ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న కోటి దీపోత్సవం ఏడో రోజుకు చేరింది.. వరుసగా ఆరు రోజుల కోటి దీపోత్సవం వైభవంగా సాగగా.. ఇవాళ ఏడో రోజు కన్నుల పండుగగా నిర్వహించేందుకు రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ సన్నద్ధమైంది.. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవానికి భక్తులు వివిధ ప్రాంతాలనుంచి తరలివస్తున్నారు. అందరి దేవుళ్లను, అన్ని ఆలయాలను ఒకేచోట చూసే భాగ్యం భక్తులకు కలుగుతోంది. Read Also: Munugode Bypoll Results Live Updates: మునుగోడు ఫలితాలు లైవ్…
భక్తి టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం అంగరంగ వైభవంగా సాగుతోంది. గత నెల 31న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆరో రోజుకు చేరింది. ఈనెల 14వ తేదీ వరకు భక్తి టీవీ కోటిదీపోత్సవం కొనసాగనుంది.
భక్తి టీవీ కోటి దీపోత్సవం ఐదో రోజు అంగరంగ వైభవంగా సాగింది. అక్టోబర్ 31న ప్రారంభమైన ఈ మహాక్రతువు ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగనుంది. ఐదో రోజు కోటిదీపోత్సవం కార్యక్రమానికి తెలంగాణ మంత్రి హరీష్రావు దంపతులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోటి దీపోత్సవంలో భాగంగా ముందుగా శ్రీ స్మరణానంద గిరి స్వామీజీ ఆధ్వర్యంలో అనుగ్రహ భాషణం జరిగింది. అనంతర బ్రహ్మశ్రీ డా.మైలవరపు శ్రీనివాసరావు గారిచే ప్రవచనామృతం జరిగింది. శివలింగాలకు కోటి భస్మార్చన భక్తులచే జరిపించారు.…
భక్తి టీవీ కోటి దీపోత్సవం నాల్గోరోజు కన్నులపండుగగా సాగింది.. అక్టోబర్ 31వ తేదీన ప్రారంభమైన ఈ మహాక్రతువు ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగనుండగా.. ఇవాళ నాల్గోరోజు దీపాల ఉత్సవం కోలాకలంగా సాగింది… శ్రీసుబుదేంద్ర తీర్థ స్వామీజీ (శ్రీరాఘవేంద్ర మఠం, మంత్రాలయం) వారిచే అనుగ్రహ భాషణం.. బ్రహ్మ శ్రీ డా.కాకునూరి సూర్యనారాయణమూర్తిచే ప్రవచానమృతం.. వేదికపై పూజలో భాగంగా నర్మదా బాణ లింగానికి కోటి భస్మాభిషేకం నిర్వహించారు.. శివలింగాలకు కోటి భస్మార్చన భక్తులచే జరిపించారు.. ఇక, యాదాద్రి…
భక్తి టీవీ-ఎన్టీవీ ఆధ్వర్యంలో జరుగుతోన్న కోటిదీపోత్సవం నాల్గో రోజుకు చేరింది. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం భక్తులతో కిక్కిరిసిపోయింది… శివనామస్మరణతో పరిసర ప్రాంతాలు మార్మోగుతున్నాయి.. కార్తిక మాసంలో జరుగుతోన్న దీపాల ఉత్సవంలో ఉత్సాహంగా పెద్ద సంఖ్యలు పాల్గొంటున్నారు భక్తులు.. ఇవాళ పార్థివలింగానికి కోటి భస్మార్చన జరగనుంది… ఇక, వేములవాడ రాజరాజేశ్వర స్వామి కల్యాణం.. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కల్యాణం నిర్వహించనున్నారు.. భక్తులకు పూజా సామాగ్రిని కూడా ఉచితంగా అందజేస్తోంది భక్తి టీవీ… ఎన్టీఆర్ స్టేడియానికి కదలి రండి..…
కార్తిక మాసం వచ్చిందంటే చాలు.. అందరూ ఎన్టీవీ-భక్తిటీవీ ఆధ్వర్యంలో నిర్వహించి కోటిదీపోత్సవం గురించి చూస్తుంటారు.. గత మూడు రోజులుగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా కన్నుల పండువగా కోటి దీపాల ఉత్సవం సాగుతోంది.. ఈ కోటి దీపోత్సవానికి భక్తులు పోటెత్తుతున్నారు… శివనామస్మరణతో ఎన్టీఆర్ స్టేడియం, పరిసర ప్రాంతాలు మార్మోగుతున్నాయి.. ఇవాళ కార్తీక బుధవారం సందర్భంగా ‘ప్రదోషకాల అభిషేకం’ నిర్వహించారు.. డాక్టర్ ఎన్. అనంతలక్ష్మీ గారి ప్రవచనామృతం భక్తులను ఆకట్టుకుంది.. కాజీపేట శ్వేతార్కమూల గణపతికి కోటి గరికార్చన జరగగా..…