రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనల్ని ప్రజలు ఓడించలేదు.. మనల్ని మనమే ఓడించుకున్నామని కేటీఆర్ తెలిపారు. మనం కూడా జై శ్రీరామ్ అందాం.. రాముడు అందరివాడు.. రాముడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కూడా కాదన్నారు. కరీంనగర్ జిల్లాకు ఏం చేశారో చర్చకు సిద్ధమా అని బండి సంజయ్ కు కేటీఆర్ సవాల్ విసిరారు. కరీంనగర్ లో…
BRS KTR: నేడు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. వేములవాడ, మానకొండూర్, కరీంనగర్, చొప్పదండి నియోజక వర్గాల్లో కేటీఆర్ పర్యటించనున్నారు.
BRS KTR: బీఆర్ఎస్ లోనే తనకు గౌరవం ఉండేదని పార్టీ మారిన తర్వాత ఈటల రాజేందర్ చెప్పిన మాటను గుర్తుంచుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
BRS Foundation Day: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏప్రిల్ 27న ఆవిర్భవించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ నేడు 23వ ఆవిర్భావ దినోత్సవానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యకర్తలు, నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు.
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని పథకాలను నిలిపివేస్తారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు బుధవారం అన్నారు. ఎందుకంటే, తాను ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలు చేయకున్నా రేవంత్రెడ్డికి ప్రజలు ఓట్లు వేస్తారని భావించి ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. ఎస్ నిజామాబాద్లో బాజిరెడ్డి గోవర్ధన్కు ఓటు వేయాలని కేటీఆర్ ప్రజలను కోరారు. బీఆర్ఎస్ మల్కాజిగిరి అభ్యర్థి రాగిడి లక్ష్మా రెడ్డి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా జరిగిన రోడ్షోలో…
కాళేశ్వరం విషయంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఎన్టీవీ నిర్వహించిన క్వశ్చన్ అవర్ లో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏడాదికి కరెంట్ బిల్లే రూ.10 వేల కోట్లు అవుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి పరీక్షలు కూడా చేయలేదని విమర్శించారు.
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. కొంతకాలం క్రితం వరకు ధీమాగా ఉన్న రైతాంగం ప్రస్తుతం దిగాలు పడుతోందని కేసీఆర్ అన్నారు.
మామా అల్లుళ్లు తోక తెగిన బల్లుల్లా ఎగిరిపడుతున్నారని..అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ నిన్న నాలుగు గంటలు టీవీ స్టుడియోలో ఎలా కూర్చున్నాడని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ మందేసి గీశాడో.. దిగాక గేసాడోగానీ కూలిపోయిందని విమర్శించారు.