ప్రస్తుతం సినిమా అభిమానులందరు ఎదురుచూస్తున్న సినిమాల్లో కెజిఎఫ్ 2 ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం ఎన్నో వాయిదాల తరువాత రిలీజ్ డేట్ ని లాక్ చేసింది. ఏప్రిల్ 14 న పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు రికార్డుల మోత మోగించాయి. ఇక…
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో.. ఫ్యామిలీకి కూడా అంటే ఇంపార్టెన్స్ ఇస్తాడు. స్టార్ హీరోయిన్ షాలినిని ప్రేమించి పెళ్లి చేసుకున్న అజిత్ తన కుటుంబాన్ని మీడియాకు దూరంగా ఉంచుతూ ఉంటాడు. అజిత్- షాలినికి ఇద్దరు పిల్లలు. వారుకూడా ఏదైనా ఫంక్షన్స్ లో కనిపించడం తప్ప సినిమా ఫంక్షన్స్ లో అస్సలు కనిపించరు. అయితే ఇక ఇటీవల జరిగిన ఫ్యామిలీ ఫంక్షన్ లో అజిత్ ఫ్యామిలీ సందడి చేసిన విషయం తెల్సిందే. ఆ…
లేడీ సూపర్ స్టార్ నయనతారఅభిమానులకు షాక్ ల మీద షాక్ లు ఇస్తుంది. మొన్నటికి మొన్న విఘ్నేష్ శివం తో సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకొని షాక్ ఇచ్చింది. ఇక నిన్నటికి నిన్న టెంపుల్ లో నుదుటున బొట్టు పెట్టుకొని కనిపించి షాక్ ఇచ్చింది. నయన్ ప్రేమ పెళ్లి విషయం ప్రస్తుతం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెల్సిందే. నాలుగేళ్లు ప్రేమలో ఉన్న ఈ జంట కరోనా సెకండ్ వేవ్ లో…
జీన్స్, దొంగ దొంగ, జోడీ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన హీరో ప్రశాంత్. నిర్మాత త్యాగరాజన్ కొడుకుగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ హీరో అటు కోలీవుడ్ లోను, ఇటు తెలుగులోని తనదైన నటనతో అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ప్రశాంత్, రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఈ హీరో అంధాధూన్ రీమేక్ లో నటిస్తున్నాడు. ఇకపోతే ఈ హీరో గురించిన ఒక వార్త…
ఒక డైరెక్టర్ కి హిట్ పడితే పొగరు ఎక్కువ అవుతుందని కోలీవుడ్ డైరెక్టర్ మిస్కిన్ అనడం ప్రస్తుతం కోలీవుడ్ లో సంచలనం రేపుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు బెంచ్ మార్క్ అయిన మిస్కిన్ తాజాగా జరిగిన ‘సెల్ఫీ’ ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” సినిమా రంగానికి వచ్చే కొత్త దర్శకులు తమ మొదటి సినిమా హిట్ అవ్వగానే వారి ఆలోచన మారిపోతుంది. తమ తదుపరి చిత్రంతో ఈ ప్రపంచాన్నే మార్చేయొచ్చు…
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం బీస్ట్. సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి సాంగ్ అరబిక్ కుత్తు ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి రెండో సింగిల్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. జాలీ…
కోలీవుడ్ స్టార్ హీరో గౌతమ్ కార్తీక్, హీరోయిన్ మంజిమా మోహన్ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లిచేసుకుంటున్నారని వార్తలు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి తమిళ్ సినిమాలో నటించారు. అప్పటినుంచి వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో ఈ జంట పెళ్లి పీటలెక్కుతుందని వార్తలు వైరల్ గా మారాయి. ఇక వైరల్ వార్తలపై మంజిమా స్పందించింది. ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ” గౌతమ్ ప్రేమను నేను…
తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత అస్సలు వారసురాలు ఎవరు అంది ఇప్పటికి మిస్టరీగానే మారింది. ఇప్పటివరకు ఆమె వారసురాలిని నేను అంటే నేను అని చాలామంది మీడియా ముందు రచ్చ చేశారు. ఇక తాజాగా మరో మహిళ తాను జయలలిత, శోభన్ బాబు ల వారసురాలిని అంటూ తహసీల్దార్ కార్యాలయంలో రచ్చ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మధురై తిరుమళ్లువర్ నగర్ కు చెందిన 38ఏళ్ల మీనాక్షి కి మురుగేశన్ అనే వ్యక్తితో వివాహమైంది.…
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా అంటే అవుననే అంటున్నాయి కోలివుడ్ వర్గాలు. ఇప్పటివరకు విజయ్ రాజకీయాల గురించి ఎప్పుడు మాట్లాడిన..అలాంటి ఉద్దేశ్యం లేదని, ప్రస్తుతం సినిమాలపైనే తన దృష్టి అంతా అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ‘ఆలిండియా దళపతి విజయ్ మక్కల్ ఇయక్కం’ పేరుతో ఒక పార్టీ పేరును రిజిస్టర్ చేయించినా .. దాని బలవంతంగా ఉపసంహరించుకునేలా చేశాడు విజయ్.. దీంతో విజయ్ కి రాజకీయాలపై ఆసక్తిలేదని…