గడచిన మూడు నాలుగు నెలలుగా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల మరణ మృదంగం మోగుతుందని అధికారికంగానే నిత్యం ఐదు నుంచి పది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ అంశంపై రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. ఒక వైపు వరి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండగా, మరో వైపు మిర్చీ రైతుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని, నెలల తరబడి ధాన్యం కుప్పలపై పడిగాపులు కాస్తోన్న రైతు హఠాత్తుగా శవమై కనిపిస్తోన్న…
రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ జిల్లా స్థాయి శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈ శిక్షణ తరగతుల్లో తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షడు బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్కు మీడియా ద్వారా కొన్ని విషయాలు తెలియజేయాలి అనుకుంటున్నాని బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అర్ధరాత్రి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏక్ నిరంజన్లా నిర్ణయాలు తీసుకుంటూ తుగ్లక్లా…
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్యలు లేని బంగారు తెలంగాణ రావాలంటే దొర అహంకారాన్ని అణిచివేయాలని.. సీఎం కేసీఆర్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా తెలంగాణలో నిరుద్యోగులు, రైతుల ఆత్మహత్యలపై ఆమె స్పందించారు. ట్విట్టర్ వేదికగా …కేసీఆర్ పాలనలో ఆత్మహత్యలు లేని రోజు ఎప్పుడొస్తుందని ప్రశ్నించారు. ఓ రోజు నోటిఫికేషన్స్ లేక చనిపోయే నిరుద్యోగి వంతు…ఓ రోజు పంట కొనకపోవడంతో చచ్చే రైతు వంతు… ఓ రోజు ధరణి…
ఉపాధ్యాయ సంఘాలకు వైఎస్ షర్మిళ మద్దతు తెలిపారు. జీఓ317 రద్దు చేయాలని, జీఓ 317అంతా తప్పుల తడకగా ఉందని షర్మిళ అన్నారు. స్థానికులకు ఉద్యోగాలు దక్కాలని తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. ఈ జీఓ స్థానికులనే స్థానికేతరులను చేసిందన్నారు. Read Also:విద్య రంగానికి ఎక్కువ నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం మాదే: హరీష్రావు పుట్టిన ఊరు, చదువుకున్న ఊరు స్థానికత కాదని ఎలా చెప్తారు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజకీయ లబ్దికోసం జూనియర్, సీనియర్ ఉద్యోగుల మధ్య పంచాయతీ పెడుతున్నారని చెప్పారు.…
ఉద్యోగులు, ఉపాధ్యాయుల పోస్టింగ్ లలో స్థానికతను పరిగణనలోకి తీసుకోకపోవడం గురించి టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు.ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలు ఉద్యోగులు, ఉపాధ్యాయులను మనో వేదనకు గురి చేస్తున్నాయి. ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలలో స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలని లేఖలో కోరారు. ఇంకా ఆయన ఈ లేఖలో రాష్ట్రంలో కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన, బదిలీల కోసం ప్రభుత్వం డిసెంబర్ 6న జీవో నెంబర్ 317ను జారీ చేసింది.…
రైతులు బీజేపీ, టీఆర్ఎస్లపై కోపంగా ఉన్నారని ఇంటెలిజెన్స్ రిపోర్టు రావడంతో ఈ రెండు పార్టీలు కొత్త డ్రామాలు ఆడుతున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. ఇద్దరి ఒప్పందంలో భాగంగానే.. బీజేపీ నిరుద్యోగం అని కొత్త రాగం ఎంచుకుందన్నారు. కేంద్రం ఉద్యోగాలను భర్తీ చేస్తే… తెలంగాణలో ఆరు లక్షల ఉద్యోగాలు వచ్చేవన్నారు. ఎర్రవల్లి నిషేధిత ప్రాంతం కాదు.. అది పాకిస్తాన్ లేదని, దానికి పాస్పోర్ట్ అవసరం లేదని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్.. వరి వద్దు అని చెప్పి తన వ్యవసాయ…
కేసీఆర్ విధానాలతో ప్రొఫెసర్ జయశంకర్ ఆత్మ ఘోషిస్తుందని బండి సంజయ్ అన్నారు. సోమవారం నిర్వహించిన ‘నిరుద్యోగ దీక్ష’ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ దీక్షను భగ్నం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలను గృహ నిర్భందం చేశారు. బీజేపీ దీక్ష అంటేనే కేసీఆర్కు వణుకుపుట్టిందన్నారు. ఇన్ని రోజులు సీఎంకు కోవిడ్ గుర్తుకు రాలేదు. ఈరోజు దీక్షకు వేలాది తరలివస్తున్నారని తెలిశాక కోవిడ్ గుర్తుకొచ్చిందా అంటూ…
రామగుండంలో మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు 500 కోట్లను కేటాయించినట్టు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. దీని నిర్మాణం పూర్తయితే ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. సోమవారం కొత్తగూడెంలో జరిగిన సింగరేణి 100వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో దీనిని ఆమోదించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సూచన మేరకు వైద్య కళాశాలకు ప్రత్యేక నిధుల మంజూరు చేశామని ఎన్.శ్రీధర్ వెల్లడించారు. దీంతో సింగరేణి కార్మికుల 50 ఏళ్ల…
బీజేపీ తలపెట్టిన నిరుద్యోగ దీక్షలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కేసీఆర్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ వచ్చాక నిరుద్యోగులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. కేసీఆర్ నీరోచక్రవర్తిలా పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. ఈ దేశంలో అత్యంత హీనంగా పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అని మండిపడ్డారు. ఫీల్డ్ అసిస్టెంట్లు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని వారికి జీతాలు ఇవ్వడం లేదు. ఏడాదిలో ఎక్కువ రోజులు ఫాంహౌస్లోనే ఉండే ముఖ్య మంత్రి కేసీఆర్ అంటూ ఎద్దేవా చేశారు. ఎంతో…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కాసేపటి క్రితమే హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని… పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఆయనను అరెస్టు చేశారు పోలీసులు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న ఎర్రవేల్లి లో… రచ్చబండ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి భారీ బందోబస్తుతో ఆయన ఇంటి వద్ద పోలీసులను మోహరించారు. పోలీసులు ఎట్టకేలకు…