Father Property: తండ్రి ఆస్తులు అన్నీ కొడుకువి కావు.. సంచలన తీర్పు ఇచ్చిన హైకోర్టు..
- సంచలన తీర్పు ఇచ్చిన కేరళ హైకోర్టు..
- తండ్రి స్వార్జిత ఆస్తిపై వారసత్వ హక్కు ఉండదు..
- తండ్రి ఇష్టానుసారం ఎవరికైనా ఇచ్చే అధికారం..
హిందూ వారసత్వ చట్టం, ఆస్తి హక్కుల విషయంలో ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా తండ్రి సంపాదించిన ప్రతీ పైసా, ప్రతీ గజం స్థలం ఆటోమేటిక్ గా కొడుకుకు దక్కుతుందని చాలామంది భావిస్తుంటారు. కానీ.. చట్టం దృష్టిలో ‘వారసత్వ ఆస్తి’కి, ‘స్వార్జిత ఆస్తి’కి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఇదే అంశంపై కేరళ హైకోర్టు తాజాగా ఒక సంచలన తీర్పును వెలువరించింది. తండ్రి కష్టార్జితంపై కొడుకుకు ఉండే హక్కుల విషయంలో న్యాయస్థానం కీలక స్పష్టత ఇచ్చింది.
కేరళ హైకోర్టు ధర్మాసనం తన తీర్పులో అత్యంత ముఖ్యమైన విషయాన్ని చెప్పింది. తండ్రి తనంతట తానుగా.. సొంత కష్టార్జితంతో సంపాదించిన ఆస్తిపై కొడుకుకు ఎటువంటి సహజసిద్ధమైన లేదా జన్మహక్కు ఉండదు. ఆ ఆస్తిని ఎవరికి ఇవ్వాలి, ఎవరికి అమ్మాలి లేదా ఎవరికి బహుమతిగా ఇవ్వాలి అనే పూర్తి అధికారం ఆ తండ్రికి మాత్రమే ఉంటుంది. తన ఆస్తిని కొడుకుకు ఇవ్వకుండా నిరాకరించే హక్కు కూడా తండ్రికి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
Also Read
- Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
- White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
- TG EAPCET-2026 : షెడ్యూల్ విడుదల.. హాల్ టికెట్ల డౌన్లోడ్ ఎప్పుడంటే.?
- Free Bus Journey: సమ్మె వేళ వారికి భారీ ఊరట.. పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం..
తాత ముత్తాతల నుంచి వారసత్వంగా తండ్రికి వచ్చిన ఆస్తిపై కొడుకులకు హక్కు ఉంటుంది. దీనిని వారు జన్మహక్కుగా క్లెయిమ్ చేయవచ్చు. స్వార్జిత ఆస్తి అంటే.. తండ్రి తన ఉద్యోగం, వ్యాపారం లేదా సొంత వనరులతో కొనుగోలు చేసిన ఆస్తి. దీనిపై తండ్రి బ్రతికి ఉన్నంత కాలం పిల్లలకు ఎటువంటి హక్కు ఉండదు. తండ్రి తన ఇష్టప్రకారం దీనిని ఎవరికైనా రాసివ్వవచ్చు.
Also Read:Hyderabad: పాతబస్తీలో అదృశ్యమైన యువకుడు.. బావిలో కుళ్లిపోయి ఇలా.. ఏం జరిగిందంటే..
కేరళలో ఒక వ్యక్తి తన తండ్రికి చెందిన 46 సెంట్ల భూమి విషయంలో కోర్టును ఆశ్రయించాడు. ఆ ఆస్తి తన తండ్రిది కాబట్టి అది తనకే చెందాలని, కానీ తన తల్లి ఆ ఆస్తిని మరో ఐదుగురు కుటుంబ సభ్యులకు పంచేలా వీలునామా రాసిందని అతను వాదించాడు. అయితే.. విచారణలో ఆ 46 సెంట్ల భూమి తండ్రికి వారసత్వంగా రాలేదని, ఆయన స్వయంగా సంపాదించిన ఆస్తి అని తేలింది.
దీంతో.. ఆ ఆస్తిపై కొడుకుకు ప్రత్యేక హక్కు లేదని కోర్టు తేల్చి చెప్పింది. తండ్రి తన స్వార్జిత ఆస్తిని తన భార్యకు (తల్లికి) బహుమతిగా ఇవ్వడం లేదా ఆమె ద్వారా ఇతరులకు వీలునామా రాయించడం చెల్లుబాటు అవుతుందని హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో ఆస్తి పంపకాల విషయంలో తండ్రి నిర్ణయమే అంతిమమని మరోసారి రుజువైంది.
తాజావార్తలు
-
Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. ‘మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం’.. అంటూ ఆగ్రహం!
-
TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన
-
Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్
-
CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..
-
Katte Pongali Recipe : టెంపుల్ స్టైల్ కట్టె పొంగలి రహస్యం ఇదే.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు.!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?