ఈసారి కచ్చితంగా మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.. జగన్ 2.O పాలనలో మీకు కావాలనుకుంటున్న విధంగా జగన్ ను చూస్తారంటూ ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఏపీ పాత బీహార్ లా తయారైందని సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన.. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆరోపించారు..
ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు సమావేశం కానున్నారు. కర్నూలు, నంద్యాల చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ భేటీ కానున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ముఖ్య నేతలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మండల ప్రెసిడెంట్లు సమావేశంలో పాల్గొననున్నారు. వైఎస్ జగన్ నిర్వహించే సమావేశంలో కర్నూలు, నంద్యాల జిల్లాల వైసీపీ అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్చార్జ్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ…
MLA Virupakshi: ర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అత్యుత్సాహం ప్రదర్శించాడు. చిప్పగిరిలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణంలో ఏకంగా సీతమ్మ వారికి ఎమ్మెల్యేనే స్వయంగా తాళి కట్టాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కొద్ది రోజుల క్రితం టీడీపీ నేత సంజన్న హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 14న శరీన్ నగర్ లో దారుణ హత్యకు గురయ్యారు. రాజకీయ ఆధిపత్య పోరు హత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా కర్నూలులో టీడీపీ నేత సంజన్న హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరు మందిని అరెస్ట్ చేశారు. వద్దే రామాంజనేయులు, రేవంత్, తులసి, శివకుమార్,…
మనం అన్ని పండుగలనూ ఆనందంగానే జరుపుకుంటాం. హోలీని మరింత సంబరంగా జరుపుకుంటాం. ఎందుకంటే అది వసంతాగమనానికి పీఠిక కాబట్టి. అది ప్రకృతి కొత్త అందాలు నింపుకున్నదనటానికి సూచిక కాబట్టి. ఆమని వచ్చే వేళ రంగురంగులతో ముస్తాబవుతున్న అవనిని చూసి మది మురిసిపోతుంది. ఆ మురిపెంలోనే రంగులు చల్లుకొనాలనిపిస్తుంది.
పోసాని కృష్ణ మురళిని అదుపులోకి తీసుకున్న ఆదోని త్రీ టౌన్ పోలీసులు.. పీటీ వారెంట్ పై తీసుకెళ్తున్నారు.. నిన్న నర్సరావుపేట కోర్టులో పోసానిని హాజరుపరిచారు పోలీసులు.. రిమాండ్ విధించడంతో గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.. ఇక, ఈ రోజు పీటీ వారెంట్ పై ఆదోనికి తీసుకెళ్తున్నారు పోలీసులు.. మొదట రాజంపేట సబ్ జైలు.. ఆ తర్వాత గుంటూరు జైలుకు.. ఇప్పుడు అక్కడి నుంచి కర్నూలు.. ఇలా ఏపీని మొత్తం పోసాని కృష్ణమురళి చుట్టేలా ఉన్నారేమో..
కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. హైకోర్టు బెంచ్ ఏర్పాటు విషయంలో ప్రభుత్వ ప్రతిపాదన సవాలు చేస్తూ దాఖలైన పిల్ పై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.. 28-10-2024 లా సెక్రటరీ హైకోర్టుకి పంపిన లేఖ నిబంధనలకు విరుద్ధమన్నారు పిటిషనర్ న్యాయవాది యోగేష్.. అయతే, బెంచ్ ఏర్పాటుపై తమదే తుది నిర్ణయమని న్యాయస్థానం పేర్కొంది..
V.Hanumantha Rao : సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వీ. హనుమంతరావు (వి.హెచ్) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికార దుర్వినియోగంతో పాటు, రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ప్రతిపక్ష నేతలపై కేసులు బనాయిస్తూ, అధికార పార్టీకి చెందిన నేతలపై చేసిన ఫిర్యాదులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వీహెచ్ మాట్లాడుతూ, 2022 డిసెంబర్ 16న రాహుల్ గాంధీపై దేశ రక్షణకు సంబంధించిన అనుచిత వ్యాఖ్యల కేసు నమోదు చేసి, మార్చి 24న…
‘ఆచార్య దేవోభవ’.. తల్లిదండ్రుల తర్వాత అంతటి గొప్ప స్థానం గురువుకు కట్టబెట్టింది మన దేశం. అయితే ఇటీవల కొంతమంది ఉపాధ్యాయులు తమ వృత్తి ధర్మాన్ని మరచిపోయి ప్రవర్తిస్తున్నారు. విద్యార్థులను వేధింపులకు గురిచేయడం, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ.. ఉపాధ్యాయ వృత్తికి కలంకం తెస్తున్నారు. కీచకోపాధ్యాయులకు దేహశుద్ధి చేసినా ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరి ప్రాథమిక పాఠశాలలో లక్ష్మన్న ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.…
కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు జిల్లా మంత్రాలయం వేదపాఠశాలకు చెందిన విద్యార్థుల వాహనం కర్ణాటకలోని సింధునూరు సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు సహా డ్రైవర్ అక్కడిక్కడే చనిపోయారు. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఓ విద్యార్ధి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని.. కేసు నమోదు చేసుకున్నారు. మంగళవారం రాత్రి మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం సంస్కృత విద్యాపీఠం విద్యార్థులు (14…