Kishan Reddy : అధికార పార్టీ పూర్తిగా దిగజారింది.. వాస్తవాలను వక్రీకరించి ప్రజలను మభ్య పెట్టలేరు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికార పార్టీ పూర్తిగా దిగజారిందని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక ముఖ్యమంత్రి ఉప ఎన్నికలో ఒక గ్రామానికి ఇంఛార్జిగా ఉండడం గతంలో జరగలేదు… భవిష్యత్లో జరగదు అన్నారు. వాస్తవాలను వక్రీకరించి ప్రజలను మభ్య పెట్టలేరని ఆయన అన్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ దత్తత తీసుకుంటామని కేసీఆర్, కేటీఆర్ హామీ ఇస్తారు.. ఆ తరవాత మర్చిపోతారని ఆయన విమర్శించారు. చిల్లర రాజకీయాలు, తొండి ఎన్నికలు చేయాలని అనుకుంటున్నారని కిషన్రెడ్డి ఆరోపించారు. నల్గొండలో గెలిచింది వాళ్ళు… ప్రశ్నలు మమ్మల్ని వేస్తున్నారు…. సమాధానాలు మేము చెప్పాలి.. కనీస నైతిక , మానవతా విలువలు లేకుండా , జ్ఞానం లేకండా బతికి ఉన్న వారికీ సమాధి కట్టే సంప్రదాయం టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిందని ఆయన మండిపడ్డారు.
జేపీ నడ్డా ఇక్కడ పోటీ చేసి గెలిచారా.. అయన సమాధి కట్టే నీచ నికృష్ట చర్యలకు దిగింది అంటూ ఆయన ధ్వజమెత్తారు. దేనికైనా పరిమితులు, లక్ష్మణ రేఖను ఆ పార్టీ దాటిందని, బయ్యారంలో మేము ఎప్పుడు హామీ ఇవ్వలేదు… హామీ ఇచ్చింది కేసీఆర్, కేటీఆర్ స్టీల్ ప్లాంట్ కడతామని చెప్పింది వాళ్లు అని ఆయన వెల్లడించారు. నా దిష్టిబొమ్మ దగ్దం చేశారని, ఉన్మాదానికి కూడా ఒక పరిమితి ఉంటుందని, మా సహనాన్ని అసమర్థగా కల్వకుంట్ల కుటుంబం భావిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. బతికి ఉన్న వారికి నివాళులు అర్పించే సంప్రదాయం కల్వకుంట్ల కుటుంబానిది అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!