Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Sabita Indrareddy Criticized The Central Government

అదానీ, అంబానీల రుణాల మాఫీ కోసమే కేంద్రం పని చేస్తోంది: సబితా ఇంద్రారెడ్డి

Published Date :January 13, 2022 , 6:28 pm
By NTV WebDesk
అదానీ, అంబానీల రుణాల మాఫీ కోసమే కేంద్రం పని చేస్తోంది: సబితా ఇంద్రారెడ్డి
  • Follow Us :
  • google news
  • dailyhunt

కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శల దాడులకు దిగారు. గురువారం శంకర్‌పల్లిలోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అదానీ, అంబానీల రుణాల మాఫీ కోసమే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందంటూ ధ్వజమెత్తారు. రైతుల మేలు కోరి తెలంగాణలో ఎన్నో రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తుందన్నారు. మూడు నెలల కాలంలో 50 శాతం ఎరువుల ధరలు పెంచి రైతుల పై ఆర్థిక భారం మోపారన్నారు. కేంద్రం వెంటనే ముఖ్యమంత్రి అభ్యర్థన మేరకు ధరలు తగ్గించకుంటే అడుగడుగునా బీజేపీ నేతలను అడ్డుకుంటామాని ఆమె తెలిపారు.

ఇప్పటికే వరుసగా పెట్రోల్‌, డీజీల్‌ ధరలను పెంచుతూ పోతూ రైతులతో పాటు సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. గ్యాస్ ధర గుది బండగా మారింది..నిత్యావసర ధరలు పెంచుతూ సామాన్యులపై భారం వేశారన్నారు.. రైతు కల్లాల దగ్గరకు వెళ్లి తెలంగాణ ప్రభుత్వం పంట కొనుగోలు చేస్తే నల్లా చట్టాలు తెచ్చి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతుల ప్రాణాలు తీసిందని ఆరోపించారు.. కేంద్రం చిల్లి గవ్వ ఇవ్వకున్న మూడేళ్ళ కాలంలో ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం కట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. మిషన్‌ కాకతీయతో భూగర్భ జలాలు పెంచి చెరువులు, కుంటలు బోరు బావుల్లో జలకళ సంతరించుకునేలా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిందన్నారు. రైతును రాజు చేయటానికి, రాష్ట్రంలో సమస్యలు లేకుండా చేయడానికి సీఎం ఆలోచిస్తుంటే కేంద్రం సమస్యలు ఎలా సృష్టించాలా అని చూస్తోందని ఆరోపించారు.

Also Read

  • Fire Accident : అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
  • KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
  • Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
  • CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు

read Also: కేసీఆర్‌ జైలుకు వెళ్తే దేశమే భగ్గుమంటుంది: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

దేశ,రాష్ట్ర రైతుల పక్షాన ముఖ్యమంత్రి ప్రధానికి ఉత్తరం రాశారన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం మెడలు వంచి ఎరువుల ధరలు తగ్గించేలా చూడాలన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు వడ్లు కొనుగోలు చేయమంటే సప్పుడు చేయరు…అనవసర రాజకీయాలు మాత్రం చేస్తారని విరుచుకుపడ్డారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ శ్రేణులు బీజేపీ నేతలు ఎక్కడిక్కడ అడ్డుకుంటా యన్నారు. నల్లధనం తెచ్చి ఖాతాల్లో వేస్తామన్న మోడీ గారు ఆ డబ్బులు ఎక్కడో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చెప్పాలన్నారు.

Read Also: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన అటవీ విస్తీర్ణం

సీఎం పై వ్యక్తిగత దూషణలకు దిగితే సహించేది లేదన్నారు. ఎంపీలుగా ఇప్పటి వరకు మీరు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని సబితా ఇంద్రారెడ్డి డిమాండ్‌ చేశారు. వరి పంటలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి తెలంగాణ రైతన్నలు పంజాబ్ రైతులను వెనక్కి నెట్టి మొదటి స్థానానికి వచ్చారని గుర్త చేశారు. రైతులకు 24 గంటలు కరెంట్‌ ఇస్తున్నామన్నారు. ప్రతి ఏడాది ఉచిత విద్యుత్‌ పై తెలంగాణ ప్రభుత్వం 10వేల కోట్లు ఖర్చు చేస్తుందని చెప్పారు. ప్రతి ఏటా ఎకరాకు 10 వేలు ఎలాంటి ఫైరవీలు,సిఫార్సులు లేకుండా ఇప్పటివరకు 50 వేల కోట్లు రైతులకు అందించిన గొప్ప ప్రభుత్వం మాది…మా పథకాన్ని కాపీ కొట్టి మేము ఇస్తున్న దాంట్లో సగం కూడా ఇవ్వడం లేదంటూ కేంద్ర ప్రభుత్వంపై సబితా ఇంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • BJP vs TRS
  • central government
  • kcr
  • MINISTER SABITHA INDHIRAREDDY

తాజావార్తలు

  • Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!

  • Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!

  • వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు

  • Fire Accident : అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..

  • KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!

ట్రెండింగ్‌

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions