Monsoon: రుతుపవనాలపై ఐఎండీ శుభవార్త.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- రుతుపవనాలపై ఐఎండీ శుభవార్త
- రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వెల్లడి
- భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రుతుపవనాలపై కేంద్ర వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది. బుధవారం పశ్చిమ తీర ప్రాంతాలు.. మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా ఎండల తీవ్రత కొనసాగుతుందని హెచ్చరించింది.
ఐఎండీ అంచనాల ప్రకారం.. కొంకణ్-గోవా, తీర కర్ణాటక, అస్సాం-మేఘాలయ, ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే బీహార్, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, మరాఠ్వాడా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా కొంకణ్-గోవా, తీర కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశముంది. గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్న తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కొనసాగనుంది.
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. బీహార్లో కొన్ని ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నప్పటికీ.. తూర్పు ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో మాత్రం వడగాల్పుల పరిస్థితులు కొనసాగనున్నాయి. అక్కడక్కడ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. దేశంలోని పశ్చిమ తీర ప్రాంతాలు, దక్షిణ భారత రాష్ట్రాలు, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో ఈ వారం మొత్తం రుతుపవనాలు చురుగ్గా కొనసాగనున్నాయని ఐఎండీ అంచనా వేసింది. కొంకణ్-గోవా, కేరళ, తీర కర్ణాటక, తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగుతాయని.. అస్సాం, మేఘాలయ, సిక్కిం, పశ్చిమ బెంగాల్లో కూడా తరచుగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాబోయే రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాతావరణ పరిస్థితులు కొనసాగనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!