కొత్త కమిటీల నిర్మాణంపై కేటీఆర్ సమీక్ష… కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్టీ నిర్మాణం, గ్రామ, వార్డు స్థాయి నుంచి కొత్త కమిటీల ఏర్పాటుపై ఫోకస్ పెట్టింది టీఆర్ఎస్ పార్టీ.. ఇప్పటికే పలు సందర్భాల్లో పార్టీ కమిటీల విషయంలో టీఆర్ఎస్ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు.. పార్టీ సంస్థాగత కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. జనరల్ సెక్రటరీలు ఇంఛార్జ్లుగా ఉన్న నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.. గత రెండు వారాలుగా జరుగుతున్న కమిటీల నిర్మాణంపై సమీక్ష చేశారు. అయితే, ఇప్పటికే దాదాపుగా 80 శాతం పైగా గ్రామ కమిటీల నిర్మాణ వివరాలు అందజేశారు జనరల్ సెక్రటరీలు.
ఈ సందర్భంగా కీలక సూచలను చేశారు కేటీఆర్.. ఈనెల 15వ తేదీ నాటికి అన్ని గ్రామ కమిటీల నిర్మాణం పూర్తి చేసి ఆ వివరాలను కేంద్ర పార్టీ కార్యాలయానికి అందించాలని జనరల్ సెక్రటరీలను ఆదేశించారు.. ఈనెల 20వ తేదీ నాటికి అన్ని మండల కమిటీలు నిర్మాణం పూర్తికావాలన్న ఆయన.. మండల కమిటీల నిర్మాణం పూర్తయిన వెంటనే జిల్లా అధ్యక్షుల ఎంపికను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటిస్తారని తెలిపారు.. జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తయిన తర్వాత జిల్లా కమిటీల ఏర్పాటుపైన జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు, మంత్రులు, పార్టీ సీనియర్ నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని జిల్లా కమిటీల నిర్మాణం పూర్తిచేస్తామన్న ఆయన.. పార్టీ కమిటీల నిర్మాణానికి సంబంధించి వారం రోజుల్లో మరోసారి సమీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు.
Also Read
- Tags
- hyderabad
- ktr
- KTR Review
- telangana
- TRS
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!