Home
Kcr
Kcr News
-
స్పోర్ట్స్ హబ్ కోసం గజ్వేల్లో 20 ఎకరాలు
గజ్వేల్ పట్టణానికి సమీపంలో స్పోర్ట్స్ హబ్ను ఏర్పాటు చేసే దిశగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. స్పోర్ట్స్ హబ్ కోసం సిద్దిపేట సర్వే నంబర్ 560/1లో గజ్వేల్ పట్టణానికి కిలోమీటరు దూరంలో 20 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు 20 ఎకరాల భూమిని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ (సాట్స్)కు బదిలీ చేశారు. జిల్లా పాలనాధికారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. గజ్వేల్ స్పోర్ట్స్ హబ్లో ఫుట్బాల్ క్లబ్తోపాటు ఇతర క్రీడా శిక్షణా కేంద్రాలను… -
తెలంగాణలో బీజేపీ విష సర్పం లెక్క పెరుగుతుంది : తమ్మినేని వీరభద్రం
టీఆర్ఎస్, బీజేపీ లపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినని వీరభద్రం తీవ్ర విమర్శలు చేశారు. ఒకప్పుడు సేవ.. పనులు చేస్తే ఓట్లు.. సీట్లు వచ్చేవని, ఓట్లు సీట్లు తెచ్చుకున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కరోనా టైం లో ఒక్క ఐసోలేషన్ కేంద్రం అయినా పెట్టరా..? అని ప్రశ్నించారు. మేము పేదల కోసం ఐశోలేషన్ కేంద్రాన్ని పెట్టాం..గర్వంగా చెప్తాం అని ఆయన అన్నారు. మేము ఓట్లు.. సీట్లు గెలుచుకోవడంలో వెనక పడ్డాం నిజమే.. ఓట్లు వచ్చినా.. సీట్లు రాకపోయినా… -
హెల్త్ వర్కర్లవి ప్రాణాలు కాదా.. ఫీవర్ సర్వేపై షర్మిల ఫైర్
కేసీఆర్ సర్కార్ పై షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ప్రస్తుతం జరగుతున్న ఫీవర్ సర్వేపై ట్విట్టర్ వేదికగా ఆమె కేసీఆర్ప్రభుత్వాన్ని నిదీసింది. ఏ చిన్న సమస్య అయినా ఈ మధ్యన ట్విట్టర్ ద్వారా కేసీఆర్ సర్కార్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటింటికి ఫీవర్ టెస్టులు చేసే హెల్త్ వర్కర్ల ప్రాణాలంటే పట్టింపు లేదా? వాళ్ళ ప్రాణాలు లెక్క లేదా? చీర కొంగులు.. కర్చీఫులు కట్టుకొని సర్వే చేయాల్నా? Read Also: మేడారం సమ్మక్క, సారక్క జాతరకు… -
బీజేపీ..టీఆర్ఎస్ రెండు మాకు సమానమే: తమ్మినేని వీరభద్రం
రేపటి నుండి సీపీఎం రాష్ట్ర మహాసభలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ, టీఆర్ఎస్ను తీవ్రంగా విమర్శించారు. దేశానికి బీజేపీ.. తెలంగాణకు టీఆర్ఎస్ ప్రమాదకరమన్నారు.బీజేపీ…టీఆర్ఎస్ రెండు పార్టీలు మాకు సమానమేనన్నారు. ఈ మధ్య కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటం స్వాగతించదగిన అంశం అని ఆయన పేర్కొన్నారు. Read Also: సీఎం కేసీఆర్కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే పార్టీలతో… -
కేంద్రం మీద నెపం నెట్టి.. గిరిజన ఓట్లు లాక్కునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నం: రాములునాయక్
కేంద్రం మీద నెపం నెట్టి గిరిజన ఓట్లు లాక్కునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గిరిజనుల గురించి మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్కు లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటే ఉన్నది గిరిజనులేనన్నారు. తెలంగాణ వచ్చిన మరునాడే గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు ఇస్తా అన్న కేసీఆర్ ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయడం లేదన్నారు. Read Also: మరిన్ని రైళ్లలో జనరల్ టిక్కెట్లు పెంచే యోచనలో… -
కోర్టులు మొట్టికాయలు వేస్తే కానీ సారుకు బాధ్యతలు గుర్తుకు రావు: షర్మిల
సీఎం కేసీఆర్ పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా రైతుల పంట నష్టంపై నిలదీశారు. రాష్ట్రంలో పలు సమస్యలపై ఇటీవల వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా ప్రతిరోజు స్పందిస్తున్నారు. గతంలో నిరుద్యోగ సమస్య, నోటిఫికేషన్లు, రైతుల ఆత్మహత్యలు, వరి కొనుగోళ్లపై ప్రభుత్వాన్ని నిలదీసింది. తాజాగా ఇటీవల అకాల వర్షాలతో జరిగిన పంట నష్టం, పరిహారంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. Read Also: రాష్ట్రంలో జరిగే దుర్మార్గ చర్యల వెనుక కేసీఆర్,… -
కోవిడ్ పంజా.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
మళ్లీ కోవిడ్ పంజా విసురుతోంది.. దేశవ్యాప్తంగా కొత్త రికార్డుల వైపు కోవిడ్ కేసులు పరుగులు పెడుతున్నాయి.. మరోవైపు తెలంగాణలోనూ కరోనా విజృంభిస్తోంది.. ఈ తరుణంలో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం.. రేపటి నుంచి రాష్ట్రంలో ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు మంత్రి హరీష్రావు.. ప్రజలకు అందుబాటులో మందులు ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపిన ఆయన.. ఫీవర్ సర్వేలో కరోనా లక్షణాలున్నవారికి మెడికల్ కిట్ అందజేయనున్నట్టు తెలిపారు.. హోం ఐసొలేషన్ కిట్లు, టెస్టింగ్ కిట్లు,… -
రైతులకు భరోసా కల్పించేందుకు దొర బయటికి రారు: షర్మిల
కేసీఆర్ ప్రభుత్వం పై షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు. రైతుల మరణాలను ఊటంకిస్తూ ట్విట్టర్ వేదికగా ఆమె తీవ్ర స్థాయిలో కేసీఆర్ పై ధ్వజమెత్తారు. ఓ వైపు రైతులు మరణిస్తున్నా కేసీఆర్కు సోయి లేదంటూ మండిపడ్డారు షర్మిల. దొరా మీరిచ్చే హామీలకే దిక్కులేనప్పుడు, మీరు సాయం చేస్తారనే ఆశ లేక,పత్తికి మిరపకు తెగులు సోకి, పెట్టిన పెట్టుబడి రాక, పంటను కాపాడలేని పురుగుల మందే మమ్మల్ని అప్పుల నుంచి కాపాడుతుందని,రోజుకు ఇద్దరు ముగ్గురు రైతులు చనిపోతున్నాదున్నపోతు మీద వాన… -
కేసీఆర్కి లెఫ్ట్ పార్టీలు దగ్గరయ్యేనా?
తెలంగాణ రాజకీయాల్లో ఆ రెండు పార్టీలు డిఫరెంట్. ఎప్పుడు ఏ జెండా కిందకు వెళ్తాయో.. ఎలాంటి అజెండాను ఎత్తుకుంటాయో ఎవరికీ అర్థం కాదు. ప్రస్తుతం కొత్త దోస్తీకి కసరత్తు చేస్తున్నట్టు టాక్. ఇంతకీ ఏంటా పార్టీలు? టీఆర్ఎస్తో కలిసి పనిచేయడానికి ఉన్న అభ్యంతరాలేంటి?తెలంగాణలో రాజకీయం కాక మీద ఉంది. రెండు, మూడు నెలలుగా టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో తలనొప్పే అని డిసైడ్ అయినట్టు ఉంది టీఆర్ఎస్. కొత్తగా… -
సాయం దొర మాటలకే పరిమితం..కేసీఆర్పై షర్మిల ఫైర్
కేసీఆర్ పై షర్మిల మరోసారి ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. రైతన్నల చావులకు కేసీఆర్ కారణమంటూ దుయ్యబట్టారు. రైతులకు భరోసా ఇవ్వలేని ముఖ్యమంత్రి ఎందుకని షర్మిల ఎద్దేవా చేశారు. సాయం కోసం రోడ్డెక్కిన రైతన్న ఆగ్రహంతో మిమ్మల్ని అడ్డుకొంటారనా? రైతు చావులకు కారణం మీరేనని మిమ్మల్ని నిలదీస్తారనా? కరోనా వస్తుందనా? లేక ముఖ్యమంత్రిగా మీ బాధ్యత కాదనా?మీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారు ఎందుకు దొరగారు? పంట వానపాలు..రైతు కష్టం కన్నీటిపాలు..సాయం దొరమాటలకే చాలు పంట నష్టపోయి,పెట్టిన పెట్టుబడి…
తాజావార్తలు
-
Jitendra Singh: అమిత్ షా కాల్పులకు ఆదేశాలు ఇవ్వరు, మెజిస్ట్రేట్ ఇస్తారు: కేంద్రం క్లారిటీ..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి FIRలో సంచలన విషయాలు..
-
PoK Protest: వారు కూడా భారత్ లాంటి శత్రువులే.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
-
Sandhya Theatre Stampede Case: తొక్కిసలాట కేసు: నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు
-
Price Hike from August 1: ఆగస్టు 1 నుంచి ధరల మోత.. నూనె, సబ్బు, టీవీ, ఫ్రిజ్ నుంచి కార్ల వరకు పెరగనున్న ధరలు..!
ట్రెండింగ్
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!