తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ కోమటిరెడ్డి వెంకటె రెడ్డి కలకలం తీవ్రమవుతోంది. పీసీసీ ఆదేశాలను పట్టించుకోకుండా ఆయన వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళనానికి వెళ్లడం.. ఆ తర్వాత పీసీసీపైనే.. నిద్రపోతోందా.. అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించడం చూస్తుంటే.. ఆయన తాడో పేడో తేల్చుకోవడానికే సిద్ధమైనట్టు కనిపిస్తున్నారు. కాకుంటే.. తనకు తానుగా కాకుండా.. పార్టీనే స్వయంగా వెళ్లగొట్టేలా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే.. కోమటిరెడ్డి మొదటి నుంచీ ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయినప్పుడు.. ఆ…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై.. మాజీ ఎంపీ మధు యాష్కీ ఫైర్ అయ్యారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి… ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీ మరియు సోనియా గాంధీ కారణమని చురకలు అంటించారు. పార్టీ నిర్ణయం కాదని సమ్మేళనం కి వెళ్ళటం పార్టీని నష్ట పర్చడమేనని ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా విజయమ్మ చేసిన వ్యాఖ్యలు కోమటిరెడ్డి సమర్ధిస్తారా..? అని నిలదీశారు. కాంగ్రెస్ నుండి బయటకు వెళ్లాలని అనుకుంటే వెళ్లొచ్చని… కానీ పార్టీ…
వైఎస్ విజయమ్మ నేతృత్వంలో నిన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంస్మరణ సభ జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సంస్మరణ సభకు తెలంగాణ మరియు ఏపీ నుంచి కీలక రాజకీయ నేతలు వచ్చారు. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినేట్ లో పనిచేసిన మంత్రులు ఈ సభకు హజరయ్యారు. ఇందులో భాగంగానే… కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… సంచలన వ్యాఖ్యలు చేశారు.…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంటే రాజకీయ మహామహులకు కేంద్రం. అందులో ఎవరు.. ఎప్పుడు.. ఎలా స్పందిస్తారు.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.. తమకు అనుకూలంగా రాజకీయపరమైన పరిణామాలు ఎలా క్రియేట్ చేసుకుంటారు అన్నది ఆసక్తికరంగానే ఉంటుంది. తాజాగా.. ఈ టాపిక్ కు.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కారణం అయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా తీవ్రంగా వ్యతిరేకించి.. భంగపడి.. చివరికి పీసీసీ పోస్టు అమ్ముడుపోయిందని సంచలన ఆరోపణలు చేసి.. ఇప్పటి వరకూ రేవంత్…
యాదాద్రి జిల్లా తుర్కపల్లి(మ) రాంపూర్ తండా దళిత – గిరిజన దండోరా దీక్ష లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడో, బలహీన వర్గాలకు చెందిన వాళ్లే ముఖ్యమంత్రి. వాసాలమర్రి కి సీఎం కేసీఆర్ ఎప్పుడు వచ్చిన అడ్డుకుంటాం. దళిత బంధుతో ముఖ్యమంత్రి కేసీఆర్ బొంద తొడుకుండు ఆ బొంద మేమే పుడుస్తాం. సీఎంఓ రాహుల్ బోజ్జ చోటు ఇవ్వగానే దళితలందరికి ఇచ్చినట్టా అని ప్రశ్నించారు.…
తెలంగాణ కాంగ్రెస్లో ఉప్పు నిప్పులా ఉన్న ఆ ఇద్దరు నాయకుల మధ్య దోస్తీ సాధ్యమా? ఆ ఇద్దరినీ కలిపేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? కుస్తీకే ప్రాధాన్యం ఇచ్చి.. ఎవరి ఎత్తుగడలు వారు వేస్తారా? అందరి ఫోకస్ ఆ ఇద్దరిపైనే ఎందుకు ఉంది? రేవంత్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు! తెలంగాణ కాంగ్రెస్ దళిత గిరిజన దండోరా పేరుతో జనంలోకి వెళ్తోంది. ఇంద్రవెల్లి నుండి ప్రారంభమైన దండోరా.. ఈ నెల 18న ఇబ్రహీంపట్నంలో మరో సభకు…
ఇంద్రవెల్లిలో దళిత ఆత్మగౌరవ దండోరా సభ పేరుతు భారీ బహిరంగ సభ నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది… ఇక, దానికి కొనసాగింపుగా… తర్వాత సభ ఈ నెల 18వ తేదీన ఇబ్రహీంపట్నం వేదికగా నిర్వహిస్తామంటూ… ఇంద్రవెల్లి సభ వేదికగా ప్రకటించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… అయితే, ఇప్పుడా సభను రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ… ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన తలపెట్టిన దళిత గిరిజన దండోరా సభను రద్దు చేసిన టి.పీసీసీ.. మహేశ్వరం…
కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. వాసాలమర్రిలో ఇచ్చినట్టుగా.. భువనగిరి పార్లమెంట్ వ్యాప్తంగా దళిత బంధు ఇస్తే.. ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించారు కోమటిరెడ్డి.. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో పోటీకూడా చేయనని స్పష్టం చేశారు. కావాలంటే బాండ్ కూడా రాసిస్తానన్నారు. నల్గొండ జిల్లా చౌటుప్పల్లోజరిగిన కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కోమటిరెడ్డి… నియోజకవర్గ అభివృద్దే నాకు ముఖ్యమని.. తర్వాతే పదవులు అన్నారు. ఇక, ఎవరు…
తెలంగాణకు నది అంటేనే మూసి… దానిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది అని చౌటుప్పల్ కాంగ్రెస్ కార్యాలయంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మూసి ప్రక్షాళన కోసం రేపు పార్లమెంట్ లో మాట్లాడుతా అని తెలిపారు. హిట్లర్ బతికుంటే కేసీఆర్ ను చూసి ఏడ్చేవాడు. సీఎం వాసలమర్రి కి రెండు సార్లు వస్తే,ఎంపీ గా నాకు సమాచారం ఇవ్వలేదు .ఈ ప్రబుత్వం లో ప్రతిపక్ష ఎమ్మెల్యే, ఎంపీ లకు ప్రోటోకాల్ ఇవ్వరు. సీఎం పక్కన కూర్చుంటే ఆయన…
కోమటిరెడ్డి బద్రర్స్పై మరోసారి ఫైర్ అయ్యారు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి.. సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డిని చూసి సొంత నియోజకవర్గ ప్రజలే చీదరించుకుంటున్నారని వ్యాఖ్యానించారు.. కోమటిరెడ్డి బ్రదర్స్.. ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారన్న ఆయన.. మీడియా ప్రచారం కోసమే వారి ఆర్భాట౦.. కానీ, ప్రజలకు సేవ చేయాలనే సోయి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. వారి ధ్యాస డబ్బు సంపాదన పైనే ఉంటుంది.. కానీ, పనులు చేయడంలో ఉండదన్న…