Vijayendra Prasad Visits Dhokka Seethamma House: అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలోని అపర్ణ అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి ఇంటిని సందర్శించారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి, రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ రచయిత-దర్శకుడు విజయేంద్ర ప్రసాద్. పి.గన్నవరం మండలం లంకల గన్నవరం గ్రామంలో ఉన్న డొక్కా సీతమ్మ ఇంటిని విజయేంద్ర ప్రసాద్ సందర్శించి, ఆమె వాడిన వస్తువులను పరిశీలించారు. సీతమ్మ చేసిన సేవలను తెలుసుకొని, ఆమెకు నివాళులు అర్పించారు. Read Also: Brian Bennett: క్యాచ్…
Strange Police Complaint: పెంపుడు జీవులు అంటే ఇష్టం ఎవరికి ఉండదు చెప్పండి. కొందరికి కుక్కలు అంటే ఇష్టం ఉండవచ్చు, మరికొందరికి మరొక జీవి అంటే ప్రేమ ఉండవచ్చు. నిజానికి ఆ జంతువులు అంటే వాటి యజమానులకు వల్లమాలిన ప్రేమ ఉంటుంది. వాటిని తమ కుటుంబంలో భాగంగా చూసుకుంటారు. ఒకవేళ వాటికి ఏమైనా అయితే తట్టుకోవడం చాలా కష్టం. ఇలా పెంపుడు జంతువులను పెంచుకునే కుటుంబాల్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాటితో ప్రత్యేక…
Pawan Kalyan: డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఇరుసుమండ గ్రామంలో జరిగిన బ్లో అవుట్ ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. ఈ ఘటన వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని జిల్లా కలెక్టర్తో పాటు రాజోలు ఎమ్మెల్యేకు స్పష్టమైన సూచనలు చేశారు.ఇరుసుమండ గ్రామ పరిధిలోని మోరి నంబర్ 5 ఓఎన్జీసీ (ONGC) సైట్లో గ్యాస్ లీక్ కారణంగా చోటు చేసుకున్న బ్లో అవుట్ ప్రభావంపై జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్తో ఫోన్లో…
AP Crime: ఆంధ్రప్రదేశ్లో మరో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురంలో 5వ తరగతి విద్యార్థిని మృతి చెందింది.. స్థానిక భాష్యం పబ్లిక్ స్కూల్లో చదువుతున్న ఐదో తరగతి విద్యార్థిని రంజిత (10) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందింది. ఈ ఘటన రామచంద్రపురంలో తీవ్ర విషాదాన్ని నింపింది.. రంజిత తన గదిలో ఉరివేసుకున్నట్టు తల్లిదండ్రులకు సమాచారం అందినప్పటికీ, తల్లి సునీత మాత్రం ఇది ఆత్మహత్య కాదని, ఎవరో చంపి ఫ్యాన్కి వేలాడదీశారని…
Students Carry Tent Equipment: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు.. మలికిపురం మండలం బట్టేలంక హై స్కూల్లో చోటుచేసుకున్న సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ఒక రోజు ఆటల పోటీలు నిర్వహించే క్రమంలో, స్కూల్ టీచర్లు విద్యార్థుల చేత టెంట్ సామాన్లు మోయించారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. Read Also: New York Mayor Elections: ట్రంప్కు భారీ…
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఊడిమూడి శివారు చింతావారి పేట సమీపంలో పంటకాలువలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో భార్య, ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. భర్త ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు.