Kishan Reddy: అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా మూడు రాజధానులను ఏర్పాటు చేసేందుకు దూకుడు ముందుకెళ్తున్న వైసీపీ ప్రభుత్వానికి కేంద్రమంత్రి కిషన్రెడ్డి షాకిచ్చారు. ఏపీకి అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అమరావతే రాజధాని అని ప్రధాని మోదీ చెప్పారని తెలిపారు. అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఏది చేసినా రాజధాని మారే ప్రసక్తే లేదని కిషన్రెడ్డి తేల్చి చెప్పారు. రాజకీయాల్లో కక్షసాధింపు…
ఆర్థిక క్రమశిక్షణ, అవసరమైన చోట నిధులను సద్వినియోగ పరుచుకోవడం ద్వారానే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి వేగవంతం అవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి, ఎన్ఈసీ చైర్మన్ అమిత్ షా స్పష్టం చేశారు.
మెదక్ జిల్లాలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటించారు. ఈ నెల 9న నర్సాపూర్ లో జరగబోయే బీజేపీ బహిరంగ సభ ఏర్పాట్లను హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరిశీలించారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోకి వచ్చిన ఇంటెలిజెన్స్ పోలీసులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యాలయంలోకి ఎలా వస్తారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఫోన్లు ట్యాప్ చేస్తున్నది సరిపోవడం లేదా? అని తీవ్రంగా మండిపడ్డారు.