Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Amit Shah Chairs 70th Plenary Session Of North Eastern Council In Assam

Amit Shah: ఈశాన్య రాష్ట్రాలకు ఆర్థిక క్రమశిక్షణ అవసరం

Published Date :October 9, 2022 , 10:36 pm
By Mahesh Jakki
Amit Shah: ఈశాన్య రాష్ట్రాలకు ఆర్థిక క్రమశిక్షణ అవసరం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Amit Shah: ఆర్థిక క్రమశిక్షణ, అవసరమైన చోట నిధులను సద్వినియోగ పరుచుకోవడం ద్వారానే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి వేగవంతం అవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి, ఎన్ఈసీ చైర్మన్ అమిత్ షా స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోపాటు రాష్ట్రాల ఆదాయాల విషయంలోనూ ఇదే విధానం అవసరమని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ఎన్ఈసీ (ఈశాన్య రాష్ట్రాల మండలి) 70వ ప్లీనరీ ముగింపు సమావేశంలోఅమిత్ షా మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఎన్ఈఆర్ ప్రాంతం అభివృద్ధి జరగకుండా భారతదేశ అభివృద్ధి సంపూర్ణం కాదన్నది నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందుకే ఈ ప్రాంతంలో శాంతిస్థాపన కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయం తర్వాత ఈ ప్రాంతంలో పరిస్థితులు వేగంగా మారుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. దీనికితోడుగా ఈశాన్యరాష్ట్రాల్లో వరదల కారణంగా ఏటా జరుగుతున్న నష్టాన్ని తగ్గించే దిశగా కూడా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వరదలు, మాదక ద్రవ్యాల ప్రభావం లేని ఈశాన్య రాష్ట్రాల నిర్మాణం దిశగా అందరూ కలిసి పనిచేయాలన్నారు.

ఈశాన్య రాష్ట్రాలు మిగిలిన భారతదేశంతో సమానంగా అభివృద్ధి చేందేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయని, ఇందుకోసం ఈ ప్రాంతంలోని రాష్ట్రాలన్నీ సంపూర్ణ సమన్వయంతో పనిచేసినప్పుడే సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం వ్యాపారానుకూల వాతావరణ నిర్మాణం జరగాలని, తద్వారా ఉపాధి కల్పన, సాధికారత పెరిగేందుకు వీలవుతుందన్నారు. భారతీయ భాషలకు సరైన గౌరవం కల్పించే విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందన్న అమిత్ షా.. నూతన జాతీయ విద్యావిధానం – 2020లో ప్రాంతీయ భాషల్లో కనీసం ప్రాథమిక స్థాయి వరకైనా విద్యాభ్యాసం మాతృభాషలో జరగాలనే విషయాన్ని పొందుపరిచామన్నారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నప్పుడు కమ్యూనికేషన్ కోసం ఒక భాష ఉండాలని ఉద్దేశంతోనే హిందీ భాషను నేర్చుకోవాలని చెబుతున్నామని ఆయన అన్నారు. సేంద్రియ వ్యవసాయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న అమిత్ షా.. ఈశాన్య రాష్ట్రాల్లో సేంద్రియ వ్యవసాయానికి చాలా అవకాశాలున్నాయన్నారు. ఎన్ఈసీ స్వర్ణోత్సవాలు జరుగుతున్న సందర్భంగా.. నవంబర్ 7న షిల్లాంగ్ భారీ కార్యక్రమాన్ని ఏర్పాటుచేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

అంతకుముందు కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 10 శాతం నిధుల సద్వినియోగం విషయంలో ఎన్‌ఈఆర్‌ రాష్ట్రాలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇందుకోసం రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉన్నప్పుడే ఈశాన్య రాష్ట్రాల పురోగతి సాధ్యమవుతుందన్నారు. ఈ ప్రాంతంలో వ్యవసాయాభివృద్ధి కోసం కేంద్ర వ్యవసాయ, డోనర్ మంత్రిత్వ శాఖలు, ఈశాన్యరాష్ట్రాల వ్యవసాయ కార్యదర్శులతో ఏర్పాటుచేసిన ‘అగ్రికల్చర్ టాస్క్ ఫోర్స్’ నివేదిక ఈ నెలాఖర్లోగా సిద్ధమవుతుందని, తదనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని ముందడుగేయాలని కిషన్ రెడ్డి సూచించారు.

Tallest Tree: ఫలించిన మూడేళ్ల నిరీక్షణ.. అమెజాన్‌లో ఆ చెట్టును చేరుకున్న శాస్త్రవేత్తలు

ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించాల్సిన పరిస్థితులను కిషన్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. 500 రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లోని 4,700 గ్రామాల్లో టెలికమ్యూనికేషన్ అనుసంధానత కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్దేశించిన టార్గెట్‌ను చేరుకునేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శులు ప్రత్యేకంగా కృషిచేయాలన్నారు. ఇందుకు అవసరమైన మౌలికవసతుల కల్పనకు సహకరించాలన్నారు. రెండ్రోజులుగా గువాహటిలో జరుగుతున్న ఎన్ఈసీ 70వ ప్లీనరీ సమావేశాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి ఇకపై చేపట్టాల్సి కార్యాచరణ, అడ్డంకులు, వాటి పరిష్కారాలు, రాష్ట్రాల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amit Shah
  • Assam
  • Kishan Reddy
  • North Eastern Council
  • Plenary Session

తాజావార్తలు

  • Nora Fatehi Song Controversy: నోరా ఫతేహి పాట వివాదం.. వివరణ ఇచ్చిన గీత రచయిత.. తప్పు నాది కాదు..!

  • Off The Record: కూటమిలో ఉన్న నమ్మకం లేదా..? రాజమండ్రిలో బీజేపీ మాస్టర్ ప్లాన్..!

  • Off The Record : తంబళ్లపల్లి టీడీపీలో వర్గపోరు.. ఇంచార్జ్ పోస్ట్ కోసం ఫైట్..!!

  • Kakatiya University: కాలేజీలో సీనియర్ల వేధింపులు.. దొంగతనం చేశావని చేసిన అవమానం.. చివరకు యువతి..

  • Chana Dal Payasam: అమ్మమ్మల నాటి ఆరోగ్య రహస్యం.. పంచదార లేకుండా సింపుల్‌గా చేసుకొనే హెల్దీ పాయసం

ట్రెండింగ్‌

  • Pomegranate Benefits: ప్రతిరోజూ ఒక దానిమ్మ పండు.. మీ శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు

  • Swaasa : మీ దగ్గు విని వ్యాధిని చెప్పేస్తుంది.! ఈ కొత్త AI టెక్నాలజీ గురించి తెలుసా.?

  • Ugadi Special : ఉగాది నాడు మనం వేప, బెల్లం ఎందుకు తింటామో మీకు తెలుసా?

  • Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions