతం కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే తెలంగాణ కరోనా ఉధృతి దృష్ట్యాల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అయితే ఏపీలో మాత్రం విద్యాసంస్థలు నడుస్తూనే ఉన్నాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారినపడుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ప్రతి…
ఏపీలో పీఆర్సీపై రగడ సాగుతోంది. ఇటీవల సీఎం జగన్ ప్రకటించిన 11 పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాస రావు మాట్లాడుతూ.. రెండో రోజు ముఖ్యమంత్రితో చర్చలు జరుగలేదని, ఆ రోజు మాకు మాట్లాడే అవకాశం రాలేదన్నారు. ముఖ్యమంత్రి పీఆర్సీపై తన ప్రకటన చేసి వెళ్ళి పోయారని, ప్రభుత్వంతో మాకు ఎటువంటి ఒప్పందం లేదని, మేము ఎక్కడా సంతకాలు పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు. పీఆర్సీ…
హైదరాబాద్లోని రాయదుర్గంలో తెలంగాణ స్టేట్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ (టీఎస్ట్రాన్స్కో) ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి గ్యాస్ ఇన్సులేటెడ్ 400 కేవీ సబ్ స్టేషన్ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు త్వరలో ప్రారంభించనున్నారు. హైదరాబాద్ వంటి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చేందుకు అభివృద్ధి చేస్తున్న విద్యుత్ నెట్వర్క్లో భాగంగా ఈ సబ్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, టీఎస్ట్రాన్స్కో, టీఎస్ జెన్కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్రావు, టీఎస్…
రానున్న రెండేళ్ళ కాలంలో కాకినాడ శివారు ప్రాంతాలకు తాగునీటి సమస్యను తీరుస్తామని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం ఆయన కాకినాడలో మాట్లాడుతూ.. త్వరలో జరిగే కొన్ని మున్సిపల్ ఎన్నికలకు గ్రామాల విలీన సమస్యలు ఉన్నాయని అన్నారు. దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించారని, వాటికి వేకెట్ చేయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. రోడ్లు అనేవి ఒక నిరంతర ప్రక్రియ. ఒక కొత్త రోడ్డుకు ఐదేళ్ళ నుండి ఏడేళ్ళ వరకు కాల పరిమితి…
ఏపీలో సినిమా టికెట్ల సమస్య ఇంకా సర్దుమనగడం లేదు. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్లను ఆన్లైన్ విధానంలో పొందాలని జీవో 142ను జారీ చేసింది. అంతేకాకుండా టికెట్ల ధరలపై కూడా జీవో 35ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో 35ను సవాల్ చేస్తూ ఇప్పటికే సినిమా నిర్మాతలు, ఎగ్జిబిటర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవోను రద్దు చేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం…
కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను కట్టిడి చేసేందుకు కోవిడ్ టీకాలను పంపిణీ చేస్తోంది. అయితే ఇటీవల 15 నుంచి 18 సంవత్సరాల వయసుగల యువతకు కూడా కోవిడ్ టీకాలు పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో యువత కోవిడ్ టీకాలను తీసుకోవాలంటూ అవగాహన కల్పిస్తోంది. యువతను ఆకర్షించేందుకు ఇనార్బిట్ మాల్లో ఉచిత టీకాను అందజేయనున్నట్లు ఆ మాల్ నిర్వాహకులు వెల్లడించారు. 15-18 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతను…
ఆరాంఘర్ నుండి నెహ్రూ జూలాజికల్ పార్క్ మార్గంలో 4.5 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న, నగరంలో రెండవ అతి పొడవైన ఫ్లైఓవర్ మార్చి 2023 నాటికి ప్రారంభించబడే అవకాశం ఉంది. ప్రస్తుతం పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వే నగరంలో పొడవైన ఫ్లైఓవర్. 636.80 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ (ఎస్ఆర్డీపీ) కింద ఆరు లేన్ల ఫ్లైఓవర్ను నిర్మిస్తున్నారు. ఫ్లై ఓవర్ పనులను బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ పరిశీలించారు.…