KTR-Harish Rao: నేడు సిద్దిపేటలో కేటీఆర్, హరీశ్రావు పర్యటన.. ఐటీ టవర్ ప్రారంభించనున్న మంత్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR-Harish Rao: నేడు సిద్దిపేట పట్టణంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు పర్యటించనున్నారు. ముందుగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 గంటలకు కొద్దిసేపు విశ్రాంతి అనంతరం 10.30 గంటలకు పట్టణ శివారులోని ఇర్కోడు గ్రామంలో ఆధునిక కబేళాను ప్రారంభిస్తారు. ఉదయం 11 గంటలకు సిద్దిపేట పట్టణంలో బిటి, సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు. 11.15 గంటలకు నర్సాపూర్లోని కప్పా లకుంట సుందరీకరణ పనులకు శంకుస్థాపన, 11.45 గంటలకు పట్టణంలో తాగునీటి సరఫరా పనులకు శంకుస్థాపన చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు స్వచ్ఛ బడిని సందర్శించి, 12.30 గంటలకు సిద్దిపేట జిల్లా కేంద్రం సమీపంలోని నాగులబండలో నిర్మించిన ఐటీ టవర్ను ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో మంత్రులు పాల్గొంటారు.
Read laso: Marri Janardhan Reddy: 150 కోట్లు ట్యాక్స్ కట్టాను.. పూర్తి వివరాలతో మీడియా ముందుకు వస్తా
Also Read
- Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
- Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
- TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
ఈ నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం సీపీ శ్వేతతో కలిసి కలెక్టర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముందుగా సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడులో నిర్మించిన ఆధునిక కబేళా, కోటిలింగాల ఆలయం వద్ద సీసీ రోడ్ల శంకుస్థాపన, కప్పలగుంట చెరువు, గడ్డబొమ్మ వద్ద ఏర్పాట్లను, స్వచ్ఛబాది ఏరియా, ఐటీ టవర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మంత్రులు కేటీఆర్, హరీశ్రావులు తొలుత రూ. 6 కోట్లతో నూతనంగా నిర్మించిన ఆధునిక స్లాటర్ హౌస్ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా సిద్దిపేట పట్టణంలో రూ. 20 కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన చేయడంతో పాటు నర్సాపూర్లోని కప్పలకుంట చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
మున్సిపాలిటీలో తాగునీటి సరఫరా కొనసాగింపునకు శంకుస్థాపన చేయడంతో పాటు పట్టణంలోని స్వచ్ఛ బూదిని సందర్శించనున్నట్లు తెలిపారు. సిద్దిపేట పట్టణ శివారులోని నాగుల బండ వద్ద రూ.63 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్ పక్కన సుమారు పది వేల మందితో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. ఇందులో 750 మంది స్థానిక యువకులకు ఉద్యోగాలు ఇవ్వనున్నారు. మంత్రి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు మచ్చా వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
Earthquake: ఫిలిప్పీన్స్ లో భూకంపం..
తాజావార్తలు
-
Sujeeth: సైలెంట్గా పని కానిచ్చేస్తున్న స్టార్ డైరెక్టర్..
-
Supreme Court: 9వ తరగతిలో మూడో భాష రుద్దొద్దు.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
-
Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
-
Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!