తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ కో కి అభినందనలు తెలిపింది. అయితే కరోనా సెకండ్ వేవ్ లో అత్యధికంగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. కానీ ఈ సమయంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ లో పరిస్థితి మెరుగ్గా ఉంది అని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ఆక్సిజన్ దొరకక చనిపోయిన వాళ్ళు లేరు అని అన్నారు. మొత్తం వెయ్యి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు తెప్పించింది గ్రీన్ కో… అందులో మొదటి 200 తెలంగాణ కి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు…
తెలంగాణ మంత్రులు చేసిన వాఖ్యలపై ఈటల ఫైర్ అయ్యారు. ఐఏఎస్ అధికారులు దారుణంగా విచారణ చేశారు.. నాకు నోటీసులు కూడా ఇవ్వలేదు.. దేశ చరిత్రలో ఇలాంటి కుట్ర పూరితంగా ఎవరూ వ్యవహరించ లేదని మండిపడ్డారు. వ్యక్తులు ఉంటారు, పోతారు కానీ.. ధర్మము ఎక్కడికి పోదు ప్రభుత్వం దుర్మార్గముగా వ్యవహరిస్తోందన్నారు. సీఎం కెసిఆర్ చట్టాన్ని, ధర్మాన్ని, చివరికి ఉద్యమాన్ని కూడా అమ్ముకున్నాడని..పార్టీకి వ్యతిరేక పనులు నేనెప్పుడూ చేయలేదన్నారు ఈటల. నేను ముఖ్యమంత్రి కావాలని అనుకోలేదు..నాపై విమర్శలు సరికాదని పేర్కొన్నారు.…
అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘జాతిరత్నాలు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించింది. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సాధారణ ప్రేక్షకులు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ‘జాతిరత్నాలు’ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రేక్షకులతో పాటు సెలెబ్రిటీలు సైతం సినిమాపై పొగడ్తల వర్షం కురిపించారు. తాజాగా తెలంగాణ మంత్రి కేటిఆర్ ‘జాతి రత్నాలు’ చిత్రంపై ప్రశంసలు…
బీజేపీ నేతలకు సవాల్ విసిరారు టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించిన ఆయన.. తెలంగాణలో మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం పట్టించుకోలేదు.. అందుకే ఐటీఐఆర్ రద్దు అంటున్నారు.. మరి బెంగుళూరులో ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. 2014 నుండి మేం కేంద్ర మంత్రులను కలుస్తున్నామన్న ఆయన.. అనేక సార్లు లేఖలు ఇచ్చామని గుర్తు చేసుకున్నారు.. మేం చెప్పేదంట్లో తప్పు ఉంటే చెప్పండి ఎక్కడికి అయినా వచ్చి మాట్లాడటానికి…
ఇక నుంచి మనం టెన్షన్ పడడం కాదు.. సీఎం కేసీఆర్కు టెన్షన్ పెడదాం.. కసితో పనిచేయండి అంటూ గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ కార్పొరేటర్లకు పిలుపునిచ్చారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ గ్రేటర్ కార్పొరేటర్లతో సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు కేసీఆర్, మంత్రులు ఇంకా అబద్ధాలు చెబుతూనే ఉన్నారని మండిపడ్డారు.. దుబ్బాకలో ప్రజలు ఓడించినా కేసీఆర్కు బుద్ధి రాలేదన్న ఆయన.. కేసీఆర్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది.. సీఎంగా…