Bandi Sanjay: టీఆర్ఎస్ ఇచ్చే డబ్బులు తీసుకోండి.. బీజేపీకి ఓటెయ్యండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Will Definitely Win In Munugode By Elections Says Bandi Sanjay: మునుగోడు ఉప ఎన్నికల కోసం టీఆర్ఎస్ పార్టీ ఇచ్చే డబ్బులు తీసుకొని, తమ బీజేపీకి ఓటు వేయాలని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మునుగోడు ప్రజల్ని కోరారు. గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని అన్నారు. ఫామ్ హౌస్లో పడుకున్న ముఖ్యమంత్రిని.. మర్రిగూడ మండలం లెంకలపల్లికి తీసుకొచ్చిన ఘనత రాజగోపాల్ రెడ్డిది అని పేర్కొన్నారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని.. టీఆర్ఎస్ ఓటమి తథ్యమని జోస్యం పలికారు. చండూరులో నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు రాజగోపాల్ రెడ్డితో పాటు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగానే బండి సంజయ్ పైవిధంగా స్పందించారు.
ఇదే సమయంలో కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం, కుటుంబ పాలన అంతం కోసం తాను రాజీనామా చేశానని అన్నారు. మునుగోడు ప్రజలు తనని ఆశీర్వదించాలని కోరారు. తాను ఎలాంటి ఆర్థిక లబ్ధి పొందలేదని, ఒకవేళ పొందినట్లు నిరూపిస్తే తాను ఏ శిక్షకైనా సిద్ధమేనని సవాల్ చేశారు. బీజేపీ ద్వారా ద్వారా తనకు ఎలాంటి ఆర్థిక లబ్ది జరగలేదన్నారు. కావాలంటే తాను ఏ గుడిలోనైనా ప్రమాణం చేయడానికి సిద్ధమేనన్నారు. మోడీ, అమిత్ షా ఆధ్వర్యంలో భారతదేశం అభివృద్ధి పథంలో సాగుతోందని.. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కోసం మునుగోడులో బిజెపిని గెలిపించాలని పేర్కొన్నారు. అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, కల్వకుంట్ల కుటుంబ అహంకారానికి మధ్య జరుగుతున్న ఉప ఎన్నిక ఇది అని తెలిపారు. రాజగోపాల్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన ఆయన.. టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ఈ ఉప ఎన్నికను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మంటకలిపే విధంగా.. కేసీఆర్ తన పార్టీలో తెలంగాణ అనే పదాన్ని తొలగించారన్నారు.
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!