Kotideepotsavam 2022: ఐదవ రోజుకి చేరిన కోటి దీపోత్సవం.. ఈ రోజు ఏముంటాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం ఐదవ రోజుకి చేరుకుంది.. కార్తిక శుద్ధ ఏకాదశి కావడంతో ఇవాళ భక్తులు భారీగా తరలిరానున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవానికి భక్తులు వివిధ ప్రాంతాలనుంచి తరలివస్తున్నారు. అందరి దేవుళ్లను, అన్ని ఆలయాలను ఒకేచోట చూసే భాగ్యం భక్తులకు కలుగుతోంది.

Also Read
- Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
- Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
అనుగ్రహ భాషణంలో భాగంగా శ్రీ స్మరణానంద గిరి స్వామీజీ (వైస్ ప్రెసిడెంట్ యోగదా సత్సంగ సొసైటీ, రాంచీ)
శ్రీ సర్వవిదానంద సరస్వతి స్వామీజీ (ఆర్ష విద్యా గురుకులం, హైదరాబాద్)
వెనరెబుల్ బిక్కు సంఘ పాల (మహాబోధి బుద్ధ విహార, హైదరాబాద్) వుంటుంది
బ్రహ్మ శ్రీ డా.మైలవరపు శ్రీనివాసరావు గారిచే ప్రవచనామృతం ఉంటుంది
విజయవాడ శ్రీ కనకదుర్గమ్మకు కోటి గాజుల అర్చన వేదిక పూజ కార్యక్రమంలో వుంటుంది
అంతేకాకుండా శ్రీ కనకదుర్గమ్మకు కోటి గాజుల అర్చన భక్తులు స్వయంగా చేసే అద్భుత అవకాశం కలుగుతుంది
ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు
ఈరోజు సింహ వాహనం సేవ ఉంటుంది. వీటితో పాటు సకల శుభాలను కలిగించే సప్త హారతి ఉంటుంది.

కోటి దీపోత్సవం గురువారం 4వ రోజు అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు వేలాదిమంది తరలిరావడంతో ఎన్టీఆర్ స్టేడియం భక్త జనసంద్రంగా మారింది. అక్టోబర్ 31వ తేదీన ప్రారంభమైన ఈ మహాక్రతువు ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగనుండగా.. ఇవాళ నాల్గోరోజు దీపాల ఉత్సవం కోలాహలంగా సాగింది… శ్రీసుబుదేంద్ర తీర్థ స్వామీజీ (శ్రీరాఘవేంద్ర మఠం, మంత్రాలయం) వారిచే అనుగ్రహ భాషణం.. బ్రహ్మ శ్రీ డా.కాకునూరి సూర్యనారాయణమూర్తిచే ప్రవచానమృతం.. వేదికపై పూజలో భాగంగా నర్మదా బాణ లింగానికి కోటి భస్మాభిషేకం నిర్వహించారు.. శివలింగాలకు కోటి భస్మార్చన భక్తులచే జరిపించారు.
యాదాద్రి శ్రీలక్ష్మీనృసింహ స్వామి పరిణయోత్సవం, వేముల వాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి కల్యాణం వైభవంగా సాగింది.. ఇవాళ వాహనసేవలో భాగంగా అశ్వవాహనం, పల్లకి సేవ నిర్వహించారు. భక్తుల కోలాహలం మధ్య నాల్గవ రోజు కోటి దీపోత్సవం నేత్రానందం కలిగించింది. రండి.. తరలిరండి.. భక్తి టీవీ కోటిదీపోత్సవం ప్రాంగణానికి తరలివచ్చి ఆ పరమశివుని కృపకు పాత్రులు కండి.. ఎన్టీవీ, భక్తిటీవీ, వనిత టీవీ కుటుంబం భక్తులను సాదరంగా ఆహ్వానిస్తోంది.
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!