ఢిల్లీలో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డితో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. భువనగిరి కోట అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వారసత్వ సంపదగా ఉన్న భువనగిరి కోటకు కేంద్రం తరపున నిధులను మంజూరు చేయాలని కోరారు. 45 నిముషాల పాటు ఈ సమావేశం సాగింది. కోమటిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై కిషన్ రెడ్డితో చర్చించాను. భువనగిరి కోట అభివృద్ధి, మూసినది ప్రక్షాళన, ఫార్మా సిటీ అంశాలను కిషన్ రెడ్డితో చర్చించానన్నారు.…
కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఇకపై రాజకీయపరమైన విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని ప్రకటించారు.. కేవలం ప్రజా సమస్యలు తీర్చేందుకు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని ప్రకటించిన ఆయన.. తనను రాజకీయాల్లోకి లాగవద్దు అని విజ్ఞప్తి చేశారు.. ఇక నుంచి భువనగిరి, నల్గొండ పార్లమెంట్ పరిధిలోని ప్రతి గ్రామంలో పర్యటించి అక్కడ తిష్ట వేసిన సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషిచేస్తానని వెల్లడించారు కోమటిరెడ్డి… గ్రామాల అభివృద్దికి…
కొత్త పీసీసీ అధ్యక్షుడి కోసం సుదీర్ఘ కసరత్తు చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చివరకు రేవంత్ రెడ్డిని కొత్త చీఫ్గా నియమించింది… అయితే, ఆది నుంచి పీసీసీ అధ్యక్ష పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వచ్చిన.. పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి నిరాశే ఎదురైంది. దీంతో.. పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి… పీసీసీ చీఫ్పై చర్చ జరిగిన ప్రతీసారి ఢిల్లీ వెళ్లి మరీ మంతనాలు జరిపిన కోమటిరెడ్డికి పదవి మాత్రం…
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు చూపు లేకనే ఈ పరిస్థితులు వచ్చాయి అని అన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ పరిస్థితి కారణం ప్రధాని మోడీ ,సీఎం కేసీఆరే అని తెలిపారు. గతేడాది అసెంబ్లీలో భట్టి విక్రమార్క అడిగితే ఆరోగ్య శ్రీ లో చేర్చాలని అడిగితే ఒప్పుకున్నాడు. 9నెలలు అవుతున్న ఇప్పటికి అమలు లేదు. ఎన్నికల్లో గెలవడం, నాయకులను కొనడం పైనే కేసీఆర్ దృష్టి ఉంది. ఎంతోమంది చనిపోతున్న కేసీఆర్ కు పట్టింపులేదు. ధనిక రాష్ట్రం…
కాంగ్రెస్ కి చావు లేదు… వచ్చే టోల్లు వస్తారు… పోయే వాళ్ళు పోతారు అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వారం, పది రోజుల్లో పీసీసీ చీఫ్ నియామకం జరుగుతుంది. పీసీసీ చీఫ్ పదవి తప్పితే… ఏ పదవి తీసుకోను. పీసీసీ పదవి ముఖ్య మంత్రి పదవి కాదు. పీసీసీ ఇస్తే రాష్ట్రం అంతా తిరుగుతా.. లేదంటే ఉమ్మడి నల్గొండలో మెజారిటీ సీట్లు గెలిపించే బాధ్యత తీసుకుంటా అని తెలిపారు. నాకు పదవులు ముఖ్యం కాదు. రాజగోపాల్ రెడ్డితో..…
తెలంగాణ సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి… సీఎంగా ఉండి రైతులు, ప్రజలు పట్టించుకోకుండా కాలాయాపన చేస్తున్న కేసీఆర్.. మీకే ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. ఇప్పటికైనా మేల్కొని మీ పార్టీ సమస్యలను ప్రక్కకు పెట్టి ప్రజా సమస్యలపైన దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఇళ్లు కాలుతుంటే చుట్ట అంటించుకున్న చందా సమస్యలను తమకు అనుకూలంగా మార్చుకునే పనులు మానుకోవాలని లేఖలో హితవుపలికిన కోమటిరెడ్డి.. రాష్ట్రంలో ఐకేపీ…
సిఎం కెసిఆర్ పై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ నీకు మానవత్వం ఉందా.. కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చుతాను అని అసెంబ్లీ సాక్షిగా చెప్పావు కాదా ఏమయింది కేసీఆర్ ? అంటూ ప్రశ్నించారు. ఎందుకు కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చడం లేదు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే అధికారం నీకు ఎవరు ఇచ్చారు కేసీఆర్ ? అని నిలదీశారు. కరోనాతో ప్రజలు పిట్టల రాలుతుంటే నీ కంటికి కన్పించడం లేదా..…
కరోనా మహమ్మారి విజృభిస్తున్నప్పటి నుండి ఇప్పటివరకు తెలంగాణాలో 100 మంది జర్నలిస్టులు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. దేశం మొత్తంలో దాదాపు పదిహేను రాష్ట్రాలలో జర్నలిస్టులను “ఫ్రంట్ లైన్ వారియర్స్ ” గా గుర్తించారని… వారికి ప్రత్యేకంగా బెడ్లు కేటాయించి, ఉచిత వైద్యం రాష్ట్ర ప్రభుత్వాలు చేయిస్తున్నాయని వెల్లడించారు. కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ఇతర రాష్ట్రాలు ఆర్ధిక సహాయం కూడా చేస్తున్నాయని… కాబట్టి కరోనాతో మృతి చెందిన…