రైతులు బీజేపీ, టీఆర్ఎస్లపై కోపంగా ఉన్నారని ఇంటెలిజెన్స్ రిపోర్టు రావడంతో ఈ రెండు పార్టీలు కొత్త డ్రామాలు ఆడుతున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. ఇద్దరి ఒప్పందంలో భాగంగానే.. బీజేపీ నిరుద్యోగం అని కొత్త రాగం ఎంచుకుందన్నారు. కేంద్రం ఉద్యోగాలను భర్తీ చేస్తే… తెలంగాణలో ఆరు లక్షల ఉద్యోగాలు వచ్చేవన్నారు. ఎర్రవల్లి నిషేధిత ప్రాంతం కాదు.. అది పాకిస్తాన్ లేదని, దానికి పాస్పోర్ట్ అవసరం లేదని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్.. వరి వద్దు అని చెప్పి తన వ్యవసాయ…
కేసీఆర్ విధానాలతో ప్రొఫెసర్ జయశంకర్ ఆత్మ ఘోషిస్తుందని బండి సంజయ్ అన్నారు. సోమవారం నిర్వహించిన ‘నిరుద్యోగ దీక్ష’ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ దీక్షను భగ్నం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలను గృహ నిర్భందం చేశారు. బీజేపీ దీక్ష అంటేనే కేసీఆర్కు వణుకుపుట్టిందన్నారు. ఇన్ని రోజులు సీఎంకు కోవిడ్ గుర్తుకు రాలేదు. ఈరోజు దీక్షకు వేలాది తరలివస్తున్నారని తెలిశాక కోవిడ్ గుర్తుకొచ్చిందా అంటూ…
రామగుండంలో మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు 500 కోట్లను కేటాయించినట్టు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. దీని నిర్మాణం పూర్తయితే ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. సోమవారం కొత్తగూడెంలో జరిగిన సింగరేణి 100వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో దీనిని ఆమోదించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సూచన మేరకు వైద్య కళాశాలకు ప్రత్యేక నిధుల మంజూరు చేశామని ఎన్.శ్రీధర్ వెల్లడించారు. దీంతో సింగరేణి కార్మికుల 50 ఏళ్ల…
బీజేపీ తలపెట్టిన నిరుద్యోగ దీక్షలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కేసీఆర్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ వచ్చాక నిరుద్యోగులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. కేసీఆర్ నీరోచక్రవర్తిలా పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. ఈ దేశంలో అత్యంత హీనంగా పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అని మండిపడ్డారు. ఫీల్డ్ అసిస్టెంట్లు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని వారికి జీతాలు ఇవ్వడం లేదు. ఏడాదిలో ఎక్కువ రోజులు ఫాంహౌస్లోనే ఉండే ముఖ్య మంత్రి కేసీఆర్ అంటూ ఎద్దేవా చేశారు. ఎంతో…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కాసేపటి క్రితమే హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని… పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఆయనను అరెస్టు చేశారు పోలీసులు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న ఎర్రవేల్లి లో… రచ్చబండ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి భారీ బందోబస్తుతో ఆయన ఇంటి వద్ద పోలీసులను మోహరించారు. పోలీసులు ఎట్టకేలకు…
తెలంగాణలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఈ రోజుల హైదరాబాద్లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిరుద్యోగ దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు నిరుద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ దీక్షలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. తెలంగాణలో నాదర్శ్ షా ప్రభుత్వం నడుస్తుందని, ప్రతి ఇంటికో ఉద్యోగం ఇస్తా అని కేసీఆర్ అన్నాడు.. వచ్చాయా అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ మంత్రి…
సిద్ధిపేట జిల్లా కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ప్రమాద వశాత్తు మృతిచెందిన ఆంజనేయులు కుటుంబాన్ని హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ పరామర్శించి, యాభై వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్పై ధ్వజమెత్తారు.మత్స్యకార కుటుంబంలో పుట్టిన ఆంజనేయులు ఐదు నిమిషాలపాటు నీటిలో మునిగి ఉండగలిగిన వ్యక్తి అని ఈటల అన్నారు. ఆంజనేయులు ఎలా చనిపోయాడో నిగ్గు తేల్చి, ఆర్థికంగా ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నేడు పోలీస్ల పహారతో…
తెలంగాణాలో టికెట్ రేట్లను పెంచేందుకు అనుమతినిస్తూ తెలంగాణ ప్రభుత్వం కొత్త జీవోను జారీ చేసింది. ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ సినిమా ఇండస్ట్రీకి మేలు కలిగేలా తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు చిరంజీవి. ఈ మేరకు “తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు, థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్…
సైన్స్ సిటీలను ఏర్పాటు చేసి, తద్వారా యువతలో సైన్స్ సంస్కృతిని ప్రోత్సహించే కేంద్ర ప్రభుత్వ పథకం SPoCS కింద హైదరాబాద్లో సైన్స్ సిటీ ఏర్పాటుకు ప్రతిపాదనను పంపాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి.కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. జాతీయ ప్రాముఖ్యత కలిగిన అనేక శాస్త్రీయ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థలు హైదరాబాద్ లో ఉన్నాయని స్టేట్ ఆఫ్ ఆర్ట్ సైన్స్…
కేసీఆర్ ఆయన మంత్రులు చెప్పేదొకటి, చేసేదొకటని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.బీజేపకీ ప్రభుత్వం లక్ష్యాలను కేసీఆర్ అమలు చేస్తున్నారని మంవడిపడ్డారు. టీఆర్ఎస్ ఎంపీలు , మంత్రులు ఢిల్లీ వెళ్లి వానాకాలం పంటను కొనుగోలు చేయమని అడగడం విడ్డూరంగా ఉందన్నారు. సమస్య యాసంగి పంటదని వాటి పై మాట్లాడకుండా కేసీఆర్ బీజేపీ తో కుమ్మక్కై నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ వారి…