తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ తర్వాత సీఎం ఎవరన్నదానిపై ప్రచారం సాగుతుంది. ఇప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు మొగ్గు చూపుతుండటంతో.. అటు నేతలతో పాటు ఇటు ప్రజల్లో కూడా ఓ ప్రశ్నగా మారిపోయింది. ఇప్పుడు తాజాగా తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. తన మనసులోని మాటను వెల్లగక్కారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం అవుతారని తెలిపారు.
Irrigation Day: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి దినోత్సవ వేడుకలు మొదలయ్యాయి. రాష్ట్ర దశాబ్ది వేడుకల్లో భాగంగా నేడు నీటిపారుదల దినోత్సవాన్ని నిర్వహించనున్నారు.
Minister KTR: నేడు ములుగు జిల్లాలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పర్యటించనున్నారు. 150 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కేటీఆర్ చేయనున్నారు.
Bhatti vikramarka: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నేడు నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం సిద్దాపూర్ గ్రామ శివారులోని మర్లపాడ్ తండాకు చేరుకున్న సందర్భంగా రోడ్డు పక్కనే గ్రామస్తులు మూడవత్ రెడ్యానాయక్, హనుమంతు నాయక్, బొజ్యానాయక్, జగన్ నాయక్, సత్య నాయక్, రాంలీ నాయక్, రమేష్ .. భట్టి విక్రమార్కకు స్వాగతం పలికారు.
కేసీఆర్ అతని కుటుంబ సభ్యులు నలుగురికి ఉద్యోగాలు కల్పించి రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం మరిచారు అంటూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విమర్శలు గుప్పించాడు.
Metro facility: తమ ప్రాంతాలకు హైదరాబాద్ మెట్రోరైలు సౌకర్యం కల్పించాలని రంగారెడ్డి, మేడ్చల్ ప్రజాప్రతినిధులు మంత్రి కేటీఆర్ ను కోరుతున్నారు. ఎల్బీనగర్-రామోజీ ఫిల్మ్ సిటీ, ఎల్బీనగర్-తుర్కయాంజాల్-ఆదిభట్ల-కొంగరకలాన్, ఉప్పల్-బోడుప్పల్-ఫిర్జాదిగూడ, మియాపూర్-పటాన్చెరు రూట్లలో మెట్రో రైలు ప్రాజెక్టును వేగంగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
BJP Reverse Gear: బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది వేడుకలకు వ్యతిరేకంగా బీజేపీ అనేక కార్యక్రమాలు (కౌంటర్ ప్రోగ్రామ్లు) నిర్వహించేందుకు సిద్ధమైంది. 21 రోజుల పాటు వివిధ అధికారిక కార్యక్రమాలపై శాఖలు, శాఖల వారీగా ప్రతికూల ప్రచారం (నెగటివ్ క్యాంపెయిన్) నిర్వహించాలని, నిరసనలతో (రివర్స్ గేర్) కేసీఆర్ ప్రభుత్వ తీరును తిప్పికొట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
KTR: మంచి పనితీరు కనబర్చినవారికే ఎమ్మెల్యే టికెట్లు కేటాయిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు పనితీరు మెరుగుపర్చుకోవాలని సీఎం అంటున్నారని గుర్తు చేశారు. ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉందని కేటీఆర్అన్నారు.
రెజర్ల నిరసనలపై స్పందించాలంటూ మీడియా ప్రశ్నించిన టైంలో కేంద్రమంత్రి మీనాక్షి లేఖి అక్కడ నుంచి పరుగుల తీసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై కాంగ్రెస్ నేతలు ఘాటుగా రియాక్ట్ అయింది. ఈ ఇష్యూపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా రీట్వీట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Bandi sanjay: ఓ సెక్షన్ మీడియా చేస్తున్న ప్రచారం తప్ప మాకు ఎలాంటి విభేదాలు లేవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ భవనం ప్రారంభం - రాష్ట్రపతి ఆహ్వానం వివాదం పై ఆయన స్పందించారు.