యాదాద్రి జిల్లా తుర్కపల్లి(మ) రాంపూర్ తండా దళిత – గిరిజన దండోరా దీక్ష లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడో, బలహీన వర్గాలకు చెందిన వాళ్లే ముఖ్యమంత్రి. వాసాలమర్రి కి సీఎం కేసీఆర్ ఎప్పుడు వచ్చిన అడ్డుకుంటాం. దళిత బంధుతో ముఖ్యమంత్రి కేసీఆర్ బొంద తొడుకుండు ఆ బొంద మేమే పుడుస్తాం. సీఎంఓ రాహుల్ బోజ్జ చోటు ఇవ్వగానే దళితలందరికి ఇచ్చినట్టా అని ప్రశ్నించారు. ఇంటికి కిలో బంగారం ఇచ్చిన ఎవరు ఓటు వేయరు అని అన్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఇంటికి పది లక్షలు ఇస్తే నేను రాజీనామా చేస్తా.. పోటీ చేయను. నీ కూతురు కవిత కు టికెట్ ఇవ్వు నేను గెలిపిస్తా అని తెలిపారు.
ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలేకనే కొకపేట భూములు అమ్మిన బ్రోకర్ ముఖ్యమంత్రి కేసీఆర్. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలేరు నియోజకవర్గన్ని దత్తత తీసుకోవాలి. కేసీఆర్ కళ్ళ కింద్ర ఉన్న తెలంగాణ ఆత్మగౌరవ విడిపించాలి. దళిత బంధు తో పాటు గిరిజన బంధు కూడా ఇవ్వాలి. కేసీఆర్ మంత్రివర్గంలో ఏడుగురు రెడ్లు,నలుగురు వెలమల చోటు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క దళితుడికి చోటు ఇవ్వలేదు అని పేర్కొన్నారు.