KTR-Harish Rao: నేడు సిద్దిపేటలో కేటీఆర్, హరీశ్రావు పర్యటన.. ఐటీ టవర్ ప్రారంభించనున్న మంత్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR-Harish Rao: నేడు సిద్దిపేట పట్టణంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు పర్యటించనున్నారు. ముందుగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 గంటలకు కొద్దిసేపు విశ్రాంతి అనంతరం 10.30 గంటలకు పట్టణ శివారులోని ఇర్కోడు గ్రామంలో ఆధునిక కబేళాను ప్రారంభిస్తారు. ఉదయం 11 గంటలకు సిద్దిపేట పట్టణంలో బిటి, సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు. 11.15 గంటలకు నర్సాపూర్లోని కప్పా లకుంట సుందరీకరణ పనులకు శంకుస్థాపన, 11.45 గంటలకు పట్టణంలో తాగునీటి సరఫరా పనులకు శంకుస్థాపన చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు స్వచ్ఛ బడిని సందర్శించి, 12.30 గంటలకు సిద్దిపేట జిల్లా కేంద్రం సమీపంలోని నాగులబండలో నిర్మించిన ఐటీ టవర్ను ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో మంత్రులు పాల్గొంటారు.
Read laso: Marri Janardhan Reddy: 150 కోట్లు ట్యాక్స్ కట్టాను.. పూర్తి వివరాలతో మీడియా ముందుకు వస్తా
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
ఈ నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం సీపీ శ్వేతతో కలిసి కలెక్టర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముందుగా సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడులో నిర్మించిన ఆధునిక కబేళా, కోటిలింగాల ఆలయం వద్ద సీసీ రోడ్ల శంకుస్థాపన, కప్పలగుంట చెరువు, గడ్డబొమ్మ వద్ద ఏర్పాట్లను, స్వచ్ఛబాది ఏరియా, ఐటీ టవర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మంత్రులు కేటీఆర్, హరీశ్రావులు తొలుత రూ. 6 కోట్లతో నూతనంగా నిర్మించిన ఆధునిక స్లాటర్ హౌస్ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా సిద్దిపేట పట్టణంలో రూ. 20 కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన చేయడంతో పాటు నర్సాపూర్లోని కప్పలకుంట చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
మున్సిపాలిటీలో తాగునీటి సరఫరా కొనసాగింపునకు శంకుస్థాపన చేయడంతో పాటు పట్టణంలోని స్వచ్ఛ బూదిని సందర్శించనున్నట్లు తెలిపారు. సిద్దిపేట పట్టణ శివారులోని నాగుల బండ వద్ద రూ.63 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్ పక్కన సుమారు పది వేల మందితో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. ఇందులో 750 మంది స్థానిక యువకులకు ఉద్యోగాలు ఇవ్వనున్నారు. మంత్రి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు మచ్చా వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
Earthquake: ఫిలిప్పీన్స్ లో భూకంపం..
తాజావార్తలు
-
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
-
Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!