కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. తరగతులు ప్రారంభమై వారం గడవక ముందే జూనియర్లకు ర్యాగింగ్ వేధింపులు మొదలయ్యాయి. మీసాలు, గడ్డాలు తీసేసుకోవాలని సీనియర్ల హుకుం చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క
కర్నూలు జిల్లాను మరోసారి యురేనియం భయం పట్టుకుంది. గతంలో ఆళ్లగడ్డ ప్రాంతంలో యురేనియం తవ్వకాల కోసం ప్రయత్నించగా.. స్థానికుల ఆందోళనతో పనులు నిలిపేశారు. తాజాగా, కప్పట్రాళ్లలో యురేనియం నిక్షేపాలు నిర్ధారణ కోసం తవ్వకాలకు అనుమతి లభించిందన్న సమాచారంతో స్థానికుల్లో మళ్లీ ఆందోళన వ్యక్తమవుతోంది. యురేనియం నిక్షేపాల నిర్ధారణ కోసం 68 బోర్ల తవ్వకాలకు కేంద్రం అనుమతి ఇచ్చినట్టు సమాచారం.
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వచ్చిన విషయం తెలుసుకున్న విజయ పాల డైరీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి ఆమెకు కాల్ చేశారు. తన సీటులో ఎలా కూర్చుంటావని అఖిలప్రియను క్వశ్చన్ చేశారు. సిబ్బంది కూర్చోమంటేనే కూర్చుకున్నానని ఆమె సమాధానం ఇచ్చింది.
కర్నూలు జిల్లాలో ఓ వింత పందెం వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చుకునేలా చేసింది. బతికి ఉన్న చేపను మింగాలని సరదాగా స్నేహితులు వేసుకున్న పందెంతో ఓ వ్యక్తి ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. బతికున్న చేపను మింగి వెంకటస్వామి అనే వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.
కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తిలో 10 ఎకరాలు మిరప పంటను ధ్వంసం చేశాడు రైతు షఫీ. మిరప పంటపై 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. అయితే.. మూడు కోతలకు 3 లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశాడు. నాలుగో కోతకు ధర పడిపోయిందని.. దీంతో గిట్టుబాట ధర రాక పంట తొలగించానని రైతు చెబుతున్నాడు.
కర్నూలు జిల్లా పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. డిసెంబర్లో డీఎస్సీ పరీక్షలు అవగానే ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. విశాఖలో లూలు గ్రూప్ వచ్చింది.. బాగా ఉద్యోగాలు వస్తాయని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు.
న్యాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు కేంద్రానికి పంపుతామని సీఎం చంద్రబాబు చెప్పారు. 100 ఎకరాల్లో అమరావతిలో లీగల్ కాలేజ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు.
ఆ మాజీ ఐఎఎస్ పొలిటికల్ ప్లస్సా? మైనస్సా? సింపుల్గా, షార్ట్కట్లో వీలైతే ఎమ్మెల్యే... కుదిరితే మంత్రి కూడా అయిపోయి దర్పం ఒలకబోయాలనుకున్న ఆయన ముంత ఆదిలోనే ఒలికిపోయింది. అటు ఉద్యోగమూ పాయె... ఇటు పదవీ రాకపోయె. ఇప్పుడా అధికారి ఫుల్టైం పొలిటీషియన్ అవుతారా? ఆ నియోజకవర్గంలో వైసీపీని నిలబెట్టే సత్తా ఉందా? జీతపు రాళ్ళకు అలవాటు పడ్డ బాబు... జేబులో నుంచి డబ్బు తీసి కేడర్ కోసం ఖర్చు పెట్టగలరా? ఇంతకీ ఎవరాయన? ఏంటా కథ?
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో తుంగభద్ర డ్యామ్లో కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గేటు విజయవంతమైంది. విరిగిపోయిన గేటు దగ్గర మూడో ఎలిమెంట్ను అమర్చారు. ఇప్పటి వరకు 3 ఎలిమెంట్లను విజయవంతంగా సాంకేతిక నిపుణుల బృందం పూర్తి చేసింది. దీంతో 19వ గేటు నుంచి నీటి వృథాకు అడ్డుకట్ట పడింది.
Minister TG Bharath: కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులోని జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ ను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మూడు సంవత్సరాలలో పూర్తి చేయాల్సిన పరిశ్రమను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో పూర్తవ్వలేదు అన్నారు.